పది మెట్లు పైకి..
పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు.
రాష్ట్రంలో జిల్లాకు 12వ స్థానం
ఉత్తీర్ణతలో బాలికలదే హవా
మానుకోట, న్యూస్టుడే: పదోతరగతి ఫలితాలు మంగళవారం వెలువడ్డాయి. జిల్లా 94.62 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 12వ స్థానంలో నిలిచింది. ఈ సంవత్సరం మార్చిలో జరిగిన వార్షిక పరీక్షల్లో 8178 మంది బాలబాలికలు పరీక్ష రాయగా 7,738 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఫలితాల్లో 85.54 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలో 22వ స్థానంలో ఉండగా ఈసారి అనూహ్యంగా పది స్థానాల పైకి చేరుకుంది. 95.51 శాతంతో బాలికల ఉత్తీర్ణత శాతమే ఎక్కువగా ఉంది. 93.04 శాతంతో 2022లో, 86.72 శాతంతో 2023లో వరుసగా ఈసారి బాలికలేే ఉత్తీర్ణతలో పైచేయిగా ఉండడం విశేషం. వివిధ యాజమాన్యాల ప్రభుత్వ పాఠశాలలు 49 వంద శాతం ఫలితాలు సాధించాయి.
14 మందికి 10 జీపీఏలు
పదో తరగతి ఫలితాల్లో జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాలకు చెందిన పాఠశాలల్లోని 14 మంది విద్యార్థులు 10 జీపీఏను సాధించారు. బీసీ సంక్షేమ 4, ఆదర్శ 5, మైనార్టీ గురుకులాలు 2, సాంఘిక సంక్షేమ 1, గిరిజన సంక్షేమ 1, జడ్పీ పాఠశాలలో ఒకరు పది జీపీఏ సాధించారు.
ఫలితాల్లో కేజీబీవీల ప్రతిభ
జిల్లాలోని 15 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఏడు కేజీబీవీలు పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణతను సాధించాయి. అన్నింటి ఉత్తీర్ణత శాతం 94.58గా ఉందని జీసీడీఓ జి.విజయకుమారి తెలిపారు.
నాడు ‘జీరో’ నేడు వందశాతం
గార్ల, న్యూస్టుడే: గత విద్యాసంవత్సరంలో పదోతరగతిలో సున్నా ఫలితాలు సాధించిన పెద్దకిష్టాపురం ఉన్నత పాఠశాల నేడు వంద శాతం ఫలితాలతో నిలిచింది. గతేడాది పది మంది విద్యార్థులు పరీక్షలు రాయగా ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో ఈ పాఠశాలపై కలెక్టరు, జిల్లా విద్యాశాఖాధికారి ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విద్యా సంవత్సరంలో 16 మంది విద్యార్థులకు 16 మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రధానోపాధ్యాయుడు బి.చంద్రమోహన్, ఉపాధ్యాయులను గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు.
జడ్పీ పాఠశాలల్లో ..
జిల్లాలోని 26 జడ్పీ ఉన్నత పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణతను సాధించాయి. రామాస్ (మహబూబాబాద్), గూడూరు (బాలురు, బాలికలు), బయ్యారం, పుల్లూరు, ఎల్లంపేట, చింతపల్లి, చిన్నగూడూరు, దాట్ల, ముప్పారం కలాన్, నేరడ, రాజులకొత్తపల్లి, కుమ్మరికుంట్ల, గార్ల (బాలికలు), ఉప్పలపాడు, పెద్దకిష్టాపురం, వీఎస్ లక్ష్మీపురం, కొత్తూరు, మచ్చర్ల, కొత్తపోచారం, పెద్దనాగారం, వెంకట్రామపురం, వడ్డేకొత్తపల్లి, అయోధ్యపురం, మద్దివంచ, బలపాల పాఠశాలలున్నాయి.
మహబూబాబాద్, మరపెడ ఆదర్శ పాఠశాలలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీళ్లు మారరు వసూళ్ల పర్వం ఆపరు!
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్లోని అనేక మండలాల పరిధిలో రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది వసూళ్ల పర్వంలో మునిగితేలుతున్నారు. ప్రజలు వీరికి ఆమ్యామ్యాలు చెల్లించలేక చివరకు అవినీతి నిరోధక శాఖ (అనిశా)ను ఆశ్రయిస్తున్నారు. -
ఆరోపణలు.. విచారణలు!
[ 21-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం 14వ ఉప కులపతిగా మూడేళ్లపాటు విధులు నిర్వహించిన సామాజిక శాస్త్రం సీనియర్ ఆచార్యులు తాటికొండ రమేశ్ పదవీ కాలం మంగళవారంతో ముగియనుంది. -
స్థిరాస్తి వ్యాపారానికి ఛార్జీల పెంపు గుబులు
[ 21-05-2024]
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషను ఛార్జీల పెంపుపై కసరత్తు ప్రారంభమైంది. ఇప్పటికే వ్యాపారం లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో భూమి విలువ పెంచితే అది ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. -
సోదరులను బలిగొన్న రోడ్డు ప్రమాదం
[ 21-05-2024]
ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సోదరులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరం గ్రామంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. -
900 గ్రాముల మత్తు మందు పట్టివేత
[ 21-05-2024]
హశిష్ (గంజాయి ఆకులతో తయారు చేసినది) మత్తుమందు తరలిస్తున్న అంతర్రాష్ట్ర స్మగ్లర్ను వరంగల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. -
పనులు త్వరగా పూర్తి చేయండి
[ 21-05-2024]
నగరానికి ముంపు తప్పాలంటే వరదనీరు సాఫీగా వెళ్లేలా చూడాలని, నాలాల్లో పూడికతీత పనులు తొందరగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే అధికారులు, గుత్తేదారులకు సూచించారు. -
విద్యావంతున్ని గెలిపించండి
[ 21-05-2024]
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతుడు భారాస వైపు, నయవంచకుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారని ప్రభుత్వ ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ అన్నారు. -
జాడలేని వేసవి క్రీడా శిబిరాలు..!
[ 21-05-2024]
సెలవుల్లో చిన్నారులను క్రీడల వైపు మళ్లించడానికి తల్లిదండ్రులు తొలి ప్రయత్నంగా వేసవి శిబిరాలను ఎంచుకుంటారు. సంవత్సరం పొడవునా తరగతి గదులకు పరిమితమైన విద్యార్థుల్లో క్రీడాశిబిరాలు నూతన ఉత్సాహాన్ని నింపుతాయి. -
ఆటోడ్రైవర్లకు సీఎన్జీ కష్టాలు
[ 21-05-2024]
పెట్రోలు, డీజిల్ వాడకం తగ్గించి పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో సీఎన్జీ, విద్యుత్తు వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. సీఎన్జీ కిలో ధర.. లీటరు పెట్రోల్ ధరకంటే రూ.17 తక్కువగా ఉండటం, మైలేజీ ఎక్కువగా రావడం వల్ల ఆటోడ్రైవర్లు ఈ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. -
ఖాళీ స్థలాలు.. సమస్యలకు నిలయాలు
[ 21-05-2024]
జనావాసాల్లో ఖాళీ స్థలాలు మురికి నీటితో కుంటలుగా మారి, కంపు కొడుతున్నాయి. యజమానుల నిర్లక్ష్యం అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రజలకు పాట్లు తప్పడం లేదు. -
నిధులున్నా.. నీరుగారిన నిర్వహణ
[ 21-05-2024]
జిల్లాకు సాగునీరందే ఏకైక సాగునీటి కాలువ ఎస్సారెస్పీ డీబీఎం 38.. రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, గణపురం మండలాల మీదుగా ఉప కాల్వలు ఉన్నాయి. -
ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సన్నద్ధం
[ 21-05-2024]
జిల్లాలో ఇంకా ఎన్నికల వాతావరణం కొనసాగుతూనే ఉంది. వారం రోజుల కిందట లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఈనెల 27వ తేదీన నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక నిర్వహణకు సందడి ప్రారంభమైంది. -
ఉపాధి కూలీలకు సౌకర్యాలు తప్పనిసరి
[ 21-05-2024]
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్యను పెంచే విధంగా చూడాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.శ్రీజ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..