అంతు చూసేలా.. అన్యాయం చేసేలా..!!
ఉద్యమాలపై పూర్తి నిరంకుశ వైఖరి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, స్టీల్ప్లాంట్, సమగ్రశిక్ష, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు.. ఇలా అందరినీ అణచివేసేందుకు ప్రయత్నించారు. ‘నా అక్కచెల్లెమ్మలు’ అంటూ ప్రేమ నటించే జగన్..
ఉద్యమాలపై జగన్ ఉక్కుపాదం
వైకాపా పాలనలో ఉద్యోగులపై నిరంకుశ వైఖరి
ఈనాడు డిజిటల్, విశాఖపట్నం
‘ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి’ ఉపాధ్యాయ ఉద్యమం సందర్భంగా బాధ్యత గల పదవిలో ఉన్న ఓ సీనియర్ మంత్రి అన్న మాటలివి.
హక్కుల కోసం ప్రశ్నిస్తే అరెస్టులు.. డిమాండ్ల సాధనకు పోరాడితే నిర్బంధాలు.. ఎదురు తిరిగితే దాడులు.. వైకాపా అయిదేళ్ల పాలన ఇలాగే సాగింది.
ఉద్యమాలపై పూర్తి నిరంకుశ వైఖరి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు, స్టీల్ప్లాంట్, సమగ్రశిక్ష, కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు.. ఇలా అందరినీ అణచివేసేందుకు ప్రయత్నించారు. ‘నా అక్కచెల్లెమ్మలు’ అంటూ ప్రేమ నటించే జగన్.. మహిళలపైనా కనీసం జాలి చూపలేదు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు, మధ్యాహ్న భోజన కార్మికులనూ అవస్థలకు గురి చేశారు. వారికి మద్దతు తెలిపిన ప్రతిపక్షాలు, వామపక్ష, అఖిలపక్ష కార్మిక, ప్రజాసంఘాల నాయకులనూ అరెస్టు చేశారు.
ఉపాధ్యాయులపై దమనకాండ: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు, పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ, బకాయిల విడుదల, తదితర డిమాండ్లను ఉపాధ్యాయులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో ఏటీఎఫ్, యూటీఎఫ్ తదితర సంఘాల ఆధ్వర్యంలో పలుమార్లు శాంతియుత ఆందోళన చేపట్టారు. సీపీఎస్ రద్దు చేయాలంటూ 2022లో ముఖ్యమంత్రి కార్యాలయ ముట్టడికి యూటీఎఫ్ పిలుపునిచ్చింది. ఆందోళనకు వెళ్లకుండా పాఠాలు చెప్పే సమయంలోనూ పోలీసులు కాపలా ఉన్నారు. ఆ కార్యక్రమానికి బయలుదేరిన జిల్లాకు చెందిన ఉపాధ్యాయులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు.
పారిశుద్ధ్య కార్మికులపై కాఠిన్యం: డిమాండ్ల సాధనకు సమ్మెకు దిగిన పారిశుద్ధ్య కార్మికులపైనా అధికారులు బెదిరింపులకు దిగారు. విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని నోటీసులిచ్చారు. పీఎం పాలెంలో అధికారులు చెత్త తరలింపు వాహనాలను తీసుకెళ్తుండగా.. మనస్తాపానికి గురైన ఓ కార్మికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
నిరసన శిబిరంలో ఉద్యోగులు
మళ్లీ గెలిస్తే...: ‘ధరలు పెరిగాయి వేతనాలు పెంచాలని కోరితే సీఎం పట్టించుకోలేదు. అయిదేళ్లలో వినతి పత్రం ఇచ్చేందుకూ జగన్ అనుమతించలేదు. మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్మేసే ప్రమాదముంది. పోరాటం అనే పదం వినిపించకుండా అన్ని వర్గాలను అణచివేస్తారు’ అని సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షురాలు పి.మణి పేర్కొన్నారు.
‘ఆశా’లపై ఆక్రోషం: వేతనాలు పెంచాలని, పని భారం తగ్గించాలని, సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ ఆశా కార్యకర్తలు ఫిబ్రవరిలో ‘చలో విజయవాడ’కు పిలుపునిచ్చారు. వారిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. విజయవాడ వెళ్లకుండా ముందస్తు అరెస్టులు చేశారు. మహిళలను ఈడ్చి పడేశారు. వివిధ మార్గాల్లో జిల్లా నుంచి విజయవాడ రైల్వేస్టేషన్, బస్టాండ్లకు వెళ్లిన కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. బస్సులో నూజివీడు తరలించి ఓ కళాశాలలో నిర్బంధించారు. తాగేందుకు మంచినీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకూ అవకాశమివ్వకుండా ఇబ్బంది పెట్టారు. జీవీఎంసీ కార్యాలయం ఎదుట శాంతియుతంగా నిరసన తెలిపిన కార్యకర్తలనూ పోలీసులు ఇబ్బంది పెట్టారు.
‘అంగన్వాడీ’లపై ఎస్మా ప్రయోగం: జీతాల పెంపు, సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని అంగన్వాడీ కార్యకర్తలు గతేడాది డిసెంబరులో సమ్మె చేపట్టారు. సమ్మె విరమించకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరికలు జారీ చేశారు. జనవరిలో కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిస్తే.. ఎక్కడికక్కడ పోలీసులు రోప్ పార్టీలతో అడ్డుకున్నారు.వ్యానుల్లో ఎక్కించి, స్టేషన్కు తీసుకెళ్లారు. సమ్మె అణిచివేయడానికి ఎస్మా చట్టాన్ని ప్రయోగించగా రద్దు చేయాలని ఆందోళన చేపట్టిన అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జవనరిలో ‘చలో విజయవాడ’కు పిలుపునిస్తే.. ముందు రోజు రాత్రి పోలీసులు ప్రతి అంగన్వాడీ ఇంటికి వెళ్లి తనిఖీలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
చిరంజీవిని కలిసిన గంటా
[ 19-05-2024]
భీమిలి అసెంబ్లీ అభ్యర్థి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం హైదరాబాద్లో సినీ నటులు, మెగాస్టార్ చిరంజీవిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
కీలక పోరు.. ఓటర్ల జోరు
[ 19-05-2024]
విశాఖ లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం బాగానే పెరిగింది. -
ఎన్నికల ఖర్చులకు రూ.12 కోట్లు విడుదల
[ 19-05-2024]
జిల్లాలోని ఏడు అసెంబ్లీ, ఒక లోక్సభ స్థానానికి నిర్వహించిన ఎన్నికల ఖర్చు కోసం రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా రూ.12 కోట్లు విడుదల చేసింది. -
పోలింగులో యువ వెల్లువ
[ 19-05-2024]
ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకోడానికి వెల్లువలా తరలివచ్చారు. -
ఓట్ల గణనకు 14 టేబుళ్లు.. 800మందికి పైగా సిబ్బంది
[ 19-05-2024]
జిల్లాలో ఆరు నియోజకవర్గాల్లో పోలైన ఓట్లు లెక్కింపునకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
‘అందరి సహకారంతో చందనోత్సవం విజయవంతం’
[ 19-05-2024]
సింహాచలం దేవస్థానం తొలిసారిగా ప్రవేశపెట్టిన విద్యుత్తు బస్సును అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు శనివారం ప్రారంభించారు. -
తెలంగాణ ఎప్సెట్ ఫలితాల్లో సత్తా
[ 19-05-2024]
తెలంగాణ రాష్ట్ర ఎప్సెట్ ఫలితాలలో నగరానికి చెందిన విద్యార్థులు ప్రతిభ చూపారు. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు