logo

భారీగా కర్ణాటక మద్యం ధ్వంసం

మదనపల్లె ఎస్‌ఈబీ స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని శనివారం ధ్వంసం చేశారు.

Published : 05 Feb 2023 02:22 IST

మద్యం సీసాలు ధ్వంసం చేస్తున్న ఎస్‌ఈబీ అధికారులు

మదనపల్లె నేరవార్తలు, న్యూస్‌టుడే : మదనపల్లె ఎస్‌ఈబీ స్టేషన్‌ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని శనివారం ధ్వంసం చేశారు. ఈఎస్‌ మధుసూదన్‌, ఏఈఎస్‌ రాధాకృష్ణలు మాట్లాడుతూ... అనంతపురం డీసీ, అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ రాజ్‌కమల్‌ ఆదేశానుసారం మదనపల్లె ఎస్‌ఈబీ స్టేషన్‌ పరిధిలోని 2020-21, 22 సంవత్సరాల్లో నిర్వహించిన దాడుల్లో 69 కేసులకు సంబంధించి రూ.12,25,200 విలువ చేసే 12,252 కర్ణాటక మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామన్నారు. మదనపల్లె డివిజన్‌లో ఎక్కడైనా సారా, కర్ణాటక మద్యం విక్రయాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ మురళీకిషోర్‌, ఎస్సై అంజాద్‌బాషా, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని