నేరాల కట్టడికి నిఘా పెంచాలి : ఎస్పీ
జిల్లాలో నేరాల కట్టడికి నిఘా పెంచాలని ఎస్పీ అన్బురాజన్ పోలీసులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ సమావేశం మందిరంలో శనివారం ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో నేరాలపై
మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్, చిత్రంలో ఎస్ఈబీ అదనపు
ఎస్పీ నీలం పూజిత, ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్కుమార్
కడప నేరవార్తలు, న్యూస్టుడే : జిల్లాలో నేరాల కట్టడికి నిఘా పెంచాలని ఎస్పీ అన్బురాజన్ పోలీసులను ఆదేశించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని పెన్నార్ సమావేశం మందిరంలో శనివారం ఎస్పీ ఆధ్వర్యంలో డీఎస్పీ, సీఐలు, ఎస్సైలతో నేరాలపై సమీక్ష నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. తీవ్రమైన నేరాల్లో త్వరితగతిన దర్యాప్తు పూర్తిచేసి ఛార్జిషీటు దాఖలు చేయాలన్నారు. జిల్లాలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో ప్రమాదనివారణ చర్యలు చేపట్టాలని, అవసరమైతే వాహనదారులను అప్రమత్తం చేస్తూ సూచిక బోర్డులు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. మహిళలపై జరుగుతున్న వివిధ రకాల నేరాలపై దర్యాప్తు వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పోక్సో, మహిళలపై జరిగిన నేరాలపై నిర్ణీత సమయంలో ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, బాలికల అదృశ్య కేసుల్లో సమగ్ర విచారణ జరిపి అదృశ్యమైన వారి ఆచూకీ తెలుసుకోవాలన్నారు. ఎస్ఈబీ అధికారులతో కలిసి నాటుసారా స్థావరాలపై సంయుక్తంగా దాడులు నిర్వహించాలని చెప్పారు. ఎస్హెచ్ఆర్సీ, ఎన్హెచ్ఆర్సీ ఫిర్యాదులపై తక్షణం స్పందించాలని ఆదేశించారు. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, విధుల్లో తేడాలొస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అనంతరం ఒక్కో డివిజన్ పరిధిలో నేరాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ఎస్ఈబీ అదనపు ఎస్పీ నీలం పూజిత, ఏఆర్ అదనపు ఎస్పీ మహేష్కుమార్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన