అక్కంపేట వేదికగా అధికారంపై గురి
తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేట వేదికగా కాంగ్రెస్ అధికారంపై గురి పెట్టింది. ఈ నెల 6న రాహుల్గాంధీ వరంగల్ నగరంలో రైతు సంఘర్షణ సభలో పాల్గొని వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు
ఈనాడు, వరంగల్, ఆత్మకూరు, న్యూస్టుడే: తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య జయశంకర్ స్వగ్రామం అక్కంపేట వేదికగా కాంగ్రెస్ అధికారంపై గురి పెట్టింది. ఈ నెల 6న రాహుల్గాంధీ వరంగల్ నగరంలో రైతు సంఘర్షణ సభలో పాల్గొని వరంగల్ డిక్లరేషన్ ప్రకటించారు. ఇప్పుడు దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు మళ్లీ హనుమకొండ జిల్లాలోనే హస్తం పార్టీ అంకురార్పణ చేసింది. శనివారం హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేటలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతు రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
రచ్చబండ వద్దే..
అక్కంపేట నడిబొడ్డులోని రావి చెట్టు కింద రచ్చబండ వద్దే ఈ కార్యక్రమం నిర్వహించారు. అక్కంపేట, ఆత్మకూరు మండలంలోని అనేక గ్రామాల నుంచి కాంగ్రెస్ శ్రేణులు జనసమీకరణ చేపట్టారు. రేవంత్రెడ్డి పర్యటన ఆద్యంతం కార్యకర్తలు, నాయకుల హర్షధ్వానాలు, కేరింతల మధ్య సాగింది. వీరి వెంట నియోజకవర్గ బాధ్యులు ఇనగాల వెంకట్రామరెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర నాయకులు అంజన్కుమార్యాదవ్, జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్రెడ్డి, మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, ఎంపీపీ భీమగాని సౌజన్య, మండల అధ్యక్షుడు కమలాపురం రమేష్, మీసాల ప్రకాష్, ఎంపీటీసీ సభ్యురాలు పోగుల ఇందిర, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రచ్చబండలో రేవంత్రెడ్డి తన ప్రసంగం కన్నా ముందే పలువురు రైతులను వేదికపై పిలిచి వారితో మాట్లాడించారు.
రైతుబంధుతో భూస్వాములకే లాభం: వాసల భద్రారెడ్డి
రైతుబంధు కావాలని ఏ రైతు కూడా ప్రభుత్వాన్ని అడగలేదు. రైతుబంధు ఇస్తూ ప్రభుత్వం అనేక రాయితీలు ఎత్తేసింది. ఎరువులు ధరలు పెంచి రైతులను ఇబ్బందులకు గురిచేస్తుంది. పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే చాలు.
ఉద్యమం గురించి మాతో చర్చించేవారు: ముద్దం సాంబయ్య
తెలంగాణ ఏర్పడిన తర్వాత జయశంకర్ స్వగ్రామానికి ప్రభుత్వం ఏం చేయలేదు. గతంలో జయశంకర్ మామిడితోటలో మాతో కూర్చొని తెలంగాణ అంశాలను తెలిపేవారు. పాఠశాల కోసం ఎకరం, యాదవుల కోసం నాలుగు ఎకరాల భూమిని ఇచ్చారు.
యాదవులకు మోసం: ఓదెలు
యాదవులకు ప్రభుత్వం చేసిందేమీలేదు. గొర్రెల పథకం పెట్టి కడప జిల్లాకు పంపించారు. అక్కడి నుంచి వచ్చే లోపు అవి చనిపోయాయి.
కేసు వెనక్కి తీసుకోను: హేమలత
దళిత మహిళనైన నాపై గత ఎంపీటీసీ ఎన్నికల్లో తెరాస నాయకులు.. వారికి ఓట్లు వేయలేదని, దాడి చేయగా ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. కేసును వెనక్కి తీసుకోవాలని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేసును వెనక్కి తీసుకోను.
‘సంతకం చేయొద్దు.. కోర్టుకైనా వెళ్దాం’
ధర్మసాగర్: కుడా ల్యాండ్ ఫూలింగ్తో వందల సంఖ్యలో రైతులు నిరుపేదలుగా మారుతారని ధర్మాపురం గ్రామ బాధిత రైతులు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కలిసి వినతి పత్రం అందించారు. తాము తెరాసకు చెందిన వారమే అయినా మా జీవితాలను కోల్పోతున్నందున మీ వద్దకు వచ్చామంటూ మొర పెట్టుకున్నారు. రేవంత్రెడ్డి స్పందిస్తూ ల్యాండ్ పూలింగ్పై రైతులు సంతకం చేయవద్దని, అవసరమైతే కోర్టుకు వెళ్దామని, మద్దతుగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
భీమారం: ల్యాండ్ పూలింగ్ జీవోను ఎత్తివేయాలని ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట గ్రామాల రైతుల ఆందోళనకు రేవంత్రెడ్డి సంఘీభావం ప్రకటించారు. తిరుగు ప్రయాణంలో వీరిని కలిశారు. రైతు ఐకాస వరంగల్ జిల్లా కన్వీనర్ పెద్దన్నతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పర్యటన సాగిందిలా..
మధ్యాహ్నం 12:57 : అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకున్నారు..
1:30 : జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
1:50 : అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
2:15 : పోచమ్మ గుడి వద్ద కాంగ్రెస్ జెండాను ఎగరవేశారు.
2:29 : రచ్చబండకు చేరుకొని రైతుల సమస్యలు తెలుసుకొని మాట్లాడారు.
3:49 : చిలువేరు జాన్, లత దంపతుల ఇంట్లో భోజనం చేశారు.
4:00 తర్వాత: గీసుకొండ మండలం మొగిలిచర్ల, వరంగల్ మండలం కొత్తపేటలో ల్యాండ్పూలింగ్ రైతులతో మాట్లాడారు.
5:00 హైదరాబాద్కు తిరుగుపయనమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు