దుకాణాల్లో అధికారుల తనిఖీలు.. కేసుల నమోదు
వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి..
కాశీబుగ్గ, న్యూస్టుడే: వరంగల్, హనుమకొండ జిల్లాల పరిధిలో పలు దుకాణాల్లో మంగళవారం జిల్లా ఇన్స్పెక్టర్ బి.ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో తూనికలు, కొలతల అధికారులు తనిఖీలు చేపట్టి.. 7 కేసులు నమోదు చేశారు. హనుమకొండలో ఎలక్ట్రికల్, హార్డ్వేర్ దుకాణాల్లో తనిఖీలు చేయగా.. ఎమ్మార్పీ ధరలు, కంపెనీ చిరునామా సరిగాలేని పొరపాట్లను గుర్తించి నలుగురిపై కేసులు నమోదు చేశారు. వరంగల్ తూర్పులో పలు చరవాణి దుకాణాల్లో తనిఖీలు చేశారు. ఈ విషయం తెలిసి కొందరు షాపులను మూసేసి వెళ్లిపోయారు. వరంగల్లో నిబంధనలు పాటించని మూడు దుకాణాలపై కేసులు నమోదు చేశామని, పలువురికి నోటీసులు జారీ చేసినట్లు జిల్లా ఇన్స్పెక్టర్ ప్రవీణ్కుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓరుగల్లు దీప్తి.. యువతకు స్ఫూర్తి
[ 22-05-2024]
పేదింటి బిడ్డ.. దివ్యాంగురాలు.. ఒకనాడు రాష్ట్రస్థాయి పోటీలకు కనీసం బూట్లు కూడా లేకుండా వెళ్లిన దైన్య స్థితి. ఆమె మానస్థిక స్థితి చూసి ఇరుగుపొరుగు వారు అవహేళన చేసేవారు. -
వన్యప్రాణుల జీవవైవిధ్య కేంద్రం పాకాల అభయారణ్యం
[ 22-05-2024]
అందమైన వన్యప్రాణుల జీవన కేంద్రం పాకాల అభయారణ్యం. సకల ప్రాణుల జీవన విధానం వైవిధ్యభరితం. పరపోషకాలు, స్వయం పోషకాలుగా జీవులు తమ జీవనాన్ని సాగిస్తాయి. -
కేయూ ఇన్ఛార్జి వీసీగా కరుణ
[ 22-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం ఇన్ఛార్జి వీసీగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి వాకాటి కరుణను నియమించింది -
ఇద్దరి ఉసురుతీసిన ఈత సరదా..!
[ 22-05-2024]
పిల్లలతో కలిసి సరదాగా ఈత కొడదామని వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు నీటమునిగి విగతజీవులుగా మారిన ఘటన వరంగల్ ఎనుమాముల పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. -
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో తోపులాట
[ 22-05-2024]
కాకతీయ వైద్య కళాశాలలోని పీఎంఎస్ఎస్వై(ప్రధాన మంత్రి స్వస్థ్య సురక్షా యోజన) సూపర్స్పెషాలిటీ ఆసుపత్రికి రోగులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. -
నేలవాలిన పైరు.. రైతుకు మిగిలింది కన్నీరు..
[ 22-05-2024]
ఈదురు గాలులతో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. కోతకు వచ్చిన పొలాలు చాలా చోట్ల నేలవాలిపోయాయి. -
నాలాల పూడికతీతే.. నగరానికి రక్ష!
[ 22-05-2024]
వరంగల్ అండర్బ్రిడ్జి 33వ డివిజన్ పెరుకవాడలోని ప్రధాన మురుగు కాలువలో ఇటీవల గుత్తేదారు పూడిక తీశారు. పై పైనే తీసి వదిలేశారు. -
పట్టభద్రులు భాజపాకు పట్టంకట్టాలి
[ 22-05-2024]
వరంగల్- నల్గొండ- ఖమ్మం పట్టభద్రుల శాసన మండలి ఉప ఎన్నికలో భాజపా అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికే పట్టం కట్టాలని మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. -
చేదు జ్ఞాపకం.. కారాదు పునరావృతం
[ 22-05-2024]
కొండాయి గ్రామస్థులకు ముప్పు పొంచి ఉంది. ఆ గ్రామాన్ని వేరే చోటికి తరలించాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. సురక్షిత ప్రదేశంలో నివాసాలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై అధికారులు ఎటూ తేల్చడం లేదు -
ముందస్తు పనులతోనే ముప్పు దూరం..!
[ 22-05-2024]
వర్షాలు కురిస్తే ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వివిధ ప్రాంతాలు జలాశయాలుగా మారుతాయి. -
‘సీఎం రేవంత్రెడ్డి అబద్ధాల కోరు’
[ 22-05-2024]
ఆచరణకు సాధ్యంకాని, మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, సీఎం రేవంత్రెడ్డి అబద్ధాల కోరు అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. -
100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
[ 22-05-2024]
2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు చేసుకోవాలని సింగరేణి సంచాలకులు వెల్లడించారు. -
గుట్టల్లో తోడేస్తున్నారు !
[ 22-05-2024]
సహజ సంపద కళ్ల ముందే కనుమరుగవుతోంది.. స్వార్థపరుల చేతుల్లో పడి ఎక్కడ చూసినా కొండలు కరిగిపోతున్నాయి. -
బాణాపురంలో ప్లాటు కనిపిస్తే కబ్జానే..!!
[ 22-05-2024]
జనగామ పట్టణంలోని ఎల్లంల రోడ్డు వైపు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్లాట్లు కేటాయించింది. -
రాకేశ్రెడ్డికి సహకారం అందించండి
[ 22-05-2024]
నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తిగా సహకరించాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారని రాష్ట్ర వికలాంగుల అభివృద్ధి సంస్థ మాజీ ఛైర్మన్ వాసుదేవరెడ్డి తెలిపారు.