ప్రాణం తీసిన ఈత సరదా
కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగ ఆనందంగా జరుపుకోవాల్సిన యువకుడు స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లి మృతవాత పడటంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే... ప్రొద్దుటూరు పట్టణంలో కోటవీధికి చెందిన ప్రతాప్రెడ్డి, రంగలక్ష్మిల కుమారుడు సాయి కిరణ్రెడ్డి (24) బీటెక్ పూర్తిచేసి
సాయి కిరణ్రెడ్డి (పాతచిత్రం)
జమ్మలమడుగు గ్రామీణ : కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి పండగ ఆనందంగా జరుపుకోవాల్సిన యువకుడు స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లి మృతవాత పడటంతో ఆ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే... ప్రొద్దుటూరు పట్టణంలో కోటవీధికి చెందిన ప్రతాప్రెడ్డి, రంగలక్ష్మిల కుమారుడు సాయి కిరణ్రెడ్డి (24) బీటెక్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. శుక్రవారం సాయికిరణ్రెడ్డి మరో ఐదుగురు స్నేహితులతో కలిసి ప్రముఖ పర్యాటక ప్రాంతమైన గండికోటకు వెళ్లాడు. అక్కడి నుంచి పెన్నాలోయ సమీపంలో ఉన్న జలపాతం వద్ద ఈతకు వెళ్లి సాయికిరణ్రెడ్డి నీళ్లలో మునిగిపోయాడు. స్నేహితులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న కొంతమంది వచ్చి బయటకు తీశారు. జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్సై రఘురాం తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!