logo

కడపలో విచ్చలవిడిగా గంజాయి

కడప నగరంలో ఆకుకూరల కంటే గంజాయే సులువుగా లభిస్తోందని తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆరోపించారు.

Published : 16 Apr 2024 02:18 IST

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే: కడప నగరంలో ఆకుకూరల కంటే గంజాయే సులువుగా లభిస్తోందని తెలుగుదేశం పార్టీ కడప అసెంబ్లీ అభ్యర్థి మాధవిరెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ నాయకుల అండతో గంజాయి బ్యాచ్‌ రెచ్చిపోతుందని విమర్శించారు. నగరంలోని తన నివాసంలో ఆమె సోమవారం మాట్లాడుతూ ప్రకాశ్‌నగర్‌లో ఇటీవల ఆరుగురు వ్యక్తులు గంజాయి మత్తులో మహిళలపై దాడులకు పాల్పడ్డారని తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారని, వైకాపాకు చెందిన కార్పొరేటరు వారిని కాపాడేందుకు పులివెందుల పెద్దల నుంచి ఒత్తిడి తీసుకువచ్చారని ఆరోపించారు. చీకటి పడితే మహిళలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు.  గతంలో కోడికత్తి,  ప్రస్తుతం గులకరాయి ఘటనలన్నీ జగన్‌ నాటకాలేనని ప్రజలందరికీ తెలుసన్నారు.   ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కోరతామని చెప్పారు.  తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ సానుభూతితో ఓట్లు దండుకుని అధికారంలోనికి వచ్చేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారని, అయినా వైకాపాకు ఓటమి తప్పదని హెచ్చరించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్‌, మాజీ జీపీ గుర్రప్ప, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని