logo

అడుగడుగునా జన హారతి

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లా పర్యటన రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. పోలవరం నియోజకవర్గంలో గ్రామగ్రామాన పార్టీ శ్రేణులు, జనం నీరాజనం పలికారు.

Updated : 02 Dec 2022 07:08 IST

తెదేపా అధినేత పర్యటనకు పోటెత్తిన శ్రేణులు
దారిపొడవునా నిరీక్షించి  స్వాగతించిన  జనం

చిన్నారిని ఎత్తుకొని అభివాదం చేస్తూ..

కొయ్యలగూడెం, గ్రామీణ, బుట్టాయగూడెం, పోలవరం, న్యూస్‌టుడే: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఉమ్మడి జిల్లా పర్యటన రెండో రోజూ ఉత్సాహంగా సాగింది. పోలవరం నియోజకవర్గంలో గ్రామగ్రామాన పార్టీ శ్రేణులు, జనం నీరాజనం పలికారు. కొయ్యలగూడెం, బుట్టాయగూడెం, పోలవరం మండలాల్లో దారిపొడవునా పసుపు జెండాలు, ఫ్లెక్సీలతో పసుపుమయం చేశారు. చంద్రబాబు కోసం గంటల తరబడి వేచి చూశారు. గురువారం ఉదయం నరసన్నపాలెం కల్యాణ మండపంలో నిర్వహించిన బీసీ సదస్సు అనంతరం కొయ్యలగూడెం మీదుగా పోలవరం వరకు రోడ్‌షో సాగింది. బయ్యనగూడెం, కొయ్యలగూడెం, దిప్పకాయలపాడు, కన్నాపురం, పోలవరంలో ఆయన ప్రసంగించారు. బయ్యనగూడెంలో ఒకరు  విల్లును బహూకరించగా చంద్రబాబు దానిని ఎక్కుపెట్టి ప్రజలకు చూపారు. అక్కడ మహిళలు హారతులు పట్టారు.

పోలవరం సభకు హాజరైన జనసందోహం

దొండపూడి రోడ్‌షోలో ప్రసంగిస్తున్న చంద్రబాబునాయుడు, హాజరైన జనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని