గద్దెనెక్కావ్.. చెరబట్టావ్
ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు.
వైకాపా హయాంలో చెరువులు మాయం
ఫిర్యాదులు పట్టని అధికారులు
ఈనాడు- విజయనగరం, న్యూస్టుడే, విజయనగరం అర్బన్
ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు. ముఖ్యంగా నీటి వనరులన్నింటినీ మాయం చేశారు.. చెరువులను, కోనేర్ల రూపే మార్చేశారు.. కప్పేసి.. కబ్జా చేసేశారు. వాటిని అమ్మి రూ.కోట్లు గడించారు.
రాష్ట్రంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలోనే చెరువులు అధికం. ఇక్కడ 9,186 ఉన్నాయి. వీటి ద్వారా 3.09 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. గత అయిదేళ్లలో పెద్దఎత్తున ఆక్రమణకు గురయ్యాయి. లేఅవుట్లు, భవన నిర్మాణాల సమయంలో కబ్జా చేసేశారు. దాదాపు 5 వేల ఎకరాల వరకు నీటి వనరులు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో ఇంకా ఎక్కువగానే ఆక్రమణలే తప్ప.. అభివృద్ధి లేదు.
వైకాపా పాలనలో చెరువుల అభివృద్ధి కలగానే మిగిలింది. ఏటా తప్పనిసరిగా పూడికలు తీయాలి. తెదేపా హయాంలో నీరు-మీరు, నీరు- చెట్టు తదితర పథకాల ద్వారా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ పనులతో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి అదనపు ఆయకట్టును స్థిరీకరించారు. ఆక్రమణల తొలగింపు ఇందులో భాగంగా ఉండేది. నీటిపారుదల విభాగం ద్వారా గొలుసుకట్టు కోనేర్లను అభివృద్ధి చేశారు. జగన్ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ ఆగిపోయాయి. నాటి పథకాలను ఆపేశారు. కొత్తవీ తీసుకురాలేదు. ఉపాధి పథకం కింద అరకొరగా పూడికలు తీస్తున్నారు. ఇందులో ప్రభుత్వ పాత్ర లేదు.
అందుబాటులోకి 1,111
గ్రామాల్లో పూర్వీకులు, వారి వారసులు, రాజుల కాలాల్లో తవ్విన మంచినీటి చెరువులు నేడు ఉపయోగకరంగా లేవు. వినియోగించక మరుగునపడ్డాయి. గత ప్రభుత్వం ఇలాంటి వాటిని గుర్తించింది. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఏకంగా 1,111 వరకు బాగు చేసి, ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. అంతటా ఆక్రమణలే దర్శనమిస్తున్నాయి.
25 ఎకరాలు మాయం
ఇది గజపతినగరం మండలం కొనిశ గ్రామానికి చెందిన రాజుచెరువు. విస్తీర్ణం 90 ఎకరాలు. ఇందులో 25 ఎకరాల మేర చదును చేసేశారు. వర్షాకాలంలో సమీపంలోని పొలాలు ముంపునకు గురవకుండా గట్లకు గండ్లు సైతం కొట్టేస్తూ అక్కడి ప్రధాన నీటివనరును దెబ్బతీస్తున్నారు. దీని కింద 250 ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ప్రస్తుతం శివారు భూములకు నీరు అందడం లేదు. అధికారులు నోటీసులిచ్చినా పట్టించుకోలేదు.
గర్భాలనూ వదల్లేదు
గరివిడి: శివరాంలో రూపుకోల్పోయిన చెరువు
చీపురుపల్లి నియోజకవర్గంలో దాదాపు 1100 వరకు సాగునీటి చెరువులున్నాయి. వీటి కింద సుమారు 8 వేల హెక్టార్లలో పంట సాగవుతోంది. గడిచిన ఐదేళ్లలో పెద్దఎత్తున కనుమరుగయ్యాయి.
- గరివిడి మండలం చుక్కవలస పరిధిలో 40 ఎకరాల విస్తీర్ణం గల వెదుళ్ల చెరువు గర్భం 5 నుంచి 10 ఎకరాల వరకు కనుమరుగైంది.
- శివరాంలో 24 ఎకరాల విస్తీర్ణంలో గల లక్ష్మణరావు చెరువులో 9 ఎకరాలు మాయమైంది.
- గుర్ల మండలం సామాలమ్మ, మెరకముడిదాం మండలం పద్మనాభ సాగరం తదితర వాటి పరిస్థితీ ఇంతే..
న్యూస్టుడే, గరివిడి
అతడి అనుచరులే..
భోగాపురం మండలం దల్లిపేటలో అక్రమ తవ్వకాలు
నెల్లిమర్ల నియోజకవర్గంలో ఓ కీలక నేత అనుచరులు చెరువులపై దృష్టిపెట్టారు. అభివృద్ధి పేరుతో చదును చేయడం.. అనంతరం మట్టి తరలింపు.. చివరికి ఆక్రమించి, కట్టడాలు నిర్మించడం.. ఈ ఐదేళ్లూ వారికి ఇదే పని. నెల్లిమర్ల మండలంలో 2011కు ముందు 15 చోట్ల ఆక్రమణలు గుర్తించారు. ఈ ఐదేళ్లలో ఆ సంఖ్య 36కు చేరడం గమనార్హం. ఈ మధ్యకాలంలో కొండగుంపాంలోని 59 ఎకరాల సీతమ్మచెరువులో సుమారు రెండెకరాల్లో ఆక్రమణలు జరిగాయి. రైతులు అడ్డుకోవడంతో వెనక్కి తగ్గారు.
న్యూస్టుడే, భోగాపురం
మట్టి తెచ్చి.. చదును చేసి
బొబ్బిలి మండలంలోని పిరిడి గ్రామానికి ఆనుకుని ఉన్న కోనేరును కొందరు కప్పేందుకు యత్నించారు. అధికారులు వెళ్లి హెచ్చరిక బోర్డులు సైతం పెట్టారు. అయినా పట్టించుకోని అక్రమార్కులు చదునుచేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి మట్టి తెచ్చి, పోశారు. కొన్నిరోజులుగా మళ్లీ పనులు చేస్తున్నారు.
న్యూస్టుడే, బొబ్బిలి గ్రామీణం
గట్లపై దుకాణాలే వెలిశాయ్..
విజయనగరం మండలం సారిక రెవెన్యూ రామనారాయణం ఆలయానికి వెళ్లే మార్గంలో ఉన్న ఎర్రబందను అధికార పార్టీ నాయకుల అండతో కొందరు ఆక్రమించుకుంటున్నారు. బందకు ఒక వైపున్న రోడ్డు పక్కన తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకొని, క్రమేనా చదును చేస్తున్నారు. అధికారుల దృష్టికి వెళ్లినా.. వారు ముందుకు రాలేదు.
న్యూస్టుడే, విజయనగరం గ్రామీణం
మింగేస్తున్నారు..
బొబ్బిలి పట్టణంలోని పలు చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి. రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. విలువైన భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. స్థానికంగా 200 ఎకరాల్లో ఉన్న కోటిచెరువు కనుమరుగవుతోంది. 30 ఎకరాల్లో ఆనవాళ్లు కోల్పోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ వనరు ద్వారానే పట్టణంలోని పలు వీధులకు చెందిన వారికి తాగు, సాగునీటి అవసరాలు తీరుతాయి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.
న్యూస్టుడే, బొబ్బిలి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వజ్ర కిరీటంతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ
[ 18-05-2024]
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. -
నిబంధనలు తొక్కి‘పెట్టే’శారు
[ 18-05-2024]
విజయనగరం అర్బన్, గ్రామీణం: గురువారం మధ్యాహ్నం 3 గంటలు.. విజయనగరం తహసీల్దారు కార్యాలయం.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీసు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూమ్ ఉంది. -
ప్రజలకు అందుబాటులో ఉంటాం
[ 18-05-2024]
కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. -
19 నుంచి తోటపల్లిలో కల్యాణ వేడుకలు
[ 18-05-2024]
తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సీతారామస్వామి వార్షిక కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. -
ఏటా రూ.కోట్లు.. పనులకు తూట్లు
[ 18-05-2024]
సాలూరు పట్టణంలోని గాంధీనగర్ నుంచి కొంకివీధి, వేదసమాజం, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు ఉండే వన్వే దారి ఇది. అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. -
ఇదే.. సాలూరు స్మార్ట్ టౌన్షిప్
[ 18-05-2024]
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో మధ్య ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సాలూరులో పట్టణ జాతీయ రహదారి పక్కన కేటాయించింది -
ఆందోళనకు గురువులు సిద్ధం
[ 18-05-2024]
పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
రాష్ట్రంలో ఈవీఎంలకు భద్రత లేదు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యకాండను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు
[ 18-05-2024]
ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన సంఘటన శుక్రవారం గజపతినగరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది -
చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు
[ 18-05-2024]
సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. -
కన్నీటి సంద్రం
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం, జియ్యమ్మవలస, బొండపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. -
దిబ్బలపాలెంలో పులి సంచారం..?
[ 18-05-2024]
భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్చ్..ఇదేం నిర్వహణ?
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల్లో కాలువల తీరు ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ అరెస్ట్
-
మళ్లీ ట్రెండింగ్లోకి రాజమౌళి - మహేశ్ల ప్రాజెక్ట్.. కారణమిదే!
-
23 వరకు ఏపీ, తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు
-
ఐదేళ్లుగా పవిత్రతో నా భర్త సహజీవనం: చందు భార్య శిల్ప
-
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
-
నా మనవడు తప్పు చేస్తే..: ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యం కేసుపై దేవెగౌడ స్పందన