logo

రైలు ఢీకొని వృద్ధుడి మృతి

రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై శ్రీహరి బాబు శుక్రవారం తెలిపారు. చేబ్రోలు, బాదంపూడి రైల్వే స్టేషన్ల మధ్య 524/32, 524/06 స్తంభాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్‌మ్యాన్‌ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Published : 24 Sep 2022 05:59 IST

ఉంగుటూరు, న్యూస్‌టుడే: రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందినట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై శ్రీహరి బాబు శుక్రవారం తెలిపారు. చేబ్రోలు, బాదంపూడి రైల్వే స్టేషన్ల మధ్య 524/32, 524/06 స్తంభాల మధ్య గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని ట్రాక్‌మ్యాన్‌ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. విశాఖపట్నం వైపు వెళ్లే రైలు ఢీ కొట్టడంతో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి వయసు సుమారు 60 సంవత్సరాలు ఉంటుందని, ఒంటిపై నీలం, నారింజ రంగు లుంగీ ఉందని వివరించారు. కేసు నమోదు చేశామని, మృతుడి ఆచూకీ తెలిసిన వారు 94906 17090 నంబరును సంప్రదించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని