నిధులున్నా నీరసమే!
ప్రజారోగ్యశాఖ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.కోట్లు కేటాయించింది. వీటితో చేపడుతున్న పనులు క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని నగర పాలక, పురపాలక, నగర పంచాయతీల్లో తాగునీటి పథకాలతోపాటు జగనన్న కాలనీల్లో తాగునీటి పనులు మందకొడిగా నడుస్తున్నాయి.
ఇంజినీరింగ్ అధికారుల కొరతతో పనుల్లో తీవ్ర జాప్యం
ప్రజారోగ్యశాఖలో ముందుకు సాగని అభివృద్ధి పనులు
బొల్లవరం జగనన్న కాలనీలో నిరుపయోగంగా తాగునీటి ట్యాంకులు
న్యూస్టుడే, ప్రొద్దుటూరు పట్టణం: ప్రజారోగ్యశాఖ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.కోట్లు కేటాయించింది. వీటితో చేపడుతున్న పనులు క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతున్నాయి. జిల్లాలోని నగర పాలక, పురపాలక, నగర పంచాయతీల్లో తాగునీటి పథకాలతోపాటు జగనన్న కాలనీల్లో తాగునీటి పనులు మందకొడిగా నడుస్తున్నాయి. ఇంజినీరింగ్ అధికారుల కొరతతోనే ఈ పరిస్థితి నెలకొందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆరుగురు అసిస్టెంట్ ఇంజినీర్లు (ఏఈ) ఉండాల్సి ఉండగా, ఒకరు మాత్రమే ఉన్నారు. రెండు సబ్ డివిజన్ పరిధిలో ఏళ్లతరబడి ఒక డీఈ మాత్రమే ఉన్నారు. ఏఈల కొరతతో సచివాలయ పరిధిలోని వార్డు సచివాలయ ఇంజినీర్లను ఒక్కొక్కరు చొప్పున డిప్యుటేషన్పై నియమించుకున్నారు. సచివాలయ ఇంజినీర్లు రూ.కోట్లతో చేపడుతున్న పనుల పర్యవేక్షణతోపాటు నాణ్యతను పరిశీలించాలన్న, వాటికి సంబంధించిన లోటుపాట్లను ఎప్పటికప్పుడు దస్త్రాల్లో నమోదు చేయడానికి సరైన అనుభవం లేకపోవడంతో నమోదు చేయలేకపోతున్నారు.
- నగర పంచాయతీ పరిధిలో టెండర్ల దశలోనే కొన్ని పనులు నిలిచిపోయాయి. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు ప్రాంతాల్లో ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యంలో పనులు చేపడుతున్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో బురదనీరు వస్తోందని పట్టణ వాసులు పలుమార్లు ఫిర్యాదు చేశారు. మౌలానా ఆజాద్ వీధిలో అమృత్ పథకం కింద నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకును శుభ్రం చేసిన అనంతరం నీటిని పంపే గొట్టం పడిపోయి తొమ్మిది నెలలు కావస్తున్నా ఆ శాఖాధికారులు పట్టించుకోలేదు. పురపాలక ఇంజనీరింగ్ అధికారులు ప్రజారోగ్య శాఖకు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు.
- ప్రొద్దుటూరు పురపాలక సంఘం పరిధిలో మూడు జగనన్న కాలనీలు ఉండగా, బొల్లవరం జగనన్న కాలనీలో రూ.10 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం నిర్మాణ పనులపై నాలుగేళ్లుగా ఈ రోజు, రేపు అంటూ ప్రజారోగ్యశాఖాధికారులు కాలం వెళ్లదీస్తున్నారు. ఫలితంగా కాలనీలో నిర్మించిన చిన్ననీటి ట్యాంకుల్లోకి నీరు రాక దిష్టిబొమ్మల్లా తయారయ్యాయి. ట్రాక్టర్లతో సంపుల్లోకి నీరు తెచ్చుకునేందుకు గృహ లబ్ధిదారులు నీటిని డ్రమ్ముల ద్వారా నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటి ఏఈ కూడా పూర్తి స్థాయిలో పనులను రికార్డు చేయలేదని గుత్తేదారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ పరిధిలో వరద నీరు, మురుగుపారుదలకు వీలుగా కొత్తపల్లె కాలువ ఆధునికీకరణ పనులకు రూ.163 కోట్లు, తాగునీటి గొట్టాల ఏర్పాటుకు రూ.119 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వీటన్నింటిపై నిర్వహణ, పర్యవేక్షణ వార్డు సచివాలయ ఇంజినీరే దిక్కు కావడం గమనార్హం.
- కమలాపురం నగర పంచాయతీ పరిధిలో కొన్ని పనులు రెండేళ్ల నుంచి సాగుతూనే ఉన్నాయి. సమగ్ర నీటి పథకానికి రూ.58.2 కోట్లు, మురుగు కాలువల ఆధునికీకరణకు రూ.7.99 కోట్లు, రహదారులు, ఆర్చిల నిర్మాణ పనులకు రూ.5.7 కోట్లు నిధులు మంజూరయ్యాయి సమగ్ర నీటి పథకం పైపులైన్ పనులు 60 కిలోమీటర్లు చేపట్టాల్సి ఉండగా, కేవలం మూడు కిలోమీటర్లే జరిగాయి. ఈ ప్రాంతంలో కూడా సచివాలయ ఇంజినీర్ మాత్రమే దిక్కయ్యారు.
- ఎర్రగుంట్ల నగరపంచాయతీలో రూ.109.34 కోట్లు, మైదుకూరు నగర పంచాయతీల పరిధిలో రూ.90 కోట్లతో చేపట్టిన సమగ్ర తాగునీటి పథకం నిర్మాణపనులు నిలిచిపోయాయి.
- బద్వేలు పరిధిలో పట్టణం, జగనన్న కాలనీల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.80 కోట్లతో చేపట్టిన పనులు టెండరు దశలోనే నిలిచిపోయాయి. ఈ పనులు చేపట్టడానికి గుత్తేదారులు ముందుకు రాకపోవడమే కారణమని సమాచారం.
ఇంజినీరింగ్ అధికారుల కొరత వాస్తవమే...
ప్రజారోగ్యశాఖ పరిధిలో ఇంజనీరింగ్ అధికారుల కొరత ఉండడంతో సచివాలయ సిబ్బందిని నియమించుకున్నాం. ప్రొద్దుటూరులో తాగునీటిలో వస్తున్న బురదపై స్పందిస్తూ మైలవరం జలాశయంలో తాగునీటి మట్టం పడిపోవడంతో గొట్టాలను దింపి నీటిలోకి ఏర్పాటు చేయడంతో సమస్య వచ్చింది. పనులు కొంత మేరకు నెమ్మదిగా సాగుతున్నాయి.
యశోద, డీఈ, ప్రజారోగ్యశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండల కేంద్రంలో చోరీ
[ 16-06-2024]
మండల కేంద్రంలోని జి. వెంకట్రామిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. -
అక్రమాలపై ‘రామ’బాణం సంధించాలి!
[ 16-06-2024]
వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల పరిధిలో చేపట్టిన కాలేటివాగు ప్రాజెక్టుతోపాటు కురబలకోట మండలం ముదివేడు జలాశయం నిర్మాణపనుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాల్సి ఉంది. -
కడపలో నటి నిధి అగర్వాల్ సందడి
[ 16-06-2024]
కడప నగరంలో శనివారం సినీనటి నిధి అగర్వాల్ సందడి చేశారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఏర్పాటు చేసిన జోస్ ఆలుక్కాస్ బంగారు ఆభరణాల షోరూంను ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవితో కలిసి ప్రారంభించారు. -
సరఫరా... అరకొర!
[ 16-06-2024]
వేసవి సెలవుల అనంతరం ఈ నెల 13న బడి గంట మోగింది. అదే రోజు విద్యార్థులకు విద్యాసామగ్రిని అందజేస్తామని ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇప్పటికీ పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదు. -
కబ్జాలపై ఉక్కుపాదం మోపండి!
[ 16-06-2024]
వైకాపా విధ్వంసకర పాలనకు చరమగీతం పాడిన తెదేపా, జనసేన, భాజపా కూటమిపై జిల్లా ప్రజానీకం.. ప్రత్యేకించి జగన్ సర్కారు బాధితులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది వైకాపా నేతలు ఊరూవాడ భూములను కాజేశారు. -
ఇసుక తరలింపుపై వైకాపా నాయకుల గొడవ... దాడికి యత్నం
[ 16-06-2024]
ఇసుక తరలింపుపై ప్రొద్దుటూరులో వైకాపా ముఖ్య నేతల అనుచరులు పెన్నా నదిలో దాడులకు పాల్పడుతున్నారు. తమ ఏరియాలో తాము మాత్రమే ఇసుకను తరలించాలని ఇతరులు వస్తే ఊరుకునే ప్రసక్తే లేదంటూ వాగ్వాదానికి దిగుతున్నారు. -
మంత్రి మండిపల్లి రాకతో పులకించిన రాయచోటి
[ 16-06-2024]
రాయచోటి నియోజకవర్గ ఎమ్మెల్యే మండిపల్లి రాంప్రసాద్రెడ్డి రవాణా, యువజన, క్రీడలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా శనివారం రాయచోటికి వచ్చారు. -
పీలేరు... అక్రమాల జోరు!
[ 16-06-2024]
నియోజకవర్గ కేంద్రం పీలేరు విద్య, వ్యాపార రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతోంది. అందుకు తగ్గట్టుగానే పంచాయతీకి ఆదాయం సమకూరుతోంది. అధికారం తమదేనని, అడిగేవారు లేరని గత వైకాపా ప్రభుత్వ హయాంలో పాలక వర్గాలు ఇష్టారాజ్యంగా వ్యవహరించాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్
-
అమెరికా ఎన్నికల్లో ఈవీఎంలు వద్దు : ఎలాన్ మస్క్