ఎవరిదో హస్తవాసి!
ఓరుగల్లు రాజకీయ ముఖచిత్రంలోని పార్టీల్లో రగడ రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు మీదున్న హస్తం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువైంది.
పది స్థానాల్లో పోటాపోటీ
ఈనాడు, వరంగల్: ఓరుగల్లు రాజకీయ ముఖచిత్రంలోని పార్టీల్లో రగడ రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటక ఎన్నికల తర్వాత ఊపు మీదున్న హస్తం పార్టీలో ఆశావహుల సంఖ్య ఎక్కువైంది. డజను నియోజకవర్గాల్లో తాజా సమీకరణాలను పరిశీలిస్తే కాంగ్రెస్ టికెట్ కోసం కొన్ని చోట్ల ఇద్దరేసి పోటీ పడుతుండగా మరికొన్ని చోట్ల త్రిముఖ పోరు తప్పేలా లేదు. బలమైన అభ్యర్థులు లేని చోట్లా అధికార భారాసకు దీటుగా అంగ, ఆర్థిక బలాలున్న అభ్యర్థులు రంగంలోకి దిగడానికి పావులు కదుపుతున్నారు.
వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డి.. తాను పోటీ చేస్తానంటూ పదేపదే ప్రకటిస్తున్నా.. ఇదే స్థానం నుంచి బరిలోకి దిగుతానంటూ జనగామ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే జంగాపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడమే అని ఆయన చెబుతున్నా రాఘవరెడ్డి మాత్రం వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పశ్చిమ నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.
వరంగల్ తూర్పులో ఇద్దరు మహిళా నేతల మధ్య పోటీ నెలకొంది. గతంలో వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ.. మళ్లీ పోటీ చేస్తానంటూ ఇప్పటికే స్పష్టం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్రలో సైతం సురేఖ పోటీ చేయడం ఖాయమన్నట్టు సంకేతాలు ఇచ్చారు. ఇటీవల డీసీసీ అధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టిన మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ తూర్పుపైనే గురి పెట్టారు.
వర్ధన్నపేట నుంచి బరిలో దిగేందుకు మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నియోజకవర్గ సమన్వయకర్త నమిండ్ల శ్రీనివాస్ పోటీ పడుతున్నారు. ఇద్దరి మధ్య నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్గపోరు ఇటీవల వర్ధన్నపేటలో జరిగిన ఒక కార్యక్రమంలో బహిర్గతమైంది. పరస్పరం బహిరంగ ఆరోపణలు చేసుకోవడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో ఎవరికివారు పర్యటిస్తూ తమ వర్గం కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరో విశ్రాంత పోలీసు అధికారి సైతం వర్ధన్నపేట నుంచి అవకాశం వస్తే పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
పరకాలలో టికెట్ల కోసం ఇరు వర్గాల మధ్య పోటీ నెలకొంది. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఇనుగాల వెంకట్రాంరెడ్డ్డి మరోసారి బరిలో నిలవాలని ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు సైతం పరకాల నుంచి అవకాశం ఇస్తే బరిలో నిల్చుంటానంటూ వెల్లడించారు. రెండు నెలల కిందట వరంగల్లో కొండా, ఇనుగాల వర్గీయుల మధ్య గొడవ జరిగింది. పరకాలలో బీసీ ఓట్లు అధిక సంఖ్యలో ఉండడంతో వచ్చేసారి అవసరమైతే బీసీ అభ్యర్థిని బరిలో నిలపాలని అధిష్ఠానం ఆలోచిస్తున్నట్టు సమాచారం.
జనగామ నుంచి ఇద్దరు సీనియర్ నేతలు పోటాపోటీగా ఉన్నారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి ఎవరికి వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో సైతం తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. పార్టీ ఆందోళన కార్యక్రమాలను సైతం విడివిడిగానే చేపడుతున్నారు.
పాలకుర్తి: గత ఎన్నికల్లో పోటీ చేసిన జంగారాఘవరెడ్డి ఈసారి వరంగల్ పశ్చిమపై దృష్టిసారించడంతో పాలకుర్తిలో మరో ఇద్దరు పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. వరంగల్ జడ్పీ మాజీ ఛైర్పర్సన్ ధన్వంతి భర్త టీపీసీసీ సభ్యుడు డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ తాను పాలకుర్తి నుంచి పోటీ చేస్తానంటూ ఇప్పటికే ప్రకటించారు. ప్రవాస భారతీయురాలైన హనుమండ్ల ఝాన్సీ రెడ్డి రంగ ప్రవేశం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆమె భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
ఈ రెండు చోట్లా ఒక్కొక్కరే..
భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావు బరిలో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ఆయనకు పోటీ లేదు.
ములుగు నుంచి ఎమ్మెల్యే సీతక్కే మళ్లీ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సైతం అవసరమైతే సీతక్కే సీఎం అవుతారని అనడం ప్రాముఖ్యం సంతరించుకుంది.
మహబూబాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ కోసం మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎల్హెచ్పీఎస్ వ్యవస్థాపకులు, టీపీసీసీ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్, డాక్టర్ భూక్యా మురళీనాయక్లు పోటీపడుతున్నారు. ఈ ముగ్గురూ తమకే టికెట్ వస్తుందంటూ నియోజకవర్గంలో వేర్వేరుగా పర్యటిస్తున్నారు. ఇటీవల బలరాంనాయక్, బెల్లయ్యనాయక్ కలిసి ఒకే వేదికగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించి ఇద్దరిలో టికెట్ ఎవరికి వచ్చినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేస్తామని ప్రకటించారు. మురళీనాయక్ జిల్లా అధ్యక్షుడు భరత్చంద్రెడ్డి ద్వారా తనకు టికెట్ వస్తుందనే భరోసాతో ఉన్నారు.
డోర్నకల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్ జాటోతు రాంచంద్రునాయక్, నెహ్రూనాయక్ టికెట్ ఆశిస్తున్నారు. రెండు వర్గాలుగా ఏర్పడి పర్యటిస్తున్నారు. రాంచంద్రునాయక్ 2014లో తెదేపా, 2018లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోయారు. ఈసారి అధిష్ఠానం టికెట్ తనకే ఇస్తుందని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. నెహ్రూనాయక్ తొలిసారి బరిలో నిలిచేందుకు ఆసక్తితో ఉన్నారు. నియోజకవర్గంలో తిరుగుతూ ప్రజలకు దగ్గరవుతున్నారు.
నర్సంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి టికెట్ తనదేనని గట్టి ధీమాతో ఉన్నారు. నెల రోజుల నుంచి జోడో యాత్ర నిర్వహిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కత్తి వెంకటస్వామి సైతం టికెట్ ఆశిస్తున్నారు.
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సింగారపు ఇందిర ఈసారీ సిద్ధమవుతున్నారు. గతంలో వరంగల్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొమ్మటి సాంబయ్య ఇక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గడపగడపనకు కాంగ్రెస్ పేరుతో నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హుషారుగా.. చుట్టొద్దామా...!
[ 17-05-2024]
ఉమ్మడి వరంగల్.. సాంస్కృతిక రాజధాని. ఇక్కడ ఎన్నో పర్యాటక ఆకర్షణలు యాత్రికులను ఆకట్టుకుంటాయి. అందుకే ఈసారి వేసవిలో ఎండలు మండుతున్నా పర్యాటకులు ఓరుగల్లుకు వరుస కడుతున్నారు. -
ఎన్నికల పుణ్యం.. బడి బాగుకు మార్గం
[ 17-05-2024]
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల వల్ల ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులొచ్చాయి. పోలింగ్ కేంద్రాలు ఏర్పాటులో భాగంగా వాటిలో మౌలిక వసతులు కల్పించారు.. తాగునీరు, మరుగుదొడ్లు, ర్యాంపుల నిర్మాణాలు, విద్యుత్తు కల్పన పనులు చేపట్టారు. -
ఓరుగల్లు.. జలమయం!
[ 17-05-2024]
భారీ వర్షంతో వరంగల్ నగరం తడిసి ముద్దయింది. గురువారం సాయంత్రం నుంచి అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో రహదారులపై వరద పోటెత్తింది. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు సన్నాహాలు
[ 17-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు జనగామ జిల్లా ఎన్నికల అధికారులు సన్నద్ధమవుతున్నారు. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్సీగా ఉన్న డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయగా గెలుపొందారు. -
యాదాద్రీశుడి సేవలో మాజీ మంత్రి హరీశ్రావు
[ 17-05-2024]
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట భారాస ఎమ్మెల్యే హరీశ్రావు గురువారం ఉదయం సందర్శించారు. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో..?
[ 17-05-2024]
సింగరేణి సంస్థ గడిచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
ములుగు, భూపాలపల్లి జిల్లాలకు.. ‘ఎల్లో అలర్ట్’
[ 17-05-2024]
ఇటీవల కురిసిన వర్షాలకే రైతులు ఆందోళన చెందుతున్నారు. మూడు రోజుల విరామం ఇచ్చిన వాన మళ్లీ గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో విస్తారంగా కురిసింది. -
‘రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం’
[ 17-05-2024]
ధాన్యం క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ గురువారం భారాస ఆధ్వర్యంలో కేసముద్రం మార్కెట్ కూడలిలో భారాస నేతలు రాస్తారోకో నిర్వహించారు. -
ముంపు ప్రాంతాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు
[ 17-05-2024]
గోదావరి వరదతో ముంపునకు గురయ్యే ప్రదేశాల్లో విద్యుత్తు స్తంభాల ఏర్పాటు పనులు గురువారం ప్రారంభమయ్యాయి. ‘ప్రమాదం పొంచి ఉంది.. -
రైతులను మోసం చేస్తే సహించం
[ 17-05-2024]
రైతులను మోసం చేస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువులు, -
విధుల్లో నిర్లక్ష్యం సరికాదు..
[ 17-05-2024]
ఈ నెల 20 నాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల మరమ్మతులన్నింటిని పూర్తి చేయాలని డీఎంహెచ్వో డాక్టర్ అప్పయ్య పేర్కొన్నారు. -
రక్తపోటు గుండెకు చేటు..!
[ 17-05-2024]
ఏ చిన్న సమస్యతో వైద్యుడి దగ్గరకెళ్లినా.. అడిగే మొదటి ప్రశ్న మీకు బీపీ (రక్తపోటు) ఉందా? కొంచెం కోపంగా మాట్లాడినా అతనికి బీపీ ఉంది అంటారు.. ఇలా అన్ని అనర్థాలకు రక్తపోటు కారణమవుతుంది. -
9,99,501 మంది ఓటుకు దూరం..
[ 17-05-2024]
గత సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరంగల్, మహబూబాబాద్ స్థానాలకు కలిపి 9,99,501 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. అంటే 29.78 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకోలేదు. -
కమీషన్ల కక్కుర్తి..!
[ 17-05-2024]
గ్రేటర్ వరంగల్ అక్రమాలకు అడ్డాగా మారింది. కమీషన్లు, పర్సంటేజీల కోసం ఉన్నత పదవిలో ఉన్నవారు సైతం ఎంతకైనా తెగిస్తున్నారు. -
పోలీసుల అదుపులో నిందితులు?
[ 17-05-2024]
ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీప అడవిలో మంగళవారం హత్యకు గురైన అంగన్వాడీ టీచర్ సుజాత కేసులో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీంకోర్టులో ఊరట
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?