గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం.
కార్పొరేషన్, న్యూస్టుడే
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. గ్రేటర్ వరంగల్ మేయర్, ఉపమేయర్లపై అవిశ్వాసానికి వ్యూహ రచన.. రెండు రోజులుగా వరంగల్ తూర్పు రాజకీయాలు గ్రేటర్ వరంగల్ చుట్టూ తిరుగుతున్నాయి. వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల విలీన గ్రామాల్లోని డివిజన్లలో అలజడి లేకున్నా రాజకీయాలు మాత్రం వేడెక్కాయి.
తెర వెనుక ఎవరు.?
- మేయర్ గుండు సుధారాణి స్థానిక నాయకులతో సంబంధం లేకుండా నేరుగా గాంధీ భవన్కెళ్లి హస్తం కండువా కప్పుకొన్నారు. వరంగల్ తూర్పు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఆమె చేరికను వ్యతిరేకిస్తూ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో తెర వెనుక ఎవరున్నారనే దానిపై నిఘా వర్గాలు, టీపీసీసీ నాయకులు శుక్రవారం ఆరా తీశాయి.
- కార్పొరేటర్లు పైకి మాత్రం సుధారాణి రాకపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా తెరవెనుక మేయర్, ఉపమేయర్లపై అవిశ్వాసానికి అడుగులేస్తున్నట్లుగా తెలుస్తోంది. మేయర్ సుధారాణి రెండేళ్ల పదవి కాపాడుకునేందుకు కాంగ్రెస్లో చేరారనేది బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. హస్తం గూటికి చేరిన సుధారాణిపై అవిశ్వాసానికి కాంగ్రెస్ అధిష్ఠానం అంగీకరిస్తుందా? లేదా? అనేది చర్చనీయాంశంగా మారింది. లోక్సభ ఎన్నికల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
కోటలో కార్పొరేటర్ల సమావేశం
మేయర్ను గద్దె దించే లక్ష్యంగా శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలోని ప్రైవేటు రిసార్ట్లో వరంగల్ తూర్పు కార్పొరేటర్లు అంతర్గతంగా సమావేశమయ్యారు. కాంగ్రెస్, భారాసకు చెందిన 16-17 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. కాంగ్రెస్ కార్పొరేటర్ ఏర్పాటు చేసిన సమావేశంలో భారాసకు చెందినవారు పాల్గొనడం విశేషం. సమావేశంలో అవిశ్వాసం పెట్టడం, మేయర్ పదవికి ఎవరు పోటీ? అనేది చర్చించారు. కాంగ్రెస్కు చెందిన ఓ సీనియర్ కార్పొరేటర్ మేయర్ పదవికి తాను సిద్ధమని ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం అనుమతి ఉంటే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని భారాస కార్పొరేటర్లు హామీ ఇచ్చారు. భారాసకు చెందిన ఉపమేయర్ రిజ్వానా షమీమ్ పదవి కాపాడేందుకు తూర్పునకు చెందిన భారాస కార్పొరేటర్లు మరో షరతు విధించినట్లుగా తెలిసింది.
సుధారాణి రాజీనామా చేయాలి
కరీమాబాద్: మేయర్గా అవకాశం కల్పించిన భారాసని, కార్పొరేటర్లను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరిన గుండు సుధారాణి తక్షణమే కార్పొరేటర్, మేయర్ పదవులకు రాజీనామా చేయాలని వరంగల్ తూర్పు భారాస కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం కార్పొరేటర్ పల్లం పద్మ నివాసంలో వారు విలేకరులతో మాట్లాడారు. డిప్యూటీ మేయర్ రిజ్వానాషమిమ్, కార్పొరేటర్లు దిడ్డి కుమారస్వామి, ప్రవీణ్, సిద్దం రాజు, సువర్ణ, మాజీ కార్పొరేటర్ పల్లం రవి, కార్పొరేటర్ గందె కల్పన భర్త నవీన్ మాట్లాడుతూ సుధారాణి పార్టీ మారడం అనేది భారాస పార్టీని, కార్పొరేటర్లను మోసం చేయడమే అవుతుందన్నారు.ఆమె వైఖరితోనే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు ఓటమి చెందారని ఆరోపించారు.
మేయర్ను కలిసిన కార్పొరేటర్లు
కాంగ్రెస్లో చేరిన తర్వాత మేయర్ గుండు సుధారాణి శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. రామన్నపేటలోని మేయర్ నివాసంలో కార్పొరేటర్లు గుండు చందన, అరుణ విక్టరి, పలు డివిజన్లకు చెందిన కాంగ్రెస్, నాయకులు, కార్యకర్తలు కలిసి అభినందనలు తెలిపారు. రామన్నపేట, రంగశాయిపేట, కొత్తవాడ ప్రాంతాల నుంచి చాలామంది డివిజన్ స్థాయి నాయకులు మేయర్ సుధారాణిని కలిశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హలో.. మీ ఓటు ఎటు?
[ 08-05-2024]
సిద్ధార్థ ఆఫీసుకు ఆలస్యమవుతుంటే.. చకచకా బైక్ తీసి రయ్యిమని వెళుతున్నారు. కొంతదూరం వెళ్లేసరికి ఫోన్ రింగైనట్లు అనిపించింది. -
మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి మధ్య వాగ్వాదం
[ 08-05-2024]
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డిల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆడియో మంగళవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. -
రేవంత్ ప్రసంగం.. కాంగ్రెస్లో ఉత్తేజం
[ 08-05-2024]
వరంగల్ లోక్సభ అభ్యర్థి కడియం కావ్యను గెలిపించాలని కోరుతూ మంగళవారం రాత్రి హనుమకొండ చౌరస్తాలో కాంగ్రెస్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ విజయవంతమైంది. -
హామీలు నెరవేర్చేందుకే పార్టీ మారా..
[ 08-05-2024]
‘గత అసెంబ్లీ ఎన్నికల ముందు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు అమలు చేసి, అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకే కాంగ్రెస్లో చేరాను తప్ప.. పదవులకు ఆశపడి కాదని’ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. మండలంలోని తాటికొండ గ్రామంలో మంగళవారం నిర్వహించిన లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఆయన సింగపురం ఇందిరతో కలిసి పాల్గొని మాట్లాడారు -
మెరుగైన విద్యుత్తు సరఫరాకు చర్యలు
[ 08-05-2024]
వేసవి ఎండల తాపానికి జిల్లాలో విద్యుత్తు వినియోగం పెరిగింది. డిమాండ్కు అనుకూలంగా ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో అధికారులు మెరుగైన సరఫరాకు గత నాలుగు నెలలుగా చర్యలు చేపట్టారు. -
మేడిగడ్డలో.. మూడు గంటలు
[ 08-05-2024]
కాళేశ్వరం ప్రాజెక్టుపై న్యాయ విచారణలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ మంగళవారం మేడిగడ్డ బ్యారేజీలో మూడు గంటల పాటు పరిశీలన చేపట్టారు. -
అకాల వర్షం.. అన్నదాత ఆగమాగం
[ 08-05-2024]
మహబూబాబాద్ జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం పడింది. గాలిదుమారంతో మెరుపులు, ఉరుములతో కుండపోత వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ మార్కెట్లో ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. -
అధిక స్థానాల్లో కాంగ్రెస్దే విజయం
[ 08-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాల్లో ఇప్పటికే ఐదు అమలు చేసింది..రైతుబంధు ద్వారా నిధులు జమచేసింది రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్మున్షీ అన్నారు. -
‘మోదీనే దేశానికి పెద్ద దిక్కు’
[ 08-05-2024]
దేశానికి మోదీనే పెద్ద దిక్కు అని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ గరికపాటి మోహన్రావు అన్నారు -
రోడ్డుపై చెట్టు విరిగిపడి యువకుడి దుర్మరణం
[ 08-05-2024]
ఈదురుగాలుల బీభత్సానికి యువకుడు బలైన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాల గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. -
ఓటేద్దామని మాటిద్దాం..!
[ 08-05-2024]
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైనది. భారత రాజ్యాంగం కల్పించిన మహºన్నత అవకాశాన్ని నగరంలో చాలా మంది ఓటర్లు వినియోగించుకోవడం లేదు. పోలింగ్ రోజు నాయకులను ఎన్నుకోవడానికి ఆసక్తి చూపడం లేదు -
‘కడియం, అరూరికి ఓటుతో బుద్ధిచెప్పాలి’
[ 08-05-2024]
ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఓట్లు అడిగే కాంగ్రెస్ నేతలను ప్రజలు నిలదీయాలని భారాస ఎంపీ అభ్యర్థి డాక్టర్ మారపల్లి సుధీర్కుమార్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రజలకు సూచించారు. -
వన ప్రేమికుడు... వేలుపుల సారయ్య
[ 08-05-2024]
ఆయన వయస్సు 70 ఏళ్లు.. మొక్కల సంరక్షణకు తనదైన శ్రద్ధతో పనిచేసే నిత్య శ్రామికుడు.. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన వేలుపుల సారయ్యకు మొక్కల పెంపకమంటే ఎంతో మక్కువ. ప్రస్తుతం రామన్నగూడెం పంచాయతీ ఆధ్వర్యంలో రోడ్లకిరువైపులా హరితహారం పథకం కింద పెంపకం చేపట్టిన మొక్కలను సంరక్షించే బాధ్యతను చేపట్టారు. -
ఎంపీ ల్యాడ్స్ కేటాయింపు ఇలా..
[ 08-05-2024]
దేశ అభ్యున్నతికి పార్లమెంటు ఒక దిక్సూచి.. ప్రగతికి నాంది అక్కడి నుంచే మొదలవుతుంది.. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైతే ఎన్నో బాధ్యతలు నెరవేరుస్తూ.. కేటాయించే నిధులను ప్రణాళికాబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. -
కమలదళం.. గెలుపు వ్యూహం
[ 08-05-2024]
వరంగల్ లక్ష్మీపురలో బుధవారం భాజపా నిర్వహిస్తున్న భారీగా బహిరంగ సభకు సర్వం సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొనే ఈ సభను కాషాయ శ్రేణులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.