logo

కమలాపురంలో యువకుడి దారుణ హత్య

పట్టణంలోని పకీర్‌ వీధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని మహమ్మద్‌ ఘనీ (26)గా గుర్తించారు.

Published : 30 Apr 2024 11:01 IST

కమలాపురం: పట్టణంలోని పకీర్‌ వీధిలో యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. మృతుడిని మహమ్మద్‌ ఘనీ (26)గా గుర్తించారు. సోమవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో 15 మంది దుండగులు ఇంట్లో చొరబడి విచక్షణా రహితంగా కత్తులతో పొడిచారు. అడ్డువచ్చిన తల్లిదండ్రులనూ బెదిరించారు. తీవ్ర గాయాలపాలైన ఘనీని స్థానికులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని