logo

ఆదరించండి.. అభివృద్ధి బాధ్యత నాదే

పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు.

Published : 09 May 2024 02:05 IST

తాడిచెర్లలో ప్రసంగిస్తున్న మంత్రి శ్రీధర్‌బాబు

మల్హర్‌, న్యూస్‌టుడే: పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. మల్హర్‌ మండలం తాడిచెర్లలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్నర్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నా హయాంలో జూనియర్‌ కళాశాల, ఆదర్శ, కస్తూర్బా పాఠశాల మంజూరు చేయడంతో నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులతో పలు రంగాల్లో స్థిరపడ్డారని తెలిపారు. వచ్చే ఏడాదిలో తాడిచెర్లలో ఇంటర్మీడియట్‌ పరీక్ష కేంద్రాన్ని మంజూరు చేస్తానని చెప్పారు. మిషన్‌ భగీరథ పథకంతో తాగునీటి పథకాలు అస్తవ్యస్తంగా మారడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. జూన్‌ 6 తర్వాత ఇల్లు లేని పేదలకు సొంతిల్లు, రేషన్‌కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పెద్దపల్లి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్హర్‌రావు, మండల పార్టీ అధ్యక్షుడు బడితెల రాజయ్య, కాంగ్రెస్‌ ఎస్సీ విభాగం జిల్లా ఛైర్మన్‌ దండు రమేష్‌, రాజిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం కొయ్యూర్‌లో మాజీ నక్సలైట్లతో నిర్వహించిన సమావేశంలో వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని