AP News: కొట్టానంటే గూబ గుయ్మంటుంది!.. ఉద్యోగులపై రెచ్చిపోయిన ఏఎంసీ ఛైర్మన్
‘లేరా కొడకా... కొట్టానంటే గూబ గుయ్మంటుంది..’ అంటూ పీలేరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ ఉద్యోగులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అడ్డుకోబోయిన వారిని కొట్టడానికి యత్నించారు.
తన వాటా రూ.5 వేలు ఇవ్వలేదని ఆగ్రహావేశం
ఛైర్మన్ ఎల్లయ్యతో మాట్లాడుతున్న కార్యదర్శి సురేంద్ర, సూపర్వైజర్ వినయ్కుమార్
పీలేరు, న్యూస్టుడే: ‘లేరా కొడకా... కొట్టానంటే గూబ గుయ్మంటుంది..’ అంటూ పీలేరు వ్యవసాయ మార్కెట్ యార్డు ఛైర్మన్ ఉద్యోగులపై పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. అడ్డుకోబోయిన వారిని కొట్టడానికి యత్నించారు. తాము ప్రభుత్వ ఉద్యోగులమని వదిలేయమని వేడుకున్నా వినకుండా మరింత రెచ్చిపోయిన ఛైర్మన్ తీవ్ర పరుష పదజాలంతో దుర్భాషలకు దిగారు. దీంతో విస్తుపోయిన పొరుగు సేవల ఉద్యోగులు ఛైర్మన్కు సర్దిచెప్పడంతో చివరకు ఛైర్మన్ కమిటీ కార్యదర్శి సురేంద్ర, కార్యదర్శి వినయ్కుమార్లకు క్షమాపణలు చెప్పారు. ఉద్యోగులపై వైకాపా నాయకులు దౌర్జాన్యానికి దిగడం రివాజుగా మారింది. కమిటీ ప్రాంగణంలో ఆదివారం గొర్రెల సంతలో కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన రుసుంలో ఛైర్మన్కు రూ.5 వేలు ఇచ్చి పొరుగుసేవల ఉద్యోగులు ఒక్కొక్కరు రూ.300 చొప్పున తీసుకునే వారు. 2023-24 ఏడాదికి కమిటీ ఆదాయం లక్ష్యం రూ.40 లక్షలకు రూ.28 లక్షలు మాత్రమే వసూలైంది. దీంతో జిల్లా ఏఎంసీ అధికారులు పీలేరు ఉద్యోగులను లక్ష్యాలను సాధించాలంటూ చీవాట్లు పెట్టారు. దీంతో ఉద్యోగులు వసూలు చేసిన మొత్తం కమిటీ ఖాతాలో జమ చేస్తున్నారు. ఇది నచ్చని ఛైర్మన్ తనకు డబ్బులు ఎందుకివ్వరని కమిటీ కార్యదర్శి సురేంద్ర, సూపర్వైజర్ వినయ్కుమార్ను గదమాయించారు. రుసుములు వసూలు చేస్తున్న ఉద్యోగులను దుర్భాషలాడారు. ఇంత వరకు పనిచేసిన ఛైర్మన్లు ఎవరూ ఇలా దుర్భాషలాడలేదని ఉద్యోగులు వాపోయారు. సిబ్బంది వద్ద ఆదివారం గొర్రెల సంత రుసుముల్లో రూ.5 వేలు తీసుకుంటున్నారని ఉద్యోగులు చెబుతున్నారని ఛైర్మన్ అడగ్గా అలాంటేమీ లేదని సమాధానం దాట వేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గొడవలకు దిగితే రౌడీషీట్
[ 17-05-2024]
మండలంలోని పోరుమామిళ్ల సర్కిల్ పరిధిలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాశీనాయన పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గొడవలకు దిగితే రౌడీషీట్ తెరవడంతో పాటు జిల్లా, మండల బహిష్కరణ చేస్తామని ... -
నిబంధనలకు పాతర... ఇసుకాసురుల జాతర..!
[ 17-05-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా, అక్రమాలు ఆపాలన్న ఆదేశాలను పక్కనబెట్టి యథేచ్ఛగా కొనసాగించడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకోలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మాసనం మండి పడింది. -
బద్వేలులో భూఆక్రమణ!
[ 17-05-2024]
నియోజకవర్గ కేంద్రమైన బద్వేలు పట్టణంలోని ఎన్జీవో కాలనీలో ప్రజావసరాలకు కేటాయించిన రూ.కోట్ల విలువైన ఎకరా విస్తీర్ణంలోని ప్రభుత్వ స్థలంపై ఆక్రమార్కుల కన్ను పడింది. -
వేసవి శిక్షణ... తప్పని నిరీక్షణ!
[ 17-05-2024]
ఏడాదిపాటు చదువులతో అలిసిపోయిన విద్యార్థులకు కాస్తంత ఊరట, వినోదం కోసం నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం క్రీడాకారులను నిరాశ పరుస్తోంది. -
నిప్పులార్పగలరు... భవనాలూ నిర్మించగలరు
[ 17-05-2024]
దృఢ సంకల్పం, పవిత్ర ఆశయం తప్పక సత్ఫలితాలిస్తాయి. వీటిని ఆయుధాలుగా చేపట్టిన వారు విజయాలను సాధిస్తారనే స్వామి వివేకానందుడి సూక్తిని నిజం చేశారు ప్రొద్దుటూరు అగ్నిమాపక, విపత్తుల శాఖలో ఫైర్మెన్గా పని చేసే ఒ.నరేంద్రకుమార్. ఉద్యోగం రాకముందు బేల్దారి పని చేసి జీవించేవారు. -
సీఎం బటన్ నొక్కినా జమకాని నగదు
[ 17-05-2024]
సీఎం జగన్ వివిధ సంక్షేమ పథకాలకు బటన్ నొక్కినా నిధులు ఎక్కడున్నాయో తెలియడం లేదని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. -
ఏడేళ్లనంతరం గండికోట జలాల తగ్గుముఖం
[ 17-05-2024]
ఏడేళ్లనంతరం గండికోట జలాశయంలో నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి 2.9 టీఎంసీలకు చేరింది. జలాశయానికి తొలిసారిగా 2013, సెప్టెంబరులో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించి మూడు టీఎంసీల నీటిని నిల్వ చేశారు. -
మండిపల్లి గృహనిర్బంధం
[ 17-05-2024]
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలో గురువారం తెదేపా రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిని పోలీసులు ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం ఘటనలో
[ 17-05-2024]
చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నానికి పాల్పడిన 13 మందిని 14 రోజుల రిమాండు నిమిత్తం కడప కేంద్ర కారాగారానికి తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
ఏడుకొండలపై ఎటు చూసినా భక్తజనమే.. 3 కి.మీ మేర క్యూలైను
-
వాళ్లను భారత్ గౌరవిస్తే.. మనం ‘దొంగలు’ అంటున్నాం- పాకిస్థాన్ మంత్రి
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