ఉద్యోగాలేవి జగన్
ఆశలు ఆవిరై.. బతుకు భారమైన వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.
ఏటా జాబు క్యాలెండరు వట్టి మాటే
నిరుద్యోగుల ఆశలు నీరుగార్చిన వైకాపా సర్కారు
కలిదిండి, ఏలూరు అర్బన్, ముదినేపల్లి, న్యూస్టుడే
ఆశలు ఆవిరై.. బతుకు భారమైన వేళ నిరుద్యోగులందరూ ఆవేదనతో రగిలిపోతున్నారు. అరకొర జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్నారు.
వైకాపా ఏలుబడిలో నిరుద్యోగులు నిండా మునిగిపోయారు. 2019 ఎన్నికల సమయంలో ‘ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం’ అంటూ అప్పటి ప్రతిపక్ష నేత జగన్ చెప్పిన అబద్ధాలు వాళ్ల జీవితాలను అంధకారం చేశాయి. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తారన్న నమ్మకంతో.. ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో.. పోటీ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం సంవత్సరాల తరబడి శిక్షణ కేంద్రాలకు వెళ్లారు. పూట గడవని కుటుంబాల్లో ప్రతిభావంతులు అప్పులు చేసి మరీ శిక్షణ తీసుకున్నారు. అయిదేళ్లలో ఐదుసార్లు నోటిఫికేషన్లు పడితే.. ఏదో ఒకటి కచ్చితంగా కొట్టేయొచ్చని..తమ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కొచ్చని ఆశ పడ్డారు. తామంతా ఘోరంగా మోసపోయామని తెలిసేటప్పటికి 2024 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది.
నిర్వహించిన ఉద్యోగ మేళాలు
2023లో 75 ఉద్యోగ మేళాల ద్వారా వివిధ ప్రైవేటు సంస్థల్లో సుమారు 2,596 మంది, 2024లో ఇప్పటి వరకు 16 ఉద్యోగ మేళాల ద్వారా 650 మందికి మాత్రమే ఉద్యోగాలు కల్పించారు.
నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా మరోసారి వంచనకు గురి చేయాలన్న ఆలోచనతో నాలుగున్నరేళ్లు గుర్తుకురాని డీఎస్సీ నోటిఫికేషన్ను ఎన్నికల వేళ హడావుడిగా విడుదల చేశారు. ఎన్నో అనుమానాలు.. ఇంకెన్నో సంశయాలు మనసును కుదిపేస్తున్నా.. ఆ నోటిఫికేషన్ అయినా అక్కరకొస్తుందని భావించిన నిరుద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఎన్నికల నియమావళి అమలు నేపథ్యంలో డీఎస్సీ వెనక్కి వెళ్లిపోయింది. ఇంకెన్నిసార్లు మాయ చేస్తావ్ జగనన్నా.. అంటూ నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఉపాధ్యాయ ఖాళీల వివరాలు.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో సుమారు 1800 వరకు ఉపాధ్యాయ ఖాళీలుండేవి. నూతన విద్యావిధానం పేరుతో 3, 4, 5 తరగతులను విలీనం చేయడం ద్వారా ఉపాధ్యాయ ఖాళీల సంఖ్య తగ్గిపోయింది. తాజాగా వైకాపా ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో 228 ఉపాధ్యాయ ఖాళీలను మాత్రమే భర్తీ చేయనున్నట్లు తెలిపింది.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో నిరుద్యోగులు 13,864 మంది ఉపాధి కార్యాలయంలో నమోదై ఉన్నారు. ఏలూరులోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో రోజూ 50 నుంచి 100 మంది వరకు నిరుద్యోగులు పేర్లు నమోదు చేయించుకుంటూ ఉంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్
-
సీఎం సోదరుడి ఓటు గల్లంతు..
-
ఇరాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా మహమ్మద్ మొఖ్బర్
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం