నిలిచిన రేషన్!
ఎండీయూ వాహనాల ఆపరేటర్ల వర్క్డౌన్తో శనివారం రెండు జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిచిపోయింది. బీమా పేరుతో ఆపరేటర్ల ఖాతాల నుంచి ఒక్కో ఎండీయూకి రూ.18,890 మొత్తాన్ని బ్యాంకులు మినహాయించడాన్ని నిరసిస్తూ వారంతా వర్క్డౌన్కు పిలుపునిచ్చారు.
ఎండీయూ వాహన ఆపరేటర్ల వర్క్డౌన్
రెండు జిల్లాల్లో తిరిగినవి 27 వాహనాలే
విజయనగరం తహసీల్దార్ బంగార్రాజుకు వినతిపత్రం ఇస్తున్న ఎండీయూ వాహనదారులు
విజయనగరం అర్బన్, న్యూస్టుడే: ఎండీయూ వాహనాల ఆపరేటర్ల వర్క్డౌన్తో శనివారం రెండు జిల్లాల్లో ఇంటింటికీ రేషన్ పంపిణీ నిలిచిపోయింది. బీమా పేరుతో ఆపరేటర్ల ఖాతాల నుంచి ఒక్కో ఎండీయూకి రూ.18,890 మొత్తాన్ని బ్యాంకులు మినహాయించడాన్ని నిరసిస్తూ వారంతా వర్క్డౌన్కు పిలుపునిచ్చారు. తమ సమస్యను పరిష్కరిస్తే కానీ రేషన్ పంపిణీ చేయమని పలు చోట్ల వాహనాలను నిలిపివేశారు. తహసీల్దారు కార్యాలయాల వద్ద నిరసన తెలుపుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. దీంతో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ప్రజలకు రేషన్ అందలేదు. మొత్తం 566 వాహనాలకు 27 తిరిగినట్లు అధికారిక గణాంకాలను బట్టి తెలుస్తోంది. వర్క్డౌన్ కొనసాగితే ప్రజలకు రేషన్ కష్టాలు తప్పవన్నది స్పష్టమవుతోంది.
* ఎండీయూ వాహనాల ద్వారా ప్రతి నెలా ఒకటి నుంచి 17వ తేదీ వరకు ఇంటింటికీ రేషన్ పంపిణీ జరుగుతోంది. వర్క్డౌన్తో సమీప జిల్లాల్లో వీఆర్వోలతో పంపిణీ చేసేలా చర్యలు తీసుకున్నా, ఇక్కడ ఇటువంటి పరిస్థితి లేదని చెబుతున్నారు. స్థానికంగా నేతల ఆదేశాలతో కొన్ని చోట్ల అందించినట్లు తెలిసింది.
చెబుతున్నదిలా..
* గతంలో రాష్ట్ర ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తానని హామీ ఇచ్చింది. నిబంధనల్లో కూడా పొందుపర్చారు. ఇటీవల మంత్రిని కలిసినప్పుడు ప్రభుత్వమే కడుతుందని చెప్పినట్లు కొందరు నిర్వాహకులు ‘న్యూస్టుడే’కు తెలిపారు.
* బ్యాంకులు బీమా ప్రీమియం మొత్తాన్ని జీతాల ఖాతా నుంచి మినహాయిస్తోంది. మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేకపోవడంతో విధులు బహిష్కరించారు.
* 2022లో బీమా నిమిత్తం మినహాయించిన రూ.11,000 మొత్తానికి ఎటువంటి పత్రం ఇవ్వలేదు. ఏటా బీమా మొత్తం పెంచుతున్నారు.
* వాహనమిత్ర పథకం ద్వారా బీమా కింద రూ.పదివేలు మొత్తాన్ని సర్దుబాటు చేస్తామని ప్రభుత్వం చెప్పినా అమలు కాలేదు. మొత్తం ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి.
ఎవరికీ చెప్పకుండానే..
రిజ్వాన్, ఎండీయూ సమాఖ్య యూనియన్ జిల్లా అధ్యక్షుడు
బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు చెప్పకుండా ఖాతాల్లో డబ్బులు తీసేస్తే ఎలా బతకాలి? హమాలీలకు డబ్బులు ఎలా చెల్లించగలం? మేం చేస్తున్నది ప్రభుత్వం, అధికారులపై వ్యతిరేక చర్య కాదు. బ్యాంకుల తప్పుగా భావిస్తున్నాం. ఏటా ప్రీమియం పెంపుపై స్పష్టత ఇవ్వాలి.
ఉన్నత స్థాయిలో చర్చలు
- కె.మధుసూదనరావు, జిల్లా పౌర సరఫరాల అధికారి
ఉన్నతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సమస్య ఆదివారం నాటికి సద్దుమణుగుతుందని భావిస్తున్నాం. ప్రభుత్వం బీమా ప్రీమియాన్ని సర్దుబాటు చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలోని 31 కేంద్రాల్లో శనివారం పాలీసెట్ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఈమేరకు విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల సమన్వయాధికారులు ఆశా రమణి, -
తెదేపాలోకి ముద్దాడ
[ 27-04-2024]
వైకాపా నేత, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉత్తరాంధ్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ముద్దాడ మధు యాదవ్ శుక్రవారం తెదేపాలో చేరారు. -
ప్రజల వద్దకే సేవలంటే ఇలాగేనేమో..
[ 27-04-2024]
గ్రామీణ ప్రజలకు సేవలు మరింత చేరువ చేస్తాం.. ప్రభుత్వ కార్యకలాపాలు అందుబాటులో ఉంచుతాం.. అందుకే గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం.. -
రూ.6.47 కోట్ల బంగారం, వెండి వస్తువుల స్వాధీనం
[ 27-04-2024]
వ్యానులో తరలిస్తున్న రూ.6.47 కోట్ల విలువజేసే బంగారం, వెండి వస్తువులను విజయనగరం జిల్లా డెంకాడ మండలం మోదవలస చెక్పోస్టు వద్ద పోలీసులు శుక్రవారం రాత్రి పట్టుకున్నారు. -
వీటిని చూస్తే.. పేకమేడలే సిగ్గు పడవా!!
[ 27-04-2024]
పేదలకు అన్ని వసతులతో కూడిన ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన సీఎం జగన్మోహన్రెడ్డి.. రేపోమాపో కూలిపోయే పేకమేడలు నిర్మిస్తున్నారు. -
అభివృద్ధిపైనా అక్కసేనా?
[ 27-04-2024]
ప్రభుత్వాలు మారినా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ.. ఇందుకు విరుద్ధంగా ఉంది వైకాపా ప్రభుత్వం తీరు.. ప్రజల అవసరాలతో పని లేదన్నట్లు గత ప్రభుత్వం మంజూరు చేసిన పనులు నిలిపేసి అక్కసు ప్రదర్శించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?