నేర వార్తలు
విజయనగరంలోని బీసీ కాలనీ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
రైలు ఢీకొని వృద్ధుడి దుర్మరణం
విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: విజయనగరంలోని బీసీ కాలనీ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. డెంకాడ మండలం పినతాడివాడ గ్రామానికి చెందిన మీసాల పైడినాయుడు(77) కొన్నాళ్లుగా నగరంలోని బీసీ కాలనీ సమీపంలో ఉన్న ఓ విద్యాసంస్థలో కాపలాదారునిగా పనిచేస్తున్నారు. ఉదయం విధి నిర్వహణలో భాగంగా పట్టాలు దాటి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్సై రవివర్మ తెలిపారు.
వాహనం పైనుంచి పడి మహిళ మృత్యువాత
గుమ్మలక్ష్మీపురం/పార్వతీపురం పట్టణం, న్యూస్టుడే: ద్విచక్రవాహనం వెనుక కూర్చున్న ఓ మహిళ ప్రమాదవశాత్తూ కింద పడి మృతి చెందిన ఘటన గుమ్మలక్ష్మీపురం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రెల్ల గ్రామానికి చెందిన మండంగి పంచమి(35) సోమవారం ఓ వ్యక్తితో కలిసి బైక్పై వెళ్తుండగా కోసంగిభద్ర సమీపంలో కళ్లు తిరిగి పడిపోయారు. తలకు తీవ్రగాయం కావడంతో భద్రగిరి ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో జిల్లా కేంద్రానికి రిఫర్ చేశారు. మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
యువకుడి ఆత్మహత్య
విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్టుడే: నగరంలోని రైల్వేస్టేషన్ ప్రాంగణంలో ప్లాట్ఫాం- 4 సమీపంలో రైలు కింద పడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. బొండపల్లి మండలానికి చెందిన ఎన్.సన్యాసి(23) కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం కోసం విజయనగరం వచ్చి తిరిగి వెళ్లే సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి ఎవరూ లేరని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించినట్లు రైల్వే ఎస్సై రవివర్మ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
శాలకు నిప్పు: నిందితుడికి జైలు
తెర్లాం, న్యూస్టుడే: పశువుల శాలకు నిప్పుపెట్టి అందులోని ఆవు, లేగదూడ మృతికి కారకుడైన వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.4 వేలు జరిమానా విధిస్తూ బొబ్బిలి పీజేసీజే, జేఎఫ్సీఎం కోర్టు మేజిస్ట్రేట్ సరోజనమ్మ సోమవారం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై ఆర్.రమేష్ తెలిపారు. సోమవారం పోలీసు స్టేషన్లో ఆయన విలేకరులకు ఈ కేసు వివరాలు వెల్లడించారు. తెర్లాం మండలంలోని రాజయ్యపేటకు చెందిన రెడ్డి సింహాచలం గతేడాది మార్చి 14న అదే గ్రామంలో ఉన్న పశువుల శాలను కాల్చేశాడు. దీంతో అందులోని ఆవు, దూడ సజీవదహనమయ్యాయి. దీనిపై అప్పట్లో బాధితుల నుంచి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టులో హాజరు పరిచారు. కేసు విచారణలో నేరం రుజువు కావడంతో పైవిధంగా తీర్పు ఇచ్చారని, కేసును ప్రభుత్వ న్యాయవాది నరేష్ వాదించారని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పసుపు సంద్రం
[ 26-04-2024]
సాలూరు పట్టణంలోని జాతీయ రహదారి పసుపు సంద్రంగా మారింది. కూటమి అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి గురువారం ఎన్నికల నామపత్రం సమర్పించి, ప్రచార ర్యాలీ నిర్వహించారు. -
మామయ్య రాసిన మరణ శాసనం
[ 26-04-2024]
‘అక్క.. చెల్లెమ్మకు అండగా మీ అన్న జగన్ ఉన్నాడు. మీ పిల్లల బాధ్యతను మేనమామగా తీసుకుంటా’ అంటూ ఎన్నికల ముందు, తర్వాత అనేక సందర్భాల్లో సీఎం పలికిన ప్రగల్భాలివి. -
రామనారాయణంలో ఆర్టీసీ బస్సు బీభత్సం
[ 26-04-2024]
విజయనగరం మండలం రామనారాయణం సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనాన్ని ఓ ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు దుర్మరణం చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. -
జేఈఈలో మనోళ్ల సత్తా
[ 26-04-2024]
జేఈఈ ప్రధాన పరీక్ష- 2024 ఫలితాల్లో ఉమ్మడి జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. బుధవారం రాత్రి విడుదలైన ఫలితాల్లో అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. -
జగన్ ఏలుబడిలో చేనేతకూ రిక్తహస్తమే
[ 26-04-2024]
చేనేత కార్మికులంతా కష్టాల్లో ఉన్నారు.. ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదు.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీ కష్టాలు తీరుస్తా.. అన్ని విధాలా అండగా ఉంటా.. ప్రతి ఇంటికీ బ్యాంకు రుణాలు, నేతన్న హస్తం అందిస్తాం. -
నమ్మించి.. నట్టేట ముంచారు
[ 26-04-2024]
ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించారు.. ఓట్లు వేయించుకున్నాక వారికి ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ పింఛనుదారుల సమస్యలు తీర్చుతామని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు జరిగేందుకు కృషి చేస్తానని మాటిచ్చారు. -
అత్యంత కీలకం.. అయినా నిర్లక్ష్యం
[ 26-04-2024]
రామభద్రపురం ఆర్టీసీ కాంప్లెక్సు వద్ద నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్ఘడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులతో ఈ ఆర్టీసీ కాంప్లెక్సు నిత్యం రద్దీగా ఉంటుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్