‘భద్రకాళిపై భూబకాసురుల కన్ను’
భూబకాసురుల నుంచి భద్రకాళి చెరువును రక్షించాలని, ఫుల్ ట్యాంకు లెవల్(ఎఫ్టీఎల్) నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలాల్లో మట్టి నింపుతుంటే హనుమకొండ జిల్లా యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ఆరోపించారు.
హనుమకొండ పద్మాక్షిగుట్ట వైపు భద్రకాళి చెరువు స్థలాలు పరిశీలిస్తున్న కాంగ్రెస్ నాయకులు
రంగంపేట, న్యూస్టుడే: భూబకాసురుల నుంచి భద్రకాళి చెరువును రక్షించాలని, ఫుల్ ట్యాంకు లెవల్(ఎఫ్టీఎల్) నిబంధనలకు విరుద్ధంగా చెరువు స్థలాల్లో మట్టి నింపుతుంటే హనుమకొండ జిల్లా యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహిస్తోందని డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు గూండాల పహారాలో 24 గంటలూ మట్టి నింపుతున్నారన్నారు. సోమవారం హనుమకొండ పద్మాక్షిగుట్ట రోడ్డులో ఆక్రమణకు గురవుతున్న భద్రకాళి చెరువు స్థలాలను కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. సుమారు 30- 40 ఎకరాల భూమిని సొంతం చేసుకునేందుకు భారాస నాయకులు యత్నిస్తున్నారని, రెండు, మూడు చోట్ల చెరువు కట్టను తెంచేసి మురుగు నీటిని మళ్లిస్తున్నారని రాజేందర్రెడ్డి ఆరోపించారు. హనుమకొండ పోచమ్మకుంటలోని హనుమాన్ గుడి స్థలాలు వరంగల్లోని వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేశారని విమర్శించారు. పశ్చిమ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ నాయకత్వంలో విజయ్భాస్కర్, సోదా కిరణ్, రంజిత్రెడ్డి విచ్చలవిడిగా కబ్జాలు, ఆక్రమణలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వరంగల్ పోలీసు కమిషనర్ వద్ద నమోదవుతున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం భారాస నాయకులవేనని ఆరోపించారు. హనుమకొండ నగరం నడిబొడ్డున చెరువును కొల్లగొడుతుంటే అధికారులు మౌనంగా ఉండటం సరైంది కాదన్నారు. భద్రకాళి చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు చేస్తామని రాజేందర్రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తాం
ఈనెల 20 లోగా అర్హులైన వారందరికీ రెండు పడకల ఇళ్లు ఇవ్వకపోతే వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్భాస్కర్ ఇంటిని ముట్టడిస్తామని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. డీసీసీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజేందర్రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లవుతున్నా ఇంత వరకు వరంగల్ నగర పరిధిలో ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఇళ్లు ఇప్పిస్తామని పేదల నుంచి డబ్బులు వసూలు చేశారన్నారు. తొమ్మిదేళ్లలో ఏం చేశారని దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని రాజేందర్రెడ్డి ప్రశ్నించారు. కాజీపేట బస్టాండ్, కొత్త ఆర్వోబీ ఏమైందని నిలదీశారు. రింగు రోడ్డు, వరంగల్ మాస్టర్ ప్లాన్పై ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్, కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమాన్, జిల్లా నాయకులు లక్ష్మణ్, సరళాయాదవ్, అనిల్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుషారుగా.. చుట్టొద్దామా...!
[ 17-05-2024]
ఉమ్మడి వరంగల్.. సాంస్కృతిక రాజధాని. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈసారి వేసవిలో ఎండలు మండుతున్నా పర్యాటకులు ఓరుగల్లుకు వరుస కడుతున్నారు. -
ఎన్నికల పుణ్యం.. బడి బాగుకు మార్గం
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో భాగంగా వాటిలో మౌలిక వసతులు కల్పించారు.. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన పనులు చేపట్టారు. -
ఓరుగల్లు.. జలమయం!
[ 17-05-2024]
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. -
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి హరీశ్రావు
[ 17-05-2024]
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఉదయం సందర్శించారు. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో..?
[ 17-05-2024]
సింగరేణి సంస్థ గడిచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు.. ‘ఎల్లో అలర్ట్’
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా కురిసింది. -
‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
[ 17-05-2024]
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. -
ముంపు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
[ 17-05-2024]
గోదావరి వరదతో ముంపునకు గురయ్యే ప్రదేశాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ‘ప్రమాదం పొంచి ఉంది.. -
రైతులను మోసం చేస్తే సహించం
[ 17-05-2024]
రైతులను మోసం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువులు, -
విధుల్లో నిర్లక్ష్యం సరికాదు..
[ 17-05-2024]
ఈ నెల 20 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులన్నింటిని పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. -
రక్తపోటు గుండెకు చేటు..!
[ 17-05-2024]
ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరకెళ్లినా.. అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ (రక్తపోటు) ఉందా? కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు.. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. -
9,99,501 మంది ఓటుకు దూరం..
[ 17-05-2024]
గత సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు కలిపి 9,99,501 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అంటే 29.78 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. -
కమీషన్ల కక్కుర్తి..!
[ 17-05-2024]
గ్రేటర్ వరంగల్ అక్రమాలకు అడ్డాగా మారింది. కమీషన్లు, పర్సంటేజీల కోసం ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం ఎంతకైనా తెగిస్తున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
[ 17-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీప అడవిలో మంగళవారం హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు