కేసులకు తగ్గట్లు పెంచరేం
జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. అధికారులు పరీక్షల సంఖ్య మాత్రం పెంచట్లేదు. పక్క జిల్లా కృష్ణాలో రోజుకి ఎనిమిది వేల పరీక్షలు చేస్తోంటే జిల్లాలో ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయం. సరిగ్గా నెల క్రితం జిల్లాలో 2,500 వరకు
నెల క్రితం పాజిటివిటీ రేటు 0.36, ఇప్పుడు 27.64
పరీక్షలు మాత్రం అప్పుడెంతో.. ఇప్పుడూ అంతే
ఈనాడు డిజిటల్, ఏలూరు
జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నా.. అధికారులు పరీక్షల సంఖ్య మాత్రం పెంచట్లేదు. పక్క జిల్లా కృష్ణాలో రోజుకి ఎనిమిది వేల పరీక్షలు చేస్తోంటే జిల్లాలో ఆ దిశగా అడుగులేయక పోవడం శోచనీయం. సరిగ్గా నెల క్రితం జిల్లాలో 2,500 వరకు కొవిడ్ పరీక్షలు చేసేవారు. గతేడాది డిసెంబరు 22న జిల్లాలో కేసుల సంఖ్య తొమ్మిది. అంటే పాజిటివిటీ రేటు 0.36. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి శనివారం ఉదయం తొమ్మిది గంటల వరకు జిల్లాలో వెలుగు చూసిన కేసుల సంఖ్య 691. అంట పాజిటివిటీ రేటు.. 27.64కి చేరినా పరీక్షల సంఖ్య అంతే. రోజుకు 20 నుంచి 50 మంది వస్తున్నా.. వారిలో చాలా మందికి కొవిడ్ లక్షణాలు ఉంటున్నా.. జిల్లాలో చాలా చోట్ల పరీక్షలు అయిదు నుంచి పది మందికే చేస్తున్నారు.
కొవిడ్ పరీక్షలు, బాధితులకు సహాయ సహకారాలు, ఫీవర్ సర్వే వంటి.. ముందుజాగ్రత్త చర్యల్లో యంత్రాంగం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో పది, పదిహేను రోజులకు ఓసారి ప్రతి ఇంటికీ వెళ్లి.. జ్వరపీీడితులున్నారా..? వారికి ఏవైనా కొవిడ్ లక్షణాలున్నాయా.. పరీక్షలు అవసరమా అనే విషయాలను ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు, వాలంటీర్లు.. పరిశీలించేవారు. ఇప్పుడలాంటి ప్రయత్నమే జరగట్లేదు. కొవిడ్ నిర్థరణ అయిన వారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టు ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేసే ప్రక్రియకూ స్వస్తి పలికారు.పైగా ‘మేం కొవిడ్ బారిన పడ్డట్లు అనుమానముంది టెస్టులు చేయండి మహా ప్రభో’ అంటూ.. ఆసుపత్రులను ఆశ్రయిస్తున్న వారిని వెనక్కి పంపించేస్తున్నారు. జిల్లాలో విరివిగా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇబ్బంది లేకుండా చేస్తాం.. వేలకు వేలు పరీక్షలు చేస్తామని ఒమిక్రాన్ తొలికేసు బయటపడిన నేపథ్యంలో దాదాపు నెల క్రితం చెప్పిన అధికారులు ఇప్పుడు 2,000 నుంచి 2,500 పరీక్షలకే పరిమితమవుతున్నారు. ఇలా ఎందుకంటే.. ఐసీీఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం లక్షణాలున్నవారికే చేయాలని చెబుతున్నారు.. అధికారులు గతంలో జిల్లాలో రోజుకు 9,000 వరకు పరీక్షలు చేయగలమని చెప్పారు. ఆ లెక్కన చేస్తే అధికారికంగా ఎన్ని కేసులు వెలుగు చూస్తాయో.
