రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
గోవిందరావుపేట, న్యూస్టుడే: ‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సీతక్క శుక్రవారం గోవిందరావుపేట మండలంలో పర్యటించారు. మచ్చాపూర్లో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. లక్నవరం జలాశయాన్ని సందర్శించి అక్కడే పార్టీ మండలాధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ‘కాంగ్రెస్ దేశానికి ఎంతో మేలు చేసింది. మాటల్లో చెప్పలేనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలకు అండగా నిలిచింది. ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్దే. కొందరు అదేపనిగా పార్టీని విమర్శించడంలో అర్థం లేదని’ అన్నారు. మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోరిక బలరాంనాయక్ గతంలో కేంద్ర మంత్రిగా పని చేసిన సమయంలో ఎన్నో జాతీయరహదారులను, పాఠశాలలను మంజూరు చేయించి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశాడన్నారు. సమష్టి కృషితో తనను ఎలా గెలిపించారో అదే విధంగా బలరాంనాయక్ గెలుపు కోసం కృషి చేయాలని సీతక్క పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, నాయకులు పి.ఎల్లారెడ్డి, కె.శ్రీనివాసరెడ్డి, ఎస్.జనార్దన్రెడ్డి, బి.రవిచందర్, డి.సుధాకర్, ఆర్.సీతారాంనాయక్, జె.సోమయ్య, కె.నాగేందర్రావు, పి.శ్రీకాంత్, ఎస్.జయమ్మ, ఎం.నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతా.. ఓటు వేస్తే భవిత మీదే!
[ 07-05-2024]
గత శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో యువ ఓటర్లు కీలక భూమిక పోషించారు. ఇప్పుడు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లోనూ వారు ఎటు మొగ్గు చూపితే వారి జెండానే ఎగరనుంది. -
మండుటెండలో భాజపా శ్రేణుల్లో జోష్..!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో భాజపా నిర్వహించిన జన సభ విజయవంతమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నా ప్రజలు భారీగా తరలిరావడం కాషాయ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. -
ప్రశాంత పోలింగ్కు పక్కా ఏర్పాట్లు
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక ఘట్టానికి గడువు దగ్గర పడుతోంది. పోస్టల్ బ్యాలెట్, ఇంటి వద్ద ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆధ్వర్యంలో అధికారులు పోలింగ్ ఏర్పాట్లపై దృష్టి సారించారు. -
ఖర్చుల వివరాలు తప్పనిసరిగా చెప్పాలి
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల వివరాలను అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.ధిలీబన్, ధీరజ్ సింగా పేర్కొన్నారు. -
నగరంలో నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం సాయంత్రం వరంగల్ నగరానికి రానున్నారు. -
నాన్నకు భారమై.. అమ్మకు దూరమై!
[ 07-05-2024]
పాపం.. ఆ పిల్లలకేం తెలుసు.. కంటికి రెప్పలా చూసుకునే అమ్మ.. ఆత్మహత్యతో తిరిగి రాలేని లోకాలకు వెళ్లిందని.. బయటకే వెళ్లింది కదా.. కాసేపు అయ్యాక వస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్నారు. -
స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్
[ 07-05-2024]
దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది.. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. -
‘కడియం మోసాలు అందరికీ తెలుసు’
[ 07-05-2024]
దళిత ద్రోహి కడియం శ్రీహరి గురించి నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా వివరించి చెప్పనవసరం లేదని, ఆయన మోసాలు మొత్తం ప్రజలకు తెలుసని భాజపా లోక్సభ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్ అన్నారు. -
తస్మాత్ జాగ్రత్త
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎండల తీవ్రతకు వడదెబ్బ మృతుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. -
‘నన్ను, రాజయ్యను జైల్లో పెట్టాలని చూస్తున్నారు’
[ 07-05-2024]
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ప్రతి పనికి అడ్డుపడిన అభివృద్ధి నిరోధకుడు కడియం శ్రీహరి అని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. -
కేంద్రంలోనూ కాంగ్రెస్ ఉంటే మరింత ప్రగతి
[ 07-05-2024]
కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. రఘునాథపల్లి, కంచనపల్లి, ఖిలాషాపురం గ్రామాల్లో సోమవారం కార్నర్ సభ నిర్వహించారు. -
బస్తాకు అర కిలో.. ఎకరాకు రూ.250
[ 07-05-2024]
రైతులు నిద్రాహారాలు మాని శ్రమించి పండించిన వరి ధాన్యం దళారులపాలు అవుతోంది. ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల వద్ద గోల్మాల్ చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. -
బలగాల పాగా.. నలువైపులా నిఘా!
[ 07-05-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అల్లర్లు, ఘర్షణలకు తావులేకుండా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేస్తున్నారు. -
పోస్టల్ బ్యాలెట్ ఓటు.. తిరస్కరణకు తావివ్వొద్దు
[ 07-05-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సిబ్బంది, సైనికులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ముందస్తుగా ఓటుహక్కు వినియోగించుకుంటున్నారు. -
లోక్సభ ఎన్నికలకు భారీ భద్రత
[ 07-05-2024]
జిల్లాలో అటవీ విస్తీర్ణం ఎక్కువగా ఉంది. మారుమూల ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలున్నాయి. మే 13న జరిగే లోక్సభ ఎన్నికలకు ఈవీఎంలు చేర్చడం అంత సులువు కాదు. -
ఆయుధంతో జాగ్రత్త.. పేలుతుంది!
[ 07-05-2024]
‘అధికారిక లెక్కల ప్రకారం వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 201 లైసెన్స్డ్ ఆయుధాలున్నాయి. ఇప్పటికే 200 మంది ఠాణాల్లో అప్పగించారు. ఒకరు మాత్రం విదేశాలకు వెళ్లారు. ఆయన అనుమతి పొందిన ఆయుధం బ్యాంక్ లాకరులో ఉన్నట్లు పోలీసుల వద్ద సమాచారం ఉంది.’ -
పోటెత్తిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్లు
[ 07-05-2024]
ములుగులోని సంక్షేమ భవన్లో ఏర్పాటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్కు ఓటర్లు రెండో రోజు పోటెత్తారు. బారులుతీరడంతో.. సంక్షేమ భవన్ కిటకిటలాడింది. -
బడుల ప్రారంభం రోజే.. పుస్తకాల పంపిణీ
[ 07-05-2024]
విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పాఠ్య పుస్తకాలు అందజేసేందుకు విద్యాశాఖ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. కొన్నేళ్లుగా సకాలంలో పుస్తకాలు అందకపోవడంతో ఉత్తీర్ణత శాతంపై ప్రభావం పడేది. -
కొత్తగూడ ఏజెన్సీకి గోదావరి జలాలు
[ 07-05-2024]
పాకాల నుంచి గోదావరి జలాలను కొత్తగూడ ఏజెన్సీకి తరలించి రెండు పంటలు సాగయ్యేలా కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. -
నాలుగు వేల మందితో ర్యాలీ
[ 07-05-2024]
భాజపా ఆధ్వర్యంలో ములుగులో ఈనెల 7న సాయంత్రం నిర్వహించనున్న లోక్సభ ఎన్నికల ర్యాలీని పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని మహబూబాబాద్ పార్లమెంటు భాజపా అభ్యర్థి అజ్మీరా సీతారాంనాయక్ కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్లో జరిగే కథ ఇదే!
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!