ఓటర్లకు తాయిలాలు..నాయకులకు ప్యాకేజీలు!
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పటికే నగదు, చీరలు పంపిణీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు.
పల్లెల్లో అధికార పార్టీ పంపకాల పందేరం
ఇటీవల వీరవాసరం మండలం నందమూరుగరువులో ప్రచారం చేస్తున్న వాలంటీర్లు
భీమవరం వన్టౌన్, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో అధికార పార్టీ అభ్యర్థులు ప్రలోభాల పర్వానికి తెరతీశారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇప్పటికే నగదు, చీరలు పంపిణీ చేసిన అభ్యర్థులు ఓటర్లకు నగదు పంపిణీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. రాజీనామా లేఖలు ఇచ్చిన వాలంటీర్లకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇచ్చి వారితో ఇంటింటి ప్రచారం, సర్వేలు చేయిస్తున్నారు.
స్థాయిని బట్టి..
ఎన్నికల ప్రచారంలో ద్వితీయ శ్రేణి నాయకుల పాత్ర ఎంతో కీలకం. ప్రచార సమయంలో జనసమీకరణ బాధ్యత వీరిపైనే ఉంటుంది. అందుకే పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీ నాయకులు ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులకు నగదు బహుమతులు ఇస్తున్నారు. నాయకుల బలాన్ని బట్టి అభ్యర్థులు ఒక్కొక్కరికీ రూ. 10 వేల నుంచి రూ. 50 వేల వరకూ ఇస్తున్నారు. గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు రూ.వేలల్లో నగదు, ఇతర తాయిలాలు అందజేశారు. నిత్యం ప్రచారంలో పాల్గొనే వారికి భోజనాలు, పెట్రోలు కూపన్లు, ఒక్కొక్కరికి రూ.200 నుంచి రూ. 500 వరకు నగదు అందజేస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులు సోషల్ మీడియా కన్వీనర్లు, వాలంటీర్లకు ఇప్పటికే రూ. వేలల్లో ముట్టజెప్పారు.
- అధికార పార్టీ అభ్యర్థులు ఓటర్లకు ఎంత ఇవ్వాలనే అంశంపై ఇప్పటికే స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. నరసాపురం, పాలకొల్లు, ఉండి, ఆచంట నియోజకవర్గాల్లో అభ్యర్థులు రూ.1000 నుంచి రూ.1,500 వరకు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
- భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల్లో ఓటుకు రూ. 2000 వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. భీమవరం, ఆచంట నియోజకవర్గాల్లో పరిస్థితులను బట్టి ఈ మొత్తం పెరిగే అవకాశం లేకపోలేదని పలువురు పేర్కొంటున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇచ్చే నగదుతో పాటు అభ్యర్థి గెలుపొందిన తరువాత మరికొంత సొమ్ము పొందేలా కూపన్లు సిద్ధం చేస్తున్నారు.
తపాలా ఓట్లకూ ఎర
వయోవృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం ‘ఇంటి నుంచే ఓటు’ సదుపాయం కల్పించింది. దీనికి సంబంధించిన పోలింగ్ ఇటీవల పూర్తయింది. వీరిలో కొందరు ఓటర్లకు భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు తదితర నియోజకవర్గాల అభ్యర్థులు రూ.1000 నుంచి రూ.2000 వరకు పంపిణీ చేసినట్లు సమాచారం. ఇక తపాలా బ్యాలెట్ ఓటర్లకు రూ.1000 నుంచి రూ.2000 నగదు అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
[ 19-05-2024]
ఇతర దేశాల నుంచీ.. కువైట్, ఖతార్, సౌదీ ఆరేబియా తదితర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లినవారు కూడా ఇక్కడి ఫలితాలపై పందేలకు సై అంటున్నారు. -
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
[ 19-05-2024]
భౌతికంగా తమ కుమారుడు మృతిచెందినా అవయవదానంతో మరొకరిలో చిరంజీవిగా జీవించే ఉంటాడని భావించిన ఆ తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకరించి స్ఫూర్తిదాయకంగా నిలిచారు. -
కన్నీళ్లకే కన్నీళ్లొచ్చే!
[ 19-05-2024]
ముదినేపల్లి మండలం చిగురుకోట శివారు నరసన్నపాలెంలో ఎస్సీ శ్మశాన వాటికకు వెళ్లడానికి దారి లేదు. రొయ్యల చెరువుగట్లపై నుంచి మృతదేహాన్ని తీసుకు వెళ్లాల్సి వస్తోంది. -
పాలకొల్లు వైకాపాలో లుకలుకలు
[ 19-05-2024]
పాలకొల్లులో ప్రతిపక్షం గెలవడానికి వారికంటే వైకాపా నాయకులే ఎక్కువ సహకరించారని ఆ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం లేపుతోంది. -
చేలల్లోనే 20 శాతం పంట
[ 19-05-2024]
మూడు రోజుల నుంచి కురుస్తున్న జడివానలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆకాశం మేఘావృతమై అకస్మాత్తుగా జల్లులు పడుతుండటంతో రబీ పంట మాసూళ్లకు అవరోధాలు ఎదురవుతున్నాయి. -
కమనీయం.. శ్రీనివాసుని తిరుకల్యాణం
[ 19-05-2024]
కలియుగ ప్రత్యక్ష దైవం ద్వారకాతిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరు కల్యాణ మహోత్సవాలు శనివారం వైభవోపేతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు స్వామి, అమ్మవార్లను నూతన వధూవరులుగా ముస్తాబు చేశారు. -
జయ జయ వాసవీ మాత!
[ 19-05-2024]
జై..వాసవీ..జైజై వాసవీమాత నామస్మరణతో పెనుగొండ మారుమోగింది. వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా శనివారం కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ తదితర రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. -
ఆ నలుగురు నలిగిపోతున్నారు!
[ 19-05-2024]
శ్మశానవాటిక సమస్య లేని గ్రామం లేదు. అంతిమ సంస్కారం ముగిసే వరకు నిలబడటానికి నిలువ నీడ ఉండదు. దప్పికతీర్చే వసతి కనిపించదు. -
లక్షల్లో జీతాలా.. ఫలితాలు అంతంతమాత్రమా
[ 19-05-2024]
లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు... ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి... ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులను పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్ ప్రశ్నించారు. -
ముంపుతో ముడి.. మావి ప్రాణాలు కావా?
[ 19-05-2024]
‘కురుములతోగు, కొత్తూరు కోసయ్యగుంపు గ్రామాలకు చెందిన 15 మంది అతిసారం బారిన పడ్డారు. సకాలంలో చికిత్స అందక ఇద్దరు తనువు చాలించారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన