logo

కూటమి గెలుపుతోనే భవిష్యత్తు: దేవినేని

తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.

Published : 10 May 2024 04:05 IST

మాట్లాడుతున్న ఉమామహేశ్వరరావు

పెదవేగి, న్యూస్‌టుడే: తెదేపా, జనసేన, భాజపా కూటమి గెలుపుతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పెదవేగి మండలం వంగూరులో కూటమి దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌తో కలిసి ఆయన గురువారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయిదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని, అందుకే కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రజల్లో కూటమికి వస్తున్న స్పందన చూస్తే చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవడం తథ్యమన్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని