కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి.
న్యూస్టుడే, భూపాలపల్లి
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి.. ఇందుకు న్యాయ శాఖ రాష్ట్రంలోని 32 న్యాయస్థానాల్లో ‘ఈ -సేవా కేంద్రాలను’ అందుబాటులోకి తీసుకొచ్చింది.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల హైదరాబాద్లో పర్యటించిన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాల మేరకు జయశంకర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.నారాయణబాబు ప్రధాన కోర్టు ఆవరణలో గత నెల క్రితం ఈ-సేవా కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రత్యేకంగా తయారు చేసిన క్యాబిన్లో ఈ-సేవలను మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు కోర్టు సిబ్బంది ద్వారా తెలిసింది. న్యాయస్థానంలో అవసరమైన ధ్రువపత్రాలు, కేసులకు సంబంధించి సమాచారం, జిల్లా, రాష్ట్ర జాతీయ న్యాయ సేవా అధికార సంస్థల ద్వారా న్యాయ సహాయం, సలహాలు పొందేలా వీలు కల్పించారు. ప్రస్తుతం కక్షిదారులు కేసు వివరాలను తెలుసుకోవాలంటే నేరుగా ఆయా న్యాయస్థానాలకు వెళ్లి సంబంధిత సెక్షన్లను తీసుకోవాల్సి వస్తోంది. ఇలా తీసుకునేటప్పుడు ఆ సెక్షన్లో ఉండే అధికారి పని ఒత్తిడిలో ఉంటే.. అవసరమైన సమాచారం తీసుకోవడానికి కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చేది.. ఒకవేళ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కేసులున్నా వాటికి సంబంధించిన సమాచారం తెలుసుకోవాలంటే కక్షిదారులు విధిగా అక్కడికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో కక్షిదారులు వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వచ్చేది. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ‘ఈ-సేవా కేంద్రం’ ద్వారా కక్షిదారులకు చాలా వరకు ఇబ్బందులు దూరం కానున్నాయి. ఏ కోర్టుకు సంబంధించిన కేసుల సమాచారం కావాలన్నా ఈ కేంద్రం ద్వారా సులభంగా పొందవచ్చు. కేసులకు సంబంధించిన ధ్రువపత్రాలు, సర్టిఫైడ్ కాపీలు కావాలనుకుంటే మాత్రం నిర్ణీత రుసుము చెల్లించి పొందాల్సి ఉంటుంది.
కేంద్రం ఉపయోగాలివే..
- కేసుల స్థితిగతులు, తదుపరి విచారణ తేదీ, సర్టిఫైడ్ కాపీలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ
- హార్డ్కాపీ పిటిషన్ల స్కానింగ్, ఈ-సంతకం, వీటిని సీఐఎస్లోకి దాఖలు చేయడం, ఫైలింగ్ నంబరును జనరేట్ చేయడం వంటి వాటితో పిటిషన్ల ఈ-ఫైలింగ్ చేయడం..
- ఈ- స్టాంప్ పేపర్ల కొనుగోలులో కక్షిదారులకు సహాయపడటం, ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత చరవాణుల్లో ఈ-కోర్ట్సు అనుసంధానం చేయడం, తద్వారా సమాచారం డౌన్లోడ్ చేసుకోవడంలో సహాయపడటం..
- ఈ-ములాఖత్ అపాయింట్మెంట్ ద్వారా జైలులో ఉన్న బంధువులను కలపడానికి సహాయపడటం, సెలవుపైనున్న న్యాయాధికారులకు సంబంధించిన విచారణలకు సమాధానం ఇవ్వడం..
- జిల్లా, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయ సేవాధికార సంస్థల నుంచి ఉచిత ఉచిత న్యాయ సేవలను ఎలా పొందాలనే విషయంలో మార్గనిర్దేశం చేయడం.
- ట్రాఫిక్ చలాన్లు, చిన్న నేరాలకు సంబంధించిన జరిమానా చెల్లింపులను ఆన్లైన్లో చెల్లించేందుకు ఈ- సేవా కేంద్రాల్లో వీలు కల్పించారు. అదేవిధంగా ఈ-కోర్టు సేవల ద్వారా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్న ఇతర సేవల గురించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతా.. ఓటు వేస్తే భవిత మీదే!
[ 07-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువ ఓటర్లు కీలక భూమిక పోషించారు. ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లోనూ వారు ఎటు మొగ్గు చూపితే వారి జెండానే ఎగరనుంది. -
మండుటెండలో భాజపా శ్రేణుల్లో జోష్..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
ప్రశాంత పోలింగ్కు పక్కా ఏర్పాట్లు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి గడువు దగ్గర పడుతోంది. పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. -
ఖర్చుల వివరాలు తప్పనిసరిగా చెప్పాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల వివరాలను అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.ధిలీబన్, ధీరజ్ సింగా పేర్కొన్నారు. -
నగరంలో నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం వరంగల్ నగరానికి రానున్నారు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. -
స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
[ 07-05-2024]
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
‘కడియం మోసాలు అందరికీ తెలుసు’
[ 07-05-2024]
దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. -
తస్మాత్ జాగ్రత్త
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
‘నన్ను, రాజయ్యను జైల్లో పెట్టాలని చూస్తున్నారు’
[ 07-05-2024]
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రతి పనికి అడ్డుపడిన అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉంటే మరింత ప్రగతి
[ 07-05-2024]
కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి, కంచనపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో సోమవారం కార్నర్ సభ నిర్వహించారు. -
బస్తాకు అర కిలో.. ఎకరాకు రూ.250
[ 07-05-2024]
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. -
బలగాల పాగా.. నలువైపులా నిఘా!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటు.. తిరస్కరణకు తావివ్వొద్దు
[ 07-05-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. -
లోక్సభ ఎన్నికలకు భారీ భద్రత
[ 07-05-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి. మే 13న జరిగే లోక్సభ ఎన్నికలకు ఈవీఎంలు చేర్చడం అంత సులువు కాదు. -
ఆయుధంతో జాగ్రత్త.. పేలుతుంది!
[ 07-05-2024]
‘అధికారిక లెక్కల ప్రకారం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 201 లైసెన్స్డ్ ఆయుధాలున్నాయి. ఇప్పటికే 200 మంది ఠాణాల్లో అప్పగించారు. ఒకరు మాత్రం విదేశాలకు వెళ్లారు. ఆయన అనుమతి పొందిన ఆయుధం బ్యాంక్ లాకరులో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.’ -
పోటెత్తిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు
[ 07-05-2024]
ములుగులోని సంక్షేమ భవన్లో ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఓటర్లు రెండో రోజు పోటెత్తారు. బారులుతీరడంతో.. సంక్షేమ భవన్ కిటకిటలాడింది. -
బడుల ప్రారంభం రోజే.. పుస్తకాల పంపిణీ
[ 07-05-2024]
విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది. -
కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి జలాలు
[ 07-05-2024]
పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. -
నాలుగు వేల మందితో ర్యాలీ
[ 07-05-2024]
భాజపా ఆధ్వర్యంలో ములుగులో ఈనెల 7న సాయంత్రం నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల ర్యాలీని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహబూబాబాద్ పార్లమెంటు భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
-
నా జీవితాన్ని మార్చింది.. ‘ఆర్య’పై అల్లు అర్జున్ పోస్ట్