గండికోట నిర్వాసితులకు రూ.12 లక్షల పరిహారం
గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు.
దత్తాపురంలో రోడ్ షోలో మాట్లాడుతున్న ఆదినారాయణరెడ్డి, భూపేష్రెడ్డి
కొండాపురం, న్యూస్టుడే: గండికోట నిర్వాసితులకు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునరావాస పరిహారం రూ.12 లక్షలు ఇస్తామని మాజీ మంత్రి, ఎన్డీఏ కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే భాజపా అభ్యర్థి ఆదినారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం తిమ్మాపురం, లావనూరు, వెంకయ్యకాల్వ, పొట్టిపాడు, బెడుదూరు, యనమలచింతల, కొట్టాలపల్లె, కోనవారిపల్లె, కోడూరు, సిరిగేపల్లె, ఎర్రగుడి గ్రామాల్లో ఆదినారాయణరెడ్డి రోడ్ షో నిర్వహించగా, చామలూరు, సంకేపల్లె, సుగుమంచిపల్లె, దత్తాపురం, తాళ్లప్రొద్దుటూరు తదితర గ్రామాల్లో భూపేష్రెడ్డి పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలు తమ సమస్యల వివరించి వినతులిచ్చారు. వారి బాధలను విన్న వారు పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. గండికోట ప్రాజెక్టు కోసం ఇళ్లు, భూములు త్యాగం చేస్తే నిర్వాసితుల సమస్యలను, బాధను పట్టించుకునేవారే లేక ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. గత తెదేపా ప్రభుత్వం నిర్వాసితులకు అండగా ఉంటూ రూ.1.86 ఉన్న ఆర్అండ్ఆర్ ప్యాకేజీని పెంచి రూ.6.75 లక్షలు అందజేసిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రూ.10 లక్షలు ఇస్తామని మాట ఇచ్చి ఐదేళ్లు గడిచినా ఇప్పటికీ మొదటి విడత 14 గ్రామాల నిర్వాసితులకు రూ.3.25 లక్షల అదనపు పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. గండికోట నిర్వాసితుల బాధను చూస్తుంటే కన్నీరు వస్తుందన్నారు. జలాశయం పరిధిలో ముంపునకు గురైన 22 గ్రామాల సమస్యలను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలనీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. సంకేపల్లె- బొందలదిన్నె వంతెన పూర్తి చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో తెదేపా కడప ఎంపీ అభ్యర్థి భూపేష్రెడ్డిని, ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆదినారాయణరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరరెడ్డి, నారాయణరెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, శంకర్రెడ్డి, గోరిశెట్టిబాబు, రామమునిరెడ్డి, రాఘవేంద్రారెడ్డి మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతని తీరుతో అంతటా శోకం.. పోలీసు అధికారి వ్యవహార శైలిపై విమర్శలు
[ 22-05-2024]
జిల్లాలో ఏ కేసులోనైనా జోక్యం చేసుకుంటారు... సాటి అధికారులను బెదిరిస్తారు... తనకు అనుకూలంగా మార్చుకుంటారు... మాట వినని అధికారులను ఇబ్బందులకు గురి చేస్తారు... నాలుగు రాళ్లు వెనకేసుకోండని తోటి అధికారులు, సిబ్బందికి హితబోధ చేస్తారు... వైకాపా నేతలు చెప్పినట్లు వినాలంటూ శాసిస్తారు... -
ఆరోగ్యశ్రీ ఆగనుంది!
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. మూడు వేలకుపైగా చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాం!.. వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచామంటూ డప్పు కొట్టుకునే సర్కారు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మాత్రం గుర్తించడంలేదు. -
పశుగ్రాసం... అందక దైన్యం!
[ 22-05-2024]
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. పశుగ్రాసం పెంచడానికి, పంటలు వేయడానికి సాగునీటి వసతి లేకపోవడంతో పొలాలు బీడుగా వదిలేశారు. ఎక్కువగా గొర్రెలు, మేకలు, నాటు జాతికి చెందిన బర్రెలు ఆరు బయట ఉండే గడ్డిపైనే ఆధారపడతాయి. -
వేరుసెనగ విత్తు.. తప్పేనా విపత్తు!
[ 22-05-2024]
ఖరీఫ్ సీజన్లో వర్షాధార భూముల్లో, వ్యవసాయ గొట్టపు బావుల కింద వేరుసెనగ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇటీవల కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవి -
పాఠశాల బస్సులకు సామర్థ్య ధ్రువపత్రం తప్పనిసరి
[ 22-05-2024]
విద్యాసంవత్సరం ప్రారంభం లోపే జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వారి వాహనాలకు సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలని ఉప రవాణాశాఖ కమిషనర్ మీరాప్రసాద్ స్పష్టం చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) లేకుండా బస్సులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేసి జప్తు చేస్తామని హెచ్చరించారు. -
మరమ్మతులకు నిధులేవి?
[ 22-05-2024]
పెంచికల బసిరెడ్డి జలాశయం(పీబీఆర్) గేట్ల ముందు ప్రాంతంలోని రక్షణ గోడ మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో కర్షకుల్లో ఆందోళన నెలకొంది. 2021 నవంబరులో పీబీఆర్ను వరదనీరు ముంచెత్తి 20 టీఎంసీల వరద నీటిని పెద్ద గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. -
ప్రశాంత ఓట్ల లెక్కింపునకు సహకరించాలి
[ 22-05-2024]
జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా అందరూ సహకరించాలని డీఎస్పీ షరీఫ్ అన్నారు. కడప కృష్ణాకూడలి వద్ద మంగళవారం స్పెషల్ పార్టీ పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. -
జీలుగలివ్వలేమని చేతులెత్తేశారు!
[ 22-05-2024]
ఖరీఫ్లో పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై ఇస్తామని వ్యవసాయాధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. విత్తనాలు కావాల్సిన వారు వెంటనే పేర్లు నమోదు చేసుకుని తమ వాటా చెల్లిస్తే వెంటనే అందజేస్తామని నమ్మబలికారు. దీంతో రైతు భరోసా కేంద్రాలకు అన్నదాతలు పరుగులు తీశారు. -
ఇసుకాసురుల అరాచకం!
[ 22-05-2024]
ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి శివారు పెన్నానదిలో ఎలాంటి అనుమతుల్లేకుండా వైకాపా నేతలు ఇసుక తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు గత నెలలో తవ్వకాలు నిలిపివేసినా అప్పటికే నదిలో కొన్నిచోట్ల గట్టిమట్టి తేలింది. -
పెద్దేరులో ఇసుకాసురుల పాగా
[ 22-05-2024]
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇసుక రేవులు ఇసుకాసురుల పాలిట బంగారమైంది. జాతీయ రహదారి పక్కన ఇసుక తోడేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. -
జీతాలివ్వండి మహాప్రభో!
[ 22-05-2024]
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న ఉద్యోగులు నెలవారీ కంతులు కట్టేందుకు నానా అవస్థలు పడుతున్నారు. -
కరవు మండలాల్లో ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి
[ 22-05-2024]
జిల్లాలోని కరవు మండలాల్లో ఉపాధిహామీ పనులు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు.