జగన్ సాగుబడిలో.. అన్నదాతకు అష్టకష్టాలు
‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు.
దమ్ముల నుంచి విక్రయాల వరకు ఇబ్బందులే
రాయితీలను రద్దు చేసిన వైకాపా సర్కారు
పాలకొల్లు, న్యూస్టుడే: ‘సేద్యం చేసే రైతు చేయి పట్టి నడిపిస్తా. పంటకు పెట్టుబడి సాయమందిస్తా’ అని అధికారం చేపట్టిన సీఎం జగన్ అయిదేళ్ల పాలనలో అన్నదాతను అష్టకష్టాలు పెట్టారు. కేంద్రమిచ్చేదానికి కొంత కలుపుకొని కొందరు రైతులకు ఏటా రైతుభరోసా ఇస్తున్నామనే నెపంతో ఇతర రాయితీలన్నిటినీ రద్దు చేశారు. ఏరువాకలో దమ్ములు మొదలుకుని పండిన పంటలను విక్రయించుకునే వరకు అడుగడుగునా దగా చేశారనడానికి ఇవే ఉదాహరణలు.
ముడిజింకు మాటేలేదు : 1
వరిసాగులో జింకు లోపం రాకుండా దమ్ముల్లో వినియోగించే ముడిజింకును తెదేపా హయాంలో సొసైటీల ద్వారా 50 శాతం రాయితీపై రైతులకు పంపిణీ చేసేవారు. వైకాపా వచ్చాక ముడిజింకు పంపిణీ ఎత్తేశారు. అయిదేళ్లుగా సాగుభూములకు ముడిజింకు అందక వరిలో జింకు లోపం ఎక్కువైంది. పంట దిగుబడులు తగ్గిపోయాయి. ప్రస్తుతం రబీలో ఉమ్మడిజిల్లాలోని చాలామంది రైతులు బహిరంగ బజార్లో అధిక ధరలకు ముడిజింకు తెచ్చి చల్లారు.
బరకాలకు బొర్రెట్టారు : 2
వర్షాల నుంచి పంటను రక్షించే బరకాలనివ్వడం కూడా వైకాపా ప్రభుత్వం ఆపేసింది. ఖరీఫ్ పంట మాసూళ్ల సమయంలో 2023 డిసెంబరులో వచ్చిన మిగ్జాం తుపాను ధాటికి ధాన్యం తడిసిపోయి ఉమ్మడిజిల్లాలో 80వేల ఎకరాల పంట తడిసిముద్దయ్యింది. ప్రస్తుత రబీలోనూ ఈనెల 7న అకాల వర్షంతో వందలాదిమంది రైతులు ఇబ్బందులు పడ్డారు. రాయితీపై బరకాలు కూడా ఇవ్వకపోవడంతో ఉమ్మడిజిల్లాలోని 1,70 లక్షల మంది చిన్నసన్నకారు రైతులకు ఇబ్బందిగా పరిణమించింది. అయిదేళ్లుగా బరకాలు అద్దెకు తెచ్చుకుని పంటలను కాపాడుకోవాల్సిన దుస్థితి అన్నదాతలను వెంటాడుతోంది.
నష్టపరిహారంలో దగా : 3
2023 డిసెంబరులో వచ్చిన తుపానుకు పంటనష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలోనూ సీఎం జగన్ దగా చేశారు. ఉమ్మడి జిల్లాలో 80 వేల ఎకరాల్లో పంట నష్టం జరగగా పరిహారాన్ని సంక్రాంతినాటికి అందిస్తామని చెప్పి నేటికీ రూ.54 కోట్ల బకాయిలను విడుదల చేయలేదంటే రైతులపై సర్కారుకున్న ప్రేమను అర్థÄం చేసుకోవచ్చు.
కౌలురైతులకు పంగనామం : 4
జిల్లాలో మొత్తం 7 లక్షల మంది రైతులుంటే 2 లక్షల మంది పైబడి కౌలు రైతులున్నారు. కౌలు రైతులకిచ్చిన రుణఅర్హత కార్డులపై బ్యాంకు రుణాలిప్పిస్తామని చెప్పిన సీఎం జగన్ అటువంటి ప్రయత్నమే చేయలేదు. నిరుపేదలుగా ఉన్న కౌలు రైతులకు పెట్టుబడి సాయంగా రైతుభరోసా కూడా కల్పిస్తామని మొదట్లో చెప్పిన సీఎం జగన్ తర్వాత మాటమార్చారు. కేవలం ఎస్సీ కౌలు రైతులకే దానిని పరిమితం చేసి మిగిలిన సామాజిక వర్గాలకు పంగనామం పెట్టారని పాలకొల్లు గ్రామీణ మండలం లంకలకోడేరుకు చెందిన హరిబాబు వాపోయారు.
తేమపేరుతో మోసం : 5
ఉమ్మడి జిల్లాలో 7 లక్షల మంది ఆరుగాలం శ్రమించిన అన్నదాతలు పండిన పంటను అమ్ముకోవడానికి అయిదేళ్లుగా రేయింబవళ్లు శ్రమించారు. సీఎం జగన్ చెప్పిన మిల్లులకే ధాన్యాన్ని రవాణా చేసి తేమ పేరుతో నిలువునా మోసపోయారు. బస్తాకు 5 కిలోల నుంచి 10 కిలోలు మిల్లర్లు తగ్గించి రేటు కడుతున్నారని అన్నదాతలు ఆందోళన చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. చాలాచోట్ల రోడ్డెక్కి ధర్నాలు చేశారు కూడా. ప్రతిరైతు ఎకరానికి రూ.10 వేలు చొప్పున ప్రతి పంటకు నష్టపోయారు. ఉమ్మడి జిల్లాలో ఈ నష్టం విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా
పెత్తనమేగాని విత్తనం లేదు : 6
ఏటా ఏప్రిల్ వచ్చేసరికి జనుము, జీలుగు, పిల్లిపెసరవంటి పచ్చిరొట్ట విత్తనాలు గతంలో పంపిణీ చేసేవారు. వాటిని రైతులు రబీ కోతల సమయంలో చేలలో చల్లేవారు. జగనొచ్చాక పెత్తనమేగాని విత్తనమిచ్చింది లేదని అన్నదాతలు ఆవేదన చెందే పరిస్థితి ఉమ్మడి జిల్లాలో నెలకొంది. తెదేపా హయాంలో ప్రతి మండలానికి 2 టన్నులకు తక్కువ కాకుండా పచ్చిరొట్ట విత్తనాలను వ్యవసాయశాఖ పంపిణీ చేసేది. పచ్చిరొట్ట జల్లడంతో వేసవిలో పాడి పశువులకు మేతగా ఉపయోగపడేదని రైతులు చెబుతున్నారు. ఉద్యాన రైతులకు రూ.20కే పదిరకాల విత్తనాలిచ్చే పథకాన్ని జగన్ ఎత్తేశారు. ఉమ్మడిజిల్లాలో లక్షమందికి పైగా రైతులు నష్టపోయారు.
రాయితీల ఎగవేత : 7
ఉమ్మడి జిల్లాలో తెదేపా హయాంలో ఏటా 3 నుంచి 5 వేలమందికి సాగులో ఆధునికీకరణ పేరుతో 50 శాతం రాయితీపై రూ.20 కోట్లు విలువ చేసే యంత్రాలు అందించేవారు. రైతు రథం పేరిట ట్రాక్టర్లు ఇచ్చేవారు. వైకాపా ప్రభుత్వంలో ఒక్క రైతుకు రాయితీపై ట్రాక్టరు ఇచ్చిన పాపాన పోలేదు. శ్రీమంతులకే చెల్లుబాటయ్యే డ్రోన్ స్ప్రేయర్లను రాయితీపై ఇస్తామంటూ చివరలో తెరమీదకు తెచ్చిన సీఎం జగన్ ఉమ్మడి జిల్లాలో 35 మందిని ఎంపికచేసి శిక్షణతో సరిపెట్టడంతో ఆ పథకం కూడా చతికిలపడింది.
ఎరువంటే బరువే : 8
రైతుభరోసా కేంద్రాల ద్వారా తక్కువ ధరలకే రైతులకు ఎరువులిస్తామని చెప్పిన జగన్ యూరియా తప్ప ఇతర ఎరువులు ఇవ్వడం లేదు. అది కూడా అరకొరగానే రావడంతో అధికారపార్టీ నాయకులే యూరియాను దక్కించుకునే దుస్థితి. గతంలో తెదేపా ప్రభుత్వం సొసైటీలకు కాంప్లెక్స్ ఎరువులను కూడా తక్కువ ధరలకు పంపిణీ చేసి అన్నదాతలకు అండగా నిలిచేది. ఆయా ఎరువులు కావాల్సిన రైతులు బహిరంగ మార్కెట్లో అరువుగా తెచ్చుకోవడం తర్వాత పంటలొచ్చాక అధిక ధరలను భరించడం బరువుగా మారిందని యలమంచిలికి చెందిన రైతు తమ్మినీడి విష్ణుమూర్తి వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేత్రపర్వంగా శ్రీవారి ధ్వజారోహణం
[ 20-05-2024]
ద్వారకాతిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వైశాఖ మాస తిరుకల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ క్రతువును శాస్త్రోకంగా చేపట్టారు. -
వసతుల్లేక.. చదువులు సాగక!
[ 20-05-2024]
జూనియర్ కళాశాలలు జూన్ 1 నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది కూడా విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత విద్యా సంవత్సరంలో చేపట్టిన ‘నాడు- నేడు’ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. -
‘జీపీఎఫ్ సొమ్ము కాజేసిన సర్కారు’
[ 20-05-2024]
ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము రూ.500 కోట్లను సర్కారు కాజేసిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక ఛైర్మన్ కేఆర్ సూర్యనారాయణ విమర్శించారు. -
సాగుకు వేళాయె.. సన్నద్ధత లేదాయె
[ 20-05-2024]
రాయితీ పై పచ్చిరొట్ట విత్తనాల సరఫరా మందకొడిగా సాగుతోంది. వివిధ పంటల సాగుకు అవసరమైన విత్తనాలకు సంబంధించి రైతుల నుంచి ఇప్పటికీ ఇండెంట్లు సేకరించలేదు. సకాలంలో సాగు పనులు చేపట్టకపోతే.. పంట చేతికొచ్చే వేళ ప్రకృతి వైపరీత్యాలు రైతుల కష్టాన్ని మింగేస్తాయి. -
వేట నిషేధ సాయమేదీ?
[ 20-05-2024]
కడలి అలలకు ఎదురొడ్డి వేట సాగిస్తే గాని పూట గడవని గంగపుత్రులను వేట నిషేధ సమయంలో ఆర్థిక కష్టాలు వెన్నాడుతున్నాయి. సాయం అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా... అది కాస్త నీటిమూటగానే మిగిలిపోయింది. -
మూణ్నాళ్ల ముచ్చటే!
[ 20-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ఎన్నికల ముందు ఏలూరు నగరంలో దారుణంగా మారిన కొన్నింటికి హడావుడిగా మరమ్మతులు చేశారు. -
అత్యవసర సేవ.. నిర్లక్ష్య తోవ!
[ 20-05-2024]
జిల్లాలోని పలు ఏజెన్సీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో ఆయా గ్రామాలకు 108 వాహనాలు వెళ్లలేని దుస్థితి. కొండల మధ్యనున్న గిరిజనులు అనారోగ్యం బారిన పడితే డోలీ కట్టి మోసుకురావాల్సి వస్తోంది. -
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు
[ 20-05-2024]
ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని కలెక్టర్ సుమిత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షం కురిసినా ఇబ్బంది లేకుండా ప్రాంగణాల్లో వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయించాలని సూచించారు. -
పత్తాలేని ఫలితాలు
[ 20-05-2024]
అధిక దిగుబడి పొందాలన్నా.. రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలన్నా.. మట్టి స్వభావం తెలుసుకోవాలన్నా.. ఏ భూమిలో ఎలాంటి పంటలు పండించుకోవాలి.. తదితర సందేహాలకు భూసార పరీక్షలే సమాధానం. -
రంగస్థల స్ఫూర్తి.. చైతన్య దీప్తి!
[ 20-05-2024]
యలమంచిలి మండలం కొంతేరులో యూత్ క్లబ్ నాటక పరిషత్తు ఆధ్వర్యంలో మూడు రోజులుగా జరుగుతున్న నాటికల పోటీలు రంగస్థల స్ఫూర్తిని వ్యాపింపజేస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
[ 20-05-2024]
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా... మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన జంగారెడ్డిగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన కోన సాయి(23) మొబైల్ టెక్నీషియన్గా పనిచేస్తున్నారు. -
కార్మిక లోకం.. తీరని శోకం!
[ 20-05-2024]
భవనం పైభాగంలో పని చేస్తున్న ఓ తాపీ మేస్త్రి ప్రమాదవశాత్తూ కింద పడితే.. ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. ఓ ఇంటికి విద్యుత్తు కనెక్షన్ ఏర్పాటు చేసే ప్రక్రియలో కరెంటు ప్రవహిస్తున్న తీగలు తగిలితే.. ఆ ఎలక్ట్రీషియన్ కుటుంబం దిక్కులేనిదైపోతుంది. -
కళాశాల విద్య.. అంతా మిథ్య!
[ 20-05-2024]
పాఠశాలలకు కళాశాల దగ్గర చేయాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైస్కూల్ ప్లస్లు (జూనియర్ కళాశాలలు) వెలవెలబోతున్నాయి. అధ్యాపకుల కొరత.. సదుపాయాల లేమి.. అదే బడిలో కొనసాగడానికి విద్యార్థుల నిరాసక్తత.. వెరసి కళాశాలల నిర్వహణ విజయవంతం కావడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
-
రైసీ దుర్మరణం.. సంతాప దినం ప్రకటించిన భారత్
-
విమాన సర్వీసు రద్దు.. రేణిగుంట ఎయిర్పోర్టులో ప్రయాణికుల ఆందోళన
-
మీ సపోర్ట్కు థ్యాంక్స్.. అభిమానులపై ఎన్టీఆర్ స్పెషల్ పోస్ట్