కొండంత రాగం తీసి... అన్నీ కోతేశారు
రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్పామ్ పంటను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.
రాయితీలకు ఎగనామం రైతులకు పంగనామం
ఆయిల్పామ్ సాగుదార్లకు జగన్ టోకరా
‘మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయిల్పామ్ రైతులనుఆదుకుంటాం.’
2018 పాదయాత్ర సమయంలో ఏలూరు జిల్లా దెందులూరు వద్ద జగన్ మోహనరెడ్డి ఇచ్చిన హామీ..
కుక్కునూరు, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం పట్టణం, న్యూస్టుడే
రాష్ట్రంలోనే ఏలూరు జిల్లాలో అధికంగా పండించే ఆయిల్పామ్ పంటను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ఈ పంటకు గత ప్రభుత్వం కంటే మెరుగైన పరిస్థితులు కల్పిస్తానని ఎంతో గొప్పగా హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక ఉన్న రాయితీలు సైతం నిలిపివేసింది. తెలంగాణలో అనేక రాయితీలు ఇస్తూ పంటను ప్రోత్సహిస్తుండగా.. ఇక్కడ ఆ సాగుకు అనువైన పరిస్థితులు ఉండి కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
తెదేపా ప్రభుత్వంలో మొక్కలపై రాయితీ ఉండేది. ఎరువులు, కొత్త రైతులకు డ్రిప్ పరికరాలపై రాయితీ అందించేవారు. వీటన్నింటినీ జగన్ ప్రభుత్వం ఎత్తేసింది. దీంతో పెట్టుబడి భారం పెరిగి కొత్త విస్తీర్ణం సాగులోకి రావటం లేదు. రూ.193 చెల్లించి మొక్కలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. తెదేపా ప్రభుత్వంలో ఈ పంటను ప్రోత్సహించే గోద్రేజ్, నవభారత్ వంటి కంపెనీలు మొక్కను రాయితీపై ఎస్సీ, ఎస్టీలకు రూ.20, ఇతరులకు రూ.30కు అందించేవారు. ఈ ప్రభుత్వం ఆ కంపెనీలకు రాయితీని విడుదల చేయకపోవడంతో అవి రైతుల వద్ద పూర్తి ధర తీసుకుని మొక్కలు సరఫరా చేస్తున్నాయి. డ్రిప్ పరికరాలకు ఉద్యానశాఖ గతంలో ఇచ్చే 90 శాతం రాయితీ ఇప్పుడు లేకుండా పోయింది. తోట వేసిన తొలి నాలుగేళ్ల పాటు ఎరువులపై 30 శాతం రాయితీ ఇచ్చేది. ఇప్పుడు వాటిని ఇవ్వడం లేదు.
ధరల్లో తేడా
ధరల్లో సైతం నిలకడ ఉండటం లేదు. మన దగ్గర టన్ను ఆయిల్పామ్ ధర ప్రస్తుతం రూ.13,760 ఉండగా, తెలంగాణలో రూ.14,280 పలుకుతోంది. ధర అధికంగా ఉందని అక్కడ అమ్ముకుందామంటే ఆ రాష్ట్ర అధికారులు కొనడం లేదు. ధర పడిపోవటం, రాయితీలు లేకపోవటంతో రైతులకు ఆ పంటపై ఆసక్తి తగ్గిపోతోంది.
అక్కడ ప్రోత్సాహం బాగుంది
తెలంగాణలో రైతులకు ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కంటే ఇక్కడ పామాయిల్ ధరలు బాగా తక్కువగా ఉంటున్నాయి. ఒక్కో సారి దాదాపు టన్నుకు రూ.800 పైగా వ్యత్యాసం ఉంటుంది. మామూలుగానే పామాయిల్ రైతులు నష్టాలను ఎదుర్కొంటుంటే రెండు రాష్ట్రాల్లో ధరల వ్యత్యాసం ద్వారా మరింత నష్టపోతున్నారు.
గెడా సత్తిబాబు, పామాయిల్ రైతు, దిప్పకాయలపాడు, కొయ్యలగూడెం మండలం
రూ.500 చొప్పన కొన్నా
గత ప్రభుత్వ హయాంలో ఏడెకరాల ఆయిల్పామ్ తోట వేశా. అప్పట్లో రాయితీపై మొక్కలు ప్రభుత్వమే సరఫరా చేసింది. మూడేళ్ల పాటు ఎరువులు ఉచితంగా అందించింది. 70 శాతం రాయితీపై బిందుసేద్యం పరికరాలు సమకూర్చింది. మూడేళ్ల కిందట మరో ఏడెకరాల తోట వేశా. వైకాపా ప్రభుత్వం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేక తెలంగాణ రాష్ట్రం నుంచి రూ.500 చొప్పున మొక్కలు కొనుగోలు చేసి తెచ్చుకున్నా. ఏడాది నుంచి రాయితీపై డ్రిప్ మంజూరు చేస్తామని చెప్పినా అమలు కాలేదు.
గద్దే శ్రీధర్, రైతు, బుట్టాయగూడెం
జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం: 1.55 లక్షల ఎకరాలు
ఆధారపడిన కుటుంబాలు: 25 వేలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల