చెరువులో పడి మృతి
చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం దాచారంలో జరిగింది. రేసు రాజు(42) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉన్న చెరువులోకి చేపల వేటకు వెళ్లాడు.
కుక్కునూరు, న్యూస్టుడే: చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మంగళవారం దాచారంలో జరిగింది. రేసు రాజు(42) అనే వ్యక్తి తన ఇంటి సమీపంలో ఉన్న చెరువులోకి చేపల వేటకు వెళ్లాడు. అతను ఏర్పాటు చేసుకున్న సాధనం చెరువు మధ్యలోకి వెళ్లాక తిరగబడింది. ఉదయం గల్లంతయిన అతను సాయంత్రానికి శవంగా తేలాడు. కుటుంబసభ్యులు పోస్టుమార్టం అనంతరం దహన సంస్కారాలు చేశారు.
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
యర్రావారిపాలెం, న్యూస్టుడే: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలివీ.. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలంలోని నెరబైలు పంచాయతీ, తలకోన రోడ్డుకు సమీపంలోని ఇటుక బట్టీ వద్ద పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన అంజారమ్మ(46) భర్త మునెయ్యతో కలిసి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలోనే మనస్తాపానికి గురైన అంజారమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్