భారీగా కర్ణాటక మద్యం ధ్వంసం
మదనపల్లె ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని శనివారం ధ్వంసం చేశారు.
మద్యం సీసాలు ధ్వంసం చేస్తున్న ఎస్ఈబీ అధికారులు
మదనపల్లె నేరవార్తలు, న్యూస్టుడే : మదనపల్లె ఎస్ఈబీ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన కర్ణాటక మద్యాన్ని శనివారం ధ్వంసం చేశారు. ఈఎస్ మధుసూదన్, ఏఈఎస్ రాధాకృష్ణలు మాట్లాడుతూ... అనంతపురం డీసీ, అన్నమయ్య జిల్లా అదనపు ఎస్పీ రాజ్కమల్ ఆదేశానుసారం మదనపల్లె ఎస్ఈబీ స్టేషన్ పరిధిలోని 2020-21, 22 సంవత్సరాల్లో నిర్వహించిన దాడుల్లో 69 కేసులకు సంబంధించి రూ.12,25,200 విలువ చేసే 12,252 కర్ణాటక మద్యం బాటిళ్లను ధ్వంసం చేశామన్నారు. మదనపల్లె డివిజన్లో ఎక్కడైనా సారా, కర్ణాటక మద్యం విక్రయాలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ మురళీకిషోర్, ఎస్సై అంజాద్బాషా, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్