మనవడిని కొట్టిందని..కోడలిని హతమార్చిన మామ
కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది.
నాగ శ్రావణి (పాత చిత్రం)
తాడేపల్లిగూడెం వన్టౌన్, న్యూస్టుడే: కోడలిపై మామ రోకలితో దాడి చేసి హతమార్చిన ఘటన తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురంలో చోటు చేసుకుంది. గ్రామీణ ఎస్సై సురేశ్ తెలిపిన వివరాలు... విశాఖపట్నానికి చెందిన ఎం.శ్రీనివాస్, సత్యకుమారిల ఏకైక కుమార్తె నాగ శ్రావణిని అయిదేళ్ల కిందట జగన్నాథపురం గ్రామానికి చెందిన లక్కోజు కేశవరావు (విశ్రాంత రైల్వే ఉద్యోగి), సూర్యకుమారిల కుమారుడు శ్రీనివాసరావుకు ఇచ్చి వివాహం చేశారు. వీరికి కుమారుడు రిశాంత్ కుమార్, కుమార్తె జస్విత సూర్యశ్రీ సంతానం ఉన్నారు. శ్రీనివాసరావు రెండేళ్ల కిందట జీవనోపాధికి దుబాయి వెళ్లారు. నాగ శ్రావణి తన పిల్లలతో ఇంట్లోనే ఉంటున్నారు. ఆదివారం గ్రామంలో ఒక శుభకార్యానికి అత్తమామలతో కలిసి వెళ్లారు. ఇంటికొచ్చాక తన కుమారుడి నడుముకు ఉండాల్సిన వెండి మొలతాడు కనిపించపోడాన్ని గమనించారు. అజాగ్రత్తగా ఉంటున్నావంటూ కుమారుడిని కొట్టారు. ఈ నేపథ్యంలో కేశవరావు ఆమెపై గొడవకు దిగారు. అదే రోజు రాత్రి నిద్రిస్తున్న శ్రావణి తలపై అతడు పచ్చడి బండతో బాదడంతో సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడేపల్లిగూడెం ఏరియాసుపత్రికి తరలించారు. నిందితుడు కేశవరావుతో పాటు అతడి భార్యను అదుపులోకి తీసుకున్నారు. తరచూ తన కుమార్తె నాగశ్రావణిని ప్రతి చిన్న విషయానికీ మామ కేశవరావు నిందిస్తూ ఉంటాడని మృతురాలి తండ్రి ఎం.శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
రూ.5 లక్షల సరకు స్వాధీనం
ఏలూరు నేర వార్తలు, న్యూస్టుడే: ఏలూరులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఔషధాలను అధికారులు పట్టుకున్నారు. ఔషధ తనిఖీ అసిస్టెంట్ డైరెక్టర్ హరిప్రసాద్ ఆదేశాలతో ఏలూరు డ్రగ్ఇన్స్పెక్టర్ బాలు, భీమవరం డ్రగ్ ఇన్స్పెక్టర్ అబిద్ అలీ తమ సిబ్బందితో సోమవారం దాడులు నిర్వహించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరులోని ఓ హోల్సేల్ ఔషధ దుకాణంలో పని చేస్తున్న బొంతు త్రినాథ్ కొత్తపేటలో ఉంటున్నారు. అతను తన నివాసంలో అనధికారికంగా మందులు నిల్వ ఉంచారనే సమాచారంతో అధికారులు సోదాలు చేశారు. ఎటువంటి బిల్లులు, పత్రాలు లేని సుమారు రూ.5 లక్షల విలువైన ఆల్జోలమ్, వయాగ్రా, అబార్షన్ కిట్లను గుర్తించారు. వీటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి.. ఇక్కడి మందుల దుకాణాలకు తక్కువ ధరలకు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. త్రినాథ్ను అదుపులోకి తీసుకుని విచారించగా భీమవరం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తమకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారని అధికారులు చెప్పారు. ఈ క్రమంలో అతన్ని కూడా విచారించాల్సి ఉందన్నారు. త్రినాథ్ పనిచేస్తున్న హోల్సేల్ దుకాణం యజమానికి వీటితో సంబంధముందా అనే కోణంలోనూ విచారణ జరపనున్నట్లు తెలిపారు.
బయట పడిందిలా... చింతలపూడిలోని ఓ మందుల దుకాణంలో ఇటీవల ఔషధ తనిఖీ అధికారులు తనిఖీలు చేశారు. కొన్ని అనధికారిక మందులు లభ్యం కావడంతో వాటిని ఎక్కడ నుంచి తీసుకొచ్చారని ఆరా తీయగా ఏలూరులోని ఇద్దరు వ్యక్తులు అమ్ముతున్నట్లు చెప్పడంతో అధికారులు నిఘా పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాల మీదకొచ్చినా స్పందించరా?
[ 17-05-2024]
ఏజెన్సీలో అతిసారం విజృంభిస్తోంది. కలుషిత నీరు గిరిపుత్రుల ప్రాణాలు తోడేస్తోంది. కుక్కునూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. గుక్కెడు తాగునీటికి నోచుకోక చెలమల్లోని మురికి నీరు తాగుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోకపోవటమే ఈ మరణాలకు కారణమైంది. -
ఆగని అరాచకపర్వం
[ 17-05-2024]
పోలింగ్ నాడు వైకాపా మూకలు చేసిన విధ్వంసకాండ..వారు గత అయిదేళ్లుగా చేస్తున్న అరాచకాలకు పరాకాష్ఠగా నిలిచింది. పచ్చని పశ్చిమలో నెత్తుటి ఛాయలు చూపించింది. ఓటమి భయం ఆవరించటంతో తెదేపా కార్యకర్తలు, నాయకులపై దాడులకు తెగబడటమే లక్ష్యంగా పని చేశారు. -
కలిసి రాని కొబ్బరి!
[ 17-05-2024]
ఉమ్మడి జిల్లాలో 55 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు ఉంది. పెదవేగి, యలమంచిలి మండలాలు కొబ్బరిసాగులో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఉద్యానంలో పెద్దపంటగా భావించే కొబ్బరిలో తెగుళ్ల బెడద తీవ్రస్థాయికి చేరింది. -
తేమ పేరుతో కోత
[ 17-05-2024]
ఆరుగాలం శ్రమించి పంట పండించిన అన్నదాతలు అమ్ముకోవాలంటే అష్టకష్టాలు తప్పడం లేదు. ఏదో రీతిన దోచుకోవడానికి దళారులే కాదు మిల్లర్లూ సిద్ధమయ్యారు. -
ఈఏపీ సెట్ ప్రారంభం
[ 17-05-2024]
ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. భీమవరంలోని ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఉదయం జరిగిన అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షకు మొత్తం 175 మంది హాజరు -
పది సప్లిమెంటరీకి సన్నద్ధతేదీ ?
[ 17-05-2024]
ఉంగుటూరు మండలం కైకరం జడ్పీ ఉన్నత పాఠశాలలో 118 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్ష రాయగా 66 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలు వచ్చాక వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించారు. -
అర్ధరాత్రి ఇసుక దందా
[ 17-05-2024]
అనుమతులు ఉన్నాయంటూ ఒకలా, లేకుంటే మరోలా జిల్లాలో ఇసుక దందా సాగుతోంది. ఆచంట మండలం కరుగోరుమిల్లిలో ఇటీవల ఇసుక ర్యాంపు ఏర్పాటు చేశారు. -
నెత్తురోడిన రహదారులు
[ 17-05-2024]
ఉమ్మడి పశ్చిమ గోదావరిలోని రహదారులు గురువారం రక్తమోడాయి. వివిధ ప్రాంతాల్లో జరిగిన వేరువేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రుల్లో చేరారు. -
కొప్పులవారిగూడెం ఘటనపై పోలీసుల అత్యుత్సాహం
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో(ఈ నెల 13న) పెదవేగి మండలం కొప్పులవారి గూడెంలో జరిగిన ఘటనపై పెదవేగి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ఎన్డీయే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. -
లారీ ఢీకొని తల్లి మృతి.. ప్రాణాపాయ స్థితిలో కుమార్తె
[ 17-05-2024]
లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో తల్లి ఘటనా స్థలంలోనే మృతిచెందగా కుమార్తె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరిన దుర్ఘటన గురువారం ఉదయం జరిగింది.
తాజా వార్తలు (Latest News)
-
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
-
తెలంగాణలో పీజీఈసెట్ పరీక్ష వాయిదా
-
నవీన్ బాబూ.. రత్నభాండాగారం అసలు తాళం చెవి ఎక్కడ ఉంది?: అమిత్ షా
-
తరగతి గది ఆవరణలో చిన్నారి మృతదేహం.. స్కూల్కు నిప్పంటించిన కుటుంబసభ్యులు
-
ఆ నిర్ణయం నాకు ముందే చెప్పాడు: కోహ్లీ
-
హింసపై ఈసీకి సీఈవో నివేదిక.. కీలక నేతల అరెస్టులకు అవకాశం?