ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు.
న్యూస్టుడే, కార్పొరేషన్
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఇటీవల కాలంలో తెల్లవారుజామున పలువురు కార్మికులు రోడ్డు ప్రమాదాల్లో అసువులు బాస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున కాజీపేట ప్రధాన రహదారిలో చెత్త తరలింపు పనులు చేయిస్తున్న శానిటరీ జవాన్ కొమ్ము దేవయ్యను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందారు. గత నెలలో వరంగల్ లేబర్ కాలనీ గొర్రెకుంట క్రాస్ రోడ్ వద్ద ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలిని లారీ ఢీ కొట్టింది. నిబంధనల ప్రకారం పారిశుద్ధ్య కార్మికులు విధిగా ఆప్రాన్ ధరించాలి. రేడియం స్టిక్కర్లు ఉండటంతో దూరం నుంచి వచ్చే వాహనాలు కార్మికులను గుర్తించే వీలుంటుంది. రెండేళ్లుగా ఇవ్వకపోవడంతో చాలా మంది మసకబారిన పాతవే ధరిస్తున్నారు. చీకట్లో రోడ్లు ఊడుస్తున్న కార్మికులను వాహనాలు ఢీకొడుతున్నాయి.
భయంతో విధుల్లోకి..: మహానగర పాలక సంస్థ ప్రజారోగ్యం, అర్బన్ మలేరియా విభాగాల్లో సుమారు మూడు వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరికి ఏడాదికోసారి పనిముట్లు, దుస్తులు ఇవ్వాలి. ఆప్రాన్లు లేక నగరంలోని ప్రధాన రహదారులు శుభ్రం చేస్తున్న కార్మికులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. రాత్రి వేళ పనిచేసే కార్మికులు భయం భయంగా పనిచేస్తున్నారు. వర్షాకాలంలో రెయిన్ కోట్లు, శీతాకాలంలో చలి కోట్లు, ఎండాకాలంలో టోపీˆలు పంపిణీ చేయడం లేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.
విధి నిర్వహణలో జవాను దుర్మరణం
కాజీపేట టౌన్: వేకువజాము విధి నిర్వహణలో ఉన్న వరంగల్ మహా నగరపాలక సంస్థ జవాన్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన కాజీపేట చౌరస్తాలో చోటు చేసుకుంది. కాజీపేట ఇన్స్పెక్టర్ వై.సుధాకర్రెడ్డి కథనం ప్రకారం.. రోజు మాదిరిగా.. కాజీపేట రహమత్నగర్కు చెందిన జవాన్ కొమ్ము దేవయ్య(50) శుక్రవారం వేకువజామున విధులకు వెళ్లారు. 4.45 గంటల సమయంలో కాజీపేట చౌరస్తా వద్ద పారిశుద్ధ్య కార్మికులతో చెత్తను ట్రాక్టర్లో ఎత్తి వేయిస్తుండగా.. హనుమకొండ వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం వేగంగా వచ్చి ఢీకొట్టి ఆపకుండా వెళ్లిపోయింది. ఎగిరి పడిన దేవయ్య తలకు బలమైన గాయం కావడంతో కార్మికులు 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. అతని కుమారుడు అనుదీప్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకృష్ణ తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తిస్తామని చెప్పారు. మృతదేహానికి ఎంజీఎం మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించిన కుటుంబ సభ్యులకు అప్పగించారు. పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు గాల్లో దీపంలా మారాయని, విధుల్లో ఉన్నవారికి తగిన రక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రూ.60 లక్షలతో ప్రతిపాదనలు
-డాక్టర్ రాజేష్, ముఖ్య ఆరోగ్యాధికారి
పారిశుద్ధ్య కార్మికులకు రెండేసి ఆప్రాన్లు పంపిణీ చేసేందుకు రూ.60 లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం. లోక్సభ ఎన్నికల కోడ్ ఉండటంతో టెండర్లు పిలవలేదు. జూన్ మొదటి వారంలో టెండర్లు పిలిచి, వెంటనే పంపిణీచేస్తాం. పనిముట్లు, మాస్కులు, గ్లౌజులు ఇచ్చేందుకు ప్రతిపాదనలు తయారుచేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతా.. ఓటు వేస్తే భవిత మీదే!
[ 07-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువ ఓటర్లు కీలక భూమిక పోషించారు. ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లోనూ వారు ఎటు మొగ్గు చూపితే వారి జెండానే ఎగరనుంది. -
మండుటెండలో భాజపా శ్రేణుల్లో జోష్..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
ప్రశాంత పోలింగ్కు పక్కా ఏర్పాట్లు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి గడువు దగ్గర పడుతోంది. పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. -
ఖర్చుల వివరాలు తప్పనిసరిగా చెప్పాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల వివరాలను అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.ధిలీబన్, ధీరజ్ సింగా పేర్కొన్నారు. -
నగరంలో నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం వరంగల్ నగరానికి రానున్నారు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. -
స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
[ 07-05-2024]
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
‘కడియం మోసాలు అందరికీ తెలుసు’
[ 07-05-2024]
దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. -
తస్మాత్ జాగ్రత్త
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
‘నన్ను, రాజయ్యను జైల్లో పెట్టాలని చూస్తున్నారు’
[ 07-05-2024]
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రతి పనికి అడ్డుపడిన అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉంటే మరింత ప్రగతి
[ 07-05-2024]
కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి, కంచనపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో సోమవారం కార్నర్ సభ నిర్వహించారు. -
బస్తాకు అర కిలో.. ఎకరాకు రూ.250
[ 07-05-2024]
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. -
బలగాల పాగా.. నలువైపులా నిఘా!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటు.. తిరస్కరణకు తావివ్వొద్దు
[ 07-05-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. -
లోక్సభ ఎన్నికలకు భారీ భద్రత
[ 07-05-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి. మే 13న జరిగే లోక్సభ ఎన్నికలకు ఈవీఎంలు చేర్చడం అంత సులువు కాదు. -
ఆయుధంతో జాగ్రత్త.. పేలుతుంది!
[ 07-05-2024]
‘అధికారిక లెక్కల ప్రకారం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 201 లైసెన్స్డ్ ఆయుధాలున్నాయి. ఇప్పటికే 200 మంది ఠాణాల్లో అప్పగించారు. ఒకరు మాత్రం విదేశాలకు వెళ్లారు. ఆయన అనుమతి పొందిన ఆయుధం బ్యాంక్ లాకరులో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.’ -
పోటెత్తిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు
[ 07-05-2024]
ములుగులోని సంక్షేమ భవన్లో ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఓటర్లు రెండో రోజు పోటెత్తారు. బారులుతీరడంతో.. సంక్షేమ భవన్ కిటకిటలాడింది. -
బడుల ప్రారంభం రోజే.. పుస్తకాల పంపిణీ
[ 07-05-2024]
విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది. -
కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి జలాలు
[ 07-05-2024]
పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. -
నాలుగు వేల మందితో ర్యాలీ
[ 07-05-2024]
భాజపా ఆధ్వర్యంలో ములుగులో ఈనెల 7న సాయంత్రం నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల ర్యాలీని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహబూబాబాద్ పార్లమెంటు భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అభ్యంతరకర వీడియోలున్న.. 25వేల పెన్డ్రైవ్లను పంచారు: కుమారస్వామి
-
రష్యా అధినేతగా ఐదోసారి.. ఘనంగా పుతిన్ ప్రమాణస్వీకారం
-
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
-
టాప్ 5 మలయాళీ చిత్రాలు.. ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
DM చేస్తేనే స్టోరీ.. షేక్ చేస్తే ఫొటో.. ఇన్స్టాలో 4 కొత్త ఫీచర్లు