తాడేపల్లిగూడెంలో ఏ ప్రభుత్వాసుపత్రికి వెళ్లినా రోజుకి పది పరీక్షలే చేస్తున్నారు. దీంతో మిగిలినవారు ప్రైవేటు ఆసుపత్రులకెళ్తే.. వివిధ రకాల పరీక్షల పేరుతో కనీసం రూ.అయిదు వేలు, కరోనా ఉంటే మరో రూ.అయిదు వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
తాడేపల్లిగూడెంలో ఫీవర్ సర్వే సర్వరు పనిచేయట్లేదని సచివాలయ సిబ్బంది చెబుతున్నారు. ఇంటింటి ఫీవర్ సర్వేను ప్రస్తుతం ఆపేసి వారంతా ఆస్తి పన్ను సర్వే చేస్తున్నారు. పురపాలక కమిషనర్ ఆదేశాలతో చేస్తున్నామని వారు చెబుతున్నారు.
లక్షణాలున్నా.. వెనక్కి వెళ్లాల్సిందే
లింగపాలెం మండల పరిధిలో ఉన్న మూడు పీహెచ్సీలకు రోజుకు సుమారు 50 నుంచి 60 మంది చొప్పున వస్తున్నారు. కానీ ఆయా పీహెచ్సీల సిబ్బంది మాత్రం ఐదుగురికే పరీక్షలు చేస్తున్నారు. లక్షణాలున్నా.. మిగిలిన వారిని వెనక్కి పంపేస్తున్నారు. ఇలా ఎందుకని అడిగితే.. ఎక్కువ చేయొద్దని ఆదేశాలున్నాయని చెబుతున్నారు. కిట్లు మాత్రం ఒక్కో ఆసుపత్రిలో వందకు పైగానే ఉండటం గమనార్హం.
23 మంది ఉపాధ్యాయులకు
ఏలూరు విద్యావిభాగం, న్యూస్టుడే: జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పలు పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు 23 మందికి తాజాగా కరోనా సోకింది. బోధనేతర సిబ్బంది ఒకరు కూడా దీని బారిన పడ్డారని శనివారం విడుదలైన వైద్య పరీక్షల నివేదికల్లో తేలిందని జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.
జిల్లాలో 17 కొవిడ్ కేర్ కేంద్రాలు
కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో 17 కొవిడ్ కేర్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జేసీ అంబేడ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 890 పడకలతో వీటిని ప్రారంభించినట్లు వెల్లడించారు. వీటి పర్యవేక్షణకు నాన్-మెడికల్ నోడల్ అధికారులను నియమించామన్నారు. ప్రతి హెల్ప్ డెస్క్నకు మేనేజర్లను, 9 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను నియమించినట్లు వెల్లడించారు.
జిల్లాలో కొవిడ్ ఆసుపత్రులు 55
ప్రభుత్వాసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులు 44మంది
వీరిలో ఆక్సిజన్పై చికిత్స పొందుతున్న వారు 30 మంది
కరోనా సమాచారం
శుక్రవారం నమోదైనవి : 691
మొత్తం కేసులు : 1,82,748
కోలుకున్నవారు : 1,80,117
మృతులు : 1,126
యాక్టివ్ : 1,505
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ రాసిన మరణ శాసనం
[ 27-04-2024]
వైకాపా అధికారంలోకి వచ్చాక నాటు సారా తయారీ, విక్రయాలు, వినియోగం అన్నీ పెరిగాయి. నూతన మద్యం విధానం పేరుతో రూ.60 ఉన్న క్వార్టర్ సీసాను రూ.120-150కి అమాంతం పెంచేశారు. -
మాటలు ఎక్కడో.. పనులు ఇక్కడే
[ 27-04-2024]
‘ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేస్తాం.. తొమ్మిది రకాల అభివృద్ధి పనులు చేపట్టి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతాం’ అని సీఎం జగన్, వైకాపా నాయకుడు ఊకదంపుడు ఉపాన్యాసాలిచ్చారు. -
పార్లమెంట్ 4, అసెంబ్లీకి 26 తిరస్కరణ
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. ఏలూరు పార్లమెంట్కు 17 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయగా వివిధ కారణాలతో 4 తిరస్కరణకు గురయ్యాయి. -
‘భూగర్భం’లో.. కలిసిపోయిన హామీలు..!
[ 27-04-2024]
నరసాపురంలో ప్రస్తుత జనాభా సుమారు 70వేలకు చేరిందని అంచనా. 31 వార్డుల్లో 109 కి.మీ మేర డ్రెయిన్ వ్యవస్థ ఉంది. మేజర్ డ్రెయిన్ల అవుట్లెట్ పొన్నపల్లి వద్ద గోదావరిలోకి ఉంది. -
ఎన్నికల విధుల్లో అప్రమత్తత అవసరం
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని సాధారణ పరిశీలకులు దీప, ఎల్ నిర్మలారాజ్, పోలీసు పరిశీలకులు శైలేష్కుమార్సిన్హా పేర్కొన్నారు. -
జగన్ పాలనలో అంతా దోపిడీ
[ 27-04-2024]
‘అయిదేళ్ల వైకాపా పాలనలో చింతలపూడి ఎత్తిపోతల కోసం సీఎం జగన్మోహన్రెడ్డి తట్టెడు మట్టి కూడా వేయలేదు. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నా పట్టించుకోలేదు. -
నామినేషన్ రోజునే గెలుపు ఖరారు: నిమ్మల
[ 27-04-2024]
తను నామినేషన్ వేసిన ఈ నెల 19న నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చినప్పుడే పాలకొల్లులో తన గెలుపు ఖరారయ్యిందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ధీమా వ్యక్తం చేశారు. -
నాడు జీవనాడి సవ్వడి.. నేడు జీవనం చతికిలపడి!
[ 27-04-2024]
రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను 2014-19లో తెదేపా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సోమవారాన్ని పోలవరంగా మార్చుకున్న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పనులు పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అటు అధికారులు, ఇటు గుత్తేదారులను పరుగులు పెట్టించేవారు. -
రెండు గంటల ఛార్జింగ్.. 25కి.మీ. ప్రయాణం
[ 27-04-2024]
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) విద్యార్థులు ఎలక్ట్రికల్ బైక్కు రూపకల్పన చేశారు. -
కుమారుడి జీతం నుంచి తల్లికి జీవన భృతి
[ 27-04-2024]
జన్మనిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను బాధ్యతగా, ప్రేమగా చూసుకోవాలని బాధ్యత పిల్లలదేనని ఆర్డీవో శ్రీనివాసులరాజు అన్నారు. -
ఇంత దగానా జగన్!
[ 27-04-2024]
‘అధికారంలోకి వచ్చిన వెంటనే గోపాలమిత్రలకు న్యాయం చేస్తా. ఉద్యోగ భద్రత కల్పించి జీవనోపాధిని మెరుగుపరుస్తా..’ అంటూ గత ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చిన జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చాక దానిని నెరవేర్చలేదు. -
రాక్షస పాలనకు త్వరలో తెర
[ 27-04-2024]
రాష్ట్రంలో వైకాపా రాక్షస పాలనకు త్వరలోనే తెరపడనుందని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
కూటమి వస్తేనే యువతకు ఉపాధి
[ 27-04-2024]
తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. -
నేడు పాలిసెట్
[ 27-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి శనివారం పరీక్ష (పాలిసెట్) నిర్వహించనున్నారు. ఏలూరు, పరిసర ప్రాంతాల్లో పరీక్ష నిర్వహణకు 11 కేంద్రాలు ఏర్పాటు చేశారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సుమిత్కుమార్, పరిశీలకులు దీప అభ్యర్థులు, వివిధ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్ల సమక్షంలో నామపత్రాలను పరిశీలించారు. -
నేటి నుంచి ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 27-04-2024]
ఇంటింటికీ ఓటరు సమాచార చీటీల పంపిణీని శనివారం నుంచి నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్ల అరెస్టు
[ 27-04-2024]
చీటింగ్ కేసులో నిందితుడి వద్ద రూ.50 వేలు తీసుకుంటూ ఓ కానిస్టేబుల్ ఏసీబీకి పట్టుబడిన కేసులో సీఐ, ఇద్దరు కానిస్టేబుళ్లను ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. -
తపాలా బ్యాలెట్ దరఖాస్తుకు గడువు పెంపు
[ 27-04-2024]
తపాలా బ్యాలెట్ కోసం ఫారం-12 సమర్పించేందుకు మే 1 వరకు గడువును పొడిగిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.