ప్రభుత్వ భూములకేదీ రక్షణ?
జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరవవుతోంది.
రూ.కోట్ల విలువైన స్థలాలపై అక్రమార్కుల కన్ను
జిల్లా కేంద్రంలో మాయమవుతున్న సూచికలు
న్యూస్టుడే, రాయచోటి
మదనపల్లె రోడ్డులోని ప్రభుత్వ స్థలంలో మాయమైన సూచిక
జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ స్థలాలకు రక్షణ కరవవుతోంది. గతంలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న సమయంలోనే కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలపై కన్నేసి గుట్టలు, వాగులు, వంకలు, శ్మశాన వాటికలను ఆక్రమించే ప్రయత్నాలు చేశారు. ఆక్రమణలపై పత్రికల్లో వరుస కథనాలు వెలువడడంతో అప్పట్లో అధికారులు పట్టణ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి కొలతలు వేసి ఇది ప్రభుత్వ స్థలం అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కొంత కాలం గడిచేసరికి తిరిగి ఆ స్థలాలపై అక్రమార్కుల కన్ను పడింది. ప్రభుత్వ భూములకు రక్షణ చర్యలు చేపట్టడంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. శాఖల మధ్య సమన్వయ లోపాన్ని అక్రమార్కులు ఆసరాగా చేసుకుని స్థలాలను పట్టా భూముల్లో కలిపేసుకుంటున్నారు.
* రాయచోటి పురపాలక సంఘం పరిధిలో సుమారు పదెకరాల వరకు ప్రభుత్వ భూములను నాలుగేళ్లలో అధికారులు గుర్తించారు. గున్నికుంట్ల రోడ్డులోని కుంట, శ్మశాన వాటిక కలుపుకొని సుమారు ఆరెకాల ప్రభుత్వ స్థలం ఉంది. ఇక్కడ రియల్టర్లు గతంలో ఆక్రమించి కొంత స్థలాన్ని ప్లాట్లుగా మార్చేశారు. కుంట కట్ట, నీటి మునక ప్రాంతాలను ఆక్రమించి స్థలాల్లోకి నేరుగా రహదారులు నిర్మించుకున్నారు. వీటిని నిలువరించే చర్యల్లో భాగంగా గతంలో రెవెన్యూశాఖాధికారులు సూచిక బోర్డులు ఏర్పాటు చేసినా అవి కేవలం మూన్నాళ్ల ముచ్చటగానే మారిపోయాయి.
* రింగ్ రోడ్డుకు ఎగువన ఉన్న ఇనాత్ఖాన్ చెరువు కట్ట, పడమర, తూర్పు వైపులలో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి. కొందరు రహదారి అనుబంధంగా నిర్మాణాలు చేసుకుంటూ వెనక్కి పునాదులు వేసుకొంటూ వెళ్లుతున్నారు. ఆ ప్రాంతాల్లో గతంలో ఆక్రమణలు గుర్తించి పాతిన సూచికలు మాయమయ్యాయి. రింగ్ రోడ్డు కల్వర్టులను ఆక్రమించి ప్లాట్లుగా మార్చిన ప్రదేశాలలోనూ సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. కలెక్టరు, ఎస్పీ కార్యాలయాల సమీపంలోనే ఉన్న రింగ్రోడ్డు వద్ద ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారు.
రక్షణ లేని మదనపల్లె-కె.రామాపురం రహదారిలోని కుంట స్థలం
* రాయచోటి-మదనపల్లె ప్రధాన రహదారిలోని పెట్రోల్ బంకు సమీపంలోని సుమారు 25 సెంట్ల ప్రభుత్వ స్థలానికి రక్షణ కరవైంది. ఇక్కడ సెంటు ధర రూ.లక్షల్లో పలుకుతోంది. ఇక్కడి స్థలాన్ని అధికార, అంగబలం గల కొందరు ఆక్రమించే యత్నం చేయడంతో గతంలో ‘ఈనాడు’లో వరుస కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో స్పందించిన అధికారులు అక్కడ సూచిక బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల కొందరు అక్రమార్కులు దాన్ని తొలగించి వెనుక వైపు నుంచి చదును పనులు చేపడుతున్నారు.
* మదనపల్లె రోడ్డు నుంచి కె.రామాపురం రహదారిపైకి వెళ్లే మార్గంలోని ప్రభుత్వ కుంట స్థలం 1.51 ఎకరాలను ఇటీవల అధికారులు ఉన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి కేటాయించారు. ఇక్కడ కొలతలు వేసి ప్రభుత్వ స్థలానికి సరైన హద్దులు ఏర్పాటు చేయలేదు. ఇంజినీరింగ్ విభాగం అధికారులు రహదారులు, భవనాల నిర్మాణం చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూచికలు తొలగింపు, ఆక్రమణలపై ఆర్డీవో రంగస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి రాజ్యం.. ఆరోగ్యశ్రీకి అనారోగ్యం...!
[ 27-04-2024]
కడప నగరానికి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం శస్త్రచికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. -
మరుపురానిది ‘జగనాసుర రక్తచరిత్ర’!
[ 27-04-2024]
‘జగనాసుర రక్తచరిత్ర’ మరుపురానిదని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో జరిగిన అరాచకాలు చరిత్రకెక్కుతాయని వివరించారు. -
జగన్ హామీకి తొండి... పరిహారానికి గండి..!
[ 27-04-2024]
కొండాపురం మండలంలో పెన్నా, చిత్రావతి నదులు కలిసే చోట 26.85 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో గండికోట జలాశయం నిర్మించడంతో కొండాపురం, ముద్దనూరు మండలాల పరిధిలోని 22 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. -
న్యాయం చేస్తానన్నావ్...సాయం చేయకున్నావ్...!
[ 27-04-2024]
సోమశిల వెనుక జలాలతో ముంపు గ్రామాల ప్రజలు అధైర్యపడొద్దు. మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది. మీరంతా సంతృప్తి చెందేలా పునరావాస ప్యాకేజీ వర్తింపజేస్తాం. -
నేత్రపర్వంగా పురుషోత్తముడికి పుష్పాభిషేకం
[ 27-04-2024]
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శుక్రవారం పురుషోత్తముడి పుష్పాభిషేకం నేత్రపర్వంగా సాగింది. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలను తొమ్మిది రోజుల పాటు వైభవంగా నిర్వహించారు. -
ముగిసిన నామినేషన్ల పరిశీలన
[ 27-04-2024]
జిల్లాలో నామినేషన్ల పరిశీలన శుక్రవారం పూర్తయింది. కడప పార్లమెంట నియోజకవర్గానికి సంబంధించి 32 నామపత్రాలు దాఖలు కాగా 14 ఆమోదించారు. -
30న పీలేరు, మైదుకూరులలో సీఎం జగన్ బహిరంగ సభలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా మైదుకూరు, పీలేరులో ఈ నెల 30న నిర్వహించే బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొననున్నారు. -
పెద్దిరెడ్డి కుటుంబాన్ని సాగనంపండి
[ 27-04-2024]
రాష్ట్రంలో ధర్మానికి అధర్మానికి మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతోందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
ఆపు నీ డప్పు... ఇవ్వు మా డబ్బు!
[ 27-04-2024]
జిల్లాలో గతేడాది మిగ్జాం తుపాను ప్రభావంతో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం అందే అవకాశాలు కనిపించట్లేదు. -
క్షణం క్షణం... భయం భయం
[ 27-04-2024]
ఇళ్లలో ఉంటే విద్యుత్తు తీగలు ఎప్పుడు కింద పడుతాయోననే భయం.. ఆరుబయటికి వస్తే పిల్లలు తెలియక తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్ఫార్మర్లను తాకి ప్రమాదాల బారిన పడుతారేమోననే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు