logo

రేపు రాజంపేట, రైల్వేకోడూరుకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ రాక

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు.

Published : 24 Apr 2024 03:46 IST

ఈనాడు, కడప: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా తెదేపా, జనసేన పార్టీ అధినేతలు నారా చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌లు గురువారం రాజంపేట, రైల్వేకోడూరుకు రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రాజంపేటకు మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో చేరుకుని బహిరంగసభలో పాల్గొననున్నారు. అనంతరం రాజంపేట నుంచి హెలికాప్టర్‌లో రైల్వేకోడూరుకు చేరుకుని బహిరంగసభలో పాల్గొంటారు. ఆ తరువాత ఇద్దరు అగ్రనేతలు రాత్రికి తిరుపతి విమానాశ్రయం చేరుకుని తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ మేరకు ఇరు పార్టీల నేతలకు అధికార సమాచారం అందింది. రాజంపేట, రైల్వేకోడూరులో బహిరంగసభల విజయవంతానికి తెదేపా, జనసేన కీలక నేతలు శ్రేణులతో మంగళవారం ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. తెదేపా, జనసేన, భాజపా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీఎత్తున హాజరుకు సన్నాహాలు చేస్తున్నారు. రెండు వేదికల్లోనూ మాజీ సీఎం, భాజపా రాజంపేట పార్లమెంటు అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి పాల్గొననున్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లు కలిసి రాయలసీమలో తొలిసారిగా బహిరంగ సభల్లో పాల్గొనబోతున్నారు.

బహిరంగసభల ఏర్పాట్లపై పార్టీ శ్రేణులతో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి విశ్వనాథనాయుడు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని