logo

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమావేశం

ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994-95లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు సోమవారం రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఎస్టేట్‌లో అత్మీయ సమావేశం నిర్వహించారు. 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంతా కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారంతా

Published : 18 Jan 2022 05:35 IST


నెల్లిమర్ల ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994-95లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు సోమవారం రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఎస్టేట్‌లో అత్మీయ సమావేశం నిర్వహించారు. 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అంతా కలుసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వారంతా ఒక్కచోట కలవడంతో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా పలువురి నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం గురువులకు జ్ఞాపికలను అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని