గంజాయి మత్తు.. యువత చిత్తు
మంచి భవిషత్తు ఉన్న యువతను కొందరు అక్రమార్కులు చెడు మార్గం వైపు మరలుస్తున్నారు. ధనార్జన కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలను చేస్తున్నారు.
ఈనాడు డిజిటల్, జయశంకర్ భూపాలపల్లి, భూపాలపల్లి టౌన్, న్యూస్టుడే: మంచి భవిషత్తు ఉన్న యువతను కొందరు అక్రమార్కులు చెడు మార్గం వైపు మరలుస్తున్నారు. ధనార్జన కోసం గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలను చేస్తున్నారు. సరదాగా అలవాటై అది వ్యసనంగా మారుతోంది. ఈ విష సంస్కృతి పల్లెలకూ పాకుతోంది. జిల్లా మీదుగా అక్రమంగా రవాణా అవుతోంది. గుట్టు చప్పుడు కాకుండా తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
గుట్టుగా విక్రయాలు..
కొంతకాలంగా భూపాలపల్లి పట్టణంలో గంజాయి గుట్టు చప్పుడు కాకుండా విక్రయిస్తున్నారు. అలవాటున్న వ్యక్తులు రహస్యంగా విక్రయదారుల వద్ద కొని.. శివారు ప్రాంతాలకు వెళ్లి సేవిస్తున్నారు. చాలా మంది డబ్బు సంపాదనే ధ్యేయంగా ఈ దందాలోకి దిగుతున్నారు. గంజాయికి బానిసైనవారు అది దొరక్కపోతే ప్రత్యామ్నాయంగా మత్తునిచ్చే రసాయన, జిగురు పదార్థాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఇవెంతో ప్రమాదకరం.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి.. : ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశ నుంచి రహస్యంగా వస్తోంది. ఇటీవల బ్యారేజీ వద్ద పట్టుబడిన వ్యక్తులు ఒడిశ నుంచి తెస్తున్నట్లు పేర్కొన్నారు. కాటారంలో పట్టుబడిన వారు మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినట్లు చెప్పారు. తక్కువ ధరకు తెచ్చి, పొట్లాలుగా తయారు చేసి గ్రాముల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
పట్టుబడుతున్నా..: పోలీసు, ఆబ్కారీ శాఖ వారు కూడా గంజాయి నివారణ కోసం కృషి చేస్తున్నారు. ఐదేళ్లలో 14 కేసులు నమోదు చేసి 46 మందిని అదుపులోకి తీసుకొన్నారు. రూ. 93.90 లక్షల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నారు. యువతకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా వ్యసనాన్ని మానుకోలేకపోతున్నారు.
* ఆర్నెళ్ల క్రితం మహాముత్తారం మండలం యామన్పల్లి వద్ద నలుగురు యువకులు గంజాయితో పట్టుపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో ముగ్గురు మైనర్లున్నారు.
* మల్హర్ మండలంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. పెద్దపల్లి, గోదావరిఖని, రామగిరి ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నట్లు సమాచారం.
* రేగొండ మండలంలో పలుసార్లు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మండలానికి చెందిన పలువురు ఈ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డారు.
* గణపురం, చెల్పూరు, తదితర గ్రామాల్లో విక్రయాలు చేపడుతున్నారు. వలస కూలీలు సేవిస్తున్నారు. ఆర్నెళ్ల క్రితం గాంధీనగర్ క్రాస్ వద్ద సుమారు 200 కేజీల సరకును పట్టుకున్నారు.
* కాటారంలోని చింతకాని క్రాస్ వద్ద ఇద్దరు యువకులు గంజాయితో దొరికారు. ఇందులో ఒకరు మైనర్. అంతకు ముందు కూడా ముగ్గురు పట్టుబడ్డారు. సిరోంచ నుంచి తెస్తున్నట్లు విచారణలో తేలింది.
* ఏప్రిల్ 25వ తేదీన టేకుమట్ల మండలానికి చెందిన ఓ వ్యక్తి, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన ఇద్దరితో కలిసి భద్రాచలం నుంచి గంజాయి తీసుకొస్తూ పోలీసులకు దొరికారు. వారి నుంచి 65 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. రహస్య ప్రాంతంలో నిల్వ చేసి అవసరమున్న వారికి విక్రయిస్తామని నిందితులు విచారణలో అంగీకరించారు.
ఏప్రిల్ 4న మహదేవపూర్ మండలం మేడిగడ్డ బ్యారేజీ వద్ద పోలీసుల తనిఖీల్లో రెండు కార్లలో 4.130 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్టు చేశారు. ఒడిశా నుంచి మహారాష్ట్ర ఔరంగాబాద్కు తరలిస్తుండగా పట్టుబడ్డారు. జిల్లా మీదుగా రవాణా జరుగుతోందని ఈ ఘటన ద్వారా రుజువైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
[ 27-04-2024]
ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. -
గ్రేటర్ చుట్టూ రాజకీయం..!
[ 27-04-2024]
ఓవైపు వరంగల్ లోక్సభ ఎన్నికల ప్రచార హోరు.. మరోవైపు శుక్రవారం రాత్రి ఖిలావరంగల్ కోటలో కాంగ్రెస్, భారాస కార్పొరేటర్లు రహస్య సమావేశం. -
ఆమోదం 73 మంది.. తిరస్కరణ 15 మంది..
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామపత్రాల పరిశీలన పూర్తయింది. వరంగల్ (ఎస్సీ), మహబూబాబాద్ (ఎస్టీ) స్థానాలకు జాతీయ, ప్రాంతీయ, గుర్తింపు పొందిన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 88 మంది 145 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
ప్రమాదంలో పారిశుద్ధ్య కార్మికుల ప్రాణాలు
[ 27-04-2024]
పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని బల్దియా పాలకులు చెబుతున్నారు. ఏడాదికోసారి కార్మికులకు ఇవ్వాల్సిన పనిముట్లు, ప్రమాదాల నుంచి రక్షణ కోసం ఇచ్చే రేడియం స్టిక్కర్ ఉన్న ఆప్రాన్లు ఇవ్వడం లేదు. -
నకిలీ వైద్య కేంద్రాల్లో వైద్యమండలి తనిఖీలు
[ 27-04-2024]
హనుమకొండ జిల్లాలోని నకిలీ వైద్య కేంద్రాల్లో శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కలిసి రాష్ట్ర వైద్యమండలి సభ్యులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్యమండలి పబ్లిక్ రిలేషన్ ఛైర్మన్ డాక్టర్ వి.నరేష్కుమార్ తెలిపారు. -
భానుడు భగభగ.. ప్రయాణికులు విలవిల
[ 27-04-2024]
భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. దాదాపు 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వచ్చిన పలువురు ఎండ ధాటికి విలవిలలాడారు. -
పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సాధారణ ఎన్నికల పరిశీలకురాలు బండారి స్వాగత్ రణ్వీర్చంద్ సంబంధిత అధికారులకు సూచించారు. -
మానుకోట పర్యాటకం.. దృష్టిసారిస్తే అభివృద్ధి పథం
[ 27-04-2024]
కాకతీయుల కాంతిరేఖ రామప్ప శిల్పాలు.. తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర.. వెన్నెల వెలుగుల్లో మనసును ఆహ్లాదపరిచే లక్నవరం.. పాకాల సరస్సులు.. తెల్లని పాలనురగలాంటి బొగత జలపాతం, దక్షిణ అయోధ్యగా కీర్తి గాంచిన భద్రాచలం రాములోరి ఆలయం. -
చాడా.. తొలి పోటీలోనే తిరుగులేని విజయం
[ 27-04-2024]
హనుమకొండకు చెందిన చాడా సురేష్రెడ్డి అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. బీఏ డిగ్రీ పూర్తి చేసిన ఆయన 1990 దశకంలో ప్రముఖ గుత్తేదారుగా గుర్తింపు కలిగి ఉన్నారు. -
ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలపై అధికారుల ఉదాసీనత
[ 27-04-2024]
జనగామ జిల్లా కేంద్రంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు ఆసుపత్రులు, గ్రామాల్లో క్లినిక్లు నిర్వహిస్తున్న వైద్యులు, ఆర్ఎంపీల ప్రాథమిక చికిత్స కేంద్రాల్లో తనిఖీలు చేపట్టడానికి ఇటీవల రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, జిల్లా కలెక్టర్ ఆదేశించడంతో ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. -
కరవు కోరలు.. పశుగ్రాసానికి తంటాలు!
[ 27-04-2024]
వర్షాలు సరిగా లేక పంటలు వేసినా చాలా వరకు చేతికందలేదు.. దీంతో రైతన్నలు పశుగ్రాసానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. మోరంచవాగుకు ఇరువైపులా పంటలు సాగు చేసుకున్న వారి పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది -
కక్షిదారులకు ఈ-న్యాయ సేవలు
[ 27-04-2024]
వివిధ న్యాయస్థానాల్లో కక్షిదారులకు వారి కేసులకు సంబంధించిన సమాచారం, ధ్రువపత్రాలు, న్యాయసహాయం తదితర సేవలు మరింత సులభతరం కానున్నాయి. -
భాజపా ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్కు మద్దతు
[ 27-04-2024]
భాజపా ఓటమే లక్ష్యంగా తమ పార్టీ కాంగ్రెస్కు మద్దతు ఇస్తోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. -
పోలు చిట్టీలొచ్చాయ్..!
[ 27-04-2024]
లోక్సభ ఎన్నికల్లో శాసనసభ నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లకు పోల్ చిట్టీలను పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. -
అనుమతి లేకుండా ల్యాబ్లు నిర్వహిస్తే కఠిన చర్యలు
[ 27-04-2024]
అనుమతి, అర్హతలు లేకుండా డయాగ్నస్టిక్ సెంటర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యాధికారి కళావతిబాయి హెచ్చరించారు. -
వంతెనల నిర్మాణాల్లో తేలిపోతున్న నాణ్యత లోపాలు..
[ 27-04-2024]
దశాబ్దాల పాటు మన్నికగా ఉండాల్సిన వంతెనలు ఉన్నఫలంగా కూలిపోతున్నాయి. ప్రజల రవాణా కష్టాలను మెరుగు పర్చేందుకు నిర్మిస్తున్న వారధుల జీవితకాలం కొద్ది రోజుల్లోనే ముగుస్తోంది. -
రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యం
[ 27-04-2024]
‘కాంగ్రెస్ పార్టీ అంటేనే త్యాగాల పార్టీ.. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ .. ఆ పార్టీ అగ్ర నాయకుడైన రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు పని చేయాలని’ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు