సమస్యల తిష్ఠ... జగన్ పాలనకు పరాకాష్ట
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు.
కాలనీల్లో ప్రజల కన్నీటి వెతలు
మైదుకూరు, జమ్మలమడుగు పురపాలక సంఘాల పరిస్థితి
న్యూస్టుడే, మైదుకూరు, జమ్మలమడుగు
చర్చి వెనుకభాగంలోని మురుగుకాలువలో వ్యర్థాలు
ఏ కాలనీ చూసినా కాలువలు పూడికతో నిండిపోయాయి. ప్రొద్దుటూరు పట్టణం, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు మున్సిపాల్టీల్లోని కాలనీ వీధుల్లోని డ్రైనేజీల్లోని వ్యర్థాలను తీశారే తప్ప వాటిని తీసుకెళ్లలేదు. మరికొన్ని చోట్ల రహదారులు చీలిపోయి ఉన్నాయి. ఈ అయిదేళ్ల పాలనలో జరిగిన అభివృద్ధి ఇదేనా అని వార్డు ప్రజలు నిలదీస్తున్నారు. కొన్ని వీధులు మరీ ఇరుకుగా మారాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. అత్యవసర వేళల్లో అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి ఉందని చెబుతున్నారు. వానా కాలంలో కొన్ని చోట్ల కాలువలు పొంగి ప్రవహిస్తాయని అలాంటి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల్లేని వార్డు మైదుకూరు పురపాలకలో కనిపించలేదు. ఏప్రాంతానికి వెళ్లి ఎవరిని కదిలించినా చాంతాడంత సమస్యలు ప్రస్తావిస్తున్నారు. పురపాలక ఏడో వార్డులో సమస్యలు తాండవిస్తున్నాయి. పాలకవర్గం ఏర్పాటు నుంచి వార్డు కౌన్సిలర్ ఏపీ సుమలత పోరుపెట్టినా పరిష్కారం దొరకలేదు. అభివృద్ధికి నోచుకోలేదు. ఓటుతో సమాధానం అంటూ వార్డు వాసులు హెచ్చరిస్తున్నారు. బద్వేలురోడ్డులోని చిన్నమసీదు నుంచి సాయిబాబా ఆలయానికి వెళ్లేదారిలో మురుగుకాలువ పలుచోట్ల ధ్వంసమైనా పునరుద్ధరణకు నోచుకోలేదు. మహబూబ్నగర్ నుంచి వచ్చే పంటకాలువ స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతూ ఉండగా ఆక్రమణకు గురైంది. ఆక్రమణ తొలగించి కాలువ నిర్మించకపోగా దారిమళ్లించి చర్చి వీధి మీదుగా నిర్మించారు. దీంతో దారి ఇరుకుగా మారింది. సమీపంలోని వీధి మధ్యలో విద్యుత్తు స్తంభం ఉండటంతో రాకపోకలకు సమస్యగా మారింది. చర్చి వెనుకభాగంలో విద్యుత్తు స్తంభాలు వేసినా దీపాలు అమర్చలేదు. రేణుకా ఎల్లమ్మవీధి నుంచి గాంధీనగర్కు వెళ్లే దారి అధ్వానంగా మారింది. ఒకటి, రెండు వీధులు తప్పితే వార్డులో మురుగుకాలువల సమస్య వెంటాడుతోంది. చిలుంగారి వీధికి ఇటీవలే సిమెంట్రోడ్డు వేసినా మురుగుకాలువ నిర్మించలేదు. వాసవీనగర్ నుంచి రేణుకాఎల్లమ్మ వీధికి మురుగుకాలువ లేదు.
పూడికతో కాలువలు... విజృంభిస్తున్న దోమలు
జమ్మలమడుగు ఆర్టీసీ బస్టాండ్ పక్కన ప్రమాదకరంగా పైకప్పు లేని డ్రైనేజీ
జమ్మలమడుగు నగర పంచాయతీ ఏడో వార్డులో మేదరవీధి, దుత్తలూరు నగర్, ఎస్సీ కాలనీ, జాన్స్కూల్ ఏరియా, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతాలు ఉన్నాయి. ఆర్టీసీ బస్టాండ్ పక్కన జాన్ స్కూల్ వెళ్లే దారిలోని కాలువ మరింత ప్రమాదకరంగా మారింది. సిమెంటు రోడ్డుకు ఒక వైపు కాలువ ఉన్నా దానిపైన మూత లేకపోవడంతో తరచూ వాహనదారులు కింద పడుతున్నారు. ఎస్సీ కాలనీలోని పలు కాలువలు పూడికతో నిండి ఉన్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రాత్రైతే దోమలు విజృంభిస్తున్నాయని, ఫాగింగ్ కూడా చేయడం లేదని చెబుతున్నారు.
ఒక్కరూ కనికరించలేదు
వర్షమొస్తే మావీధిలోకి నీళ్లు నిలుస్తున్నాయి. మురుగుకాలువ కట్టాలని వచ్చిన నాయకులను అందరినీ అడుగుతూనే ఉన్నా ఒక్కరు కూడా పట్టించుకోలేదు. మా వీధికి దగ్గరగా ఉన్న మురుగుకాలువలో చెత్త పేరుకు పోతున్నా తొలగించడం లేదు. దోమలు ఎక్కువగా ఉన్నాయి.
మెల్కమ్మ, సాయినాథపురం, మైదుకూరు
రక్షణ చర్యలు చేపట్టాలి
జాన్స్కూల్ వెళ్లే దారిలో డ్రైనేజీ ప్రమాదకరంగా ఉంది. ఇటీవల ఒక ఆటో అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఇదే దారిలో స్కూలు విద్యార్థులు, ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. నగర పంచాయతీ అధికారులు స్పందించి పైకప్పు ఏర్పాటు చేస్తే పట్టణ ప్రజలకు సురక్షితంగా ఉంటుంది.
త్యాగరాజు, ఏడో వార్డు, జమ్మలమడుగు నగర పంచాయతీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చింతలపల్లెలో పోలీసుల కవాతు
[ 21-05-2024]
మండలంలోని చింతలపల్లిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మంగళవారం పోరుమామిళ్ల సీఐ చిరంజీవి, ఎస్సై నాగమురళి, పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. -
అదును చూసి... ఆక్రమించేసి..!
[ 21-05-2024]
గత కొన్ని నెలలుగా అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సమయంలో ఇదే అదునుగా ఆక్రమార్కులు రెచ్చిపోయారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. వీరికి కొందరు రెవెన్యూ శాఖాధికారులు పరోక్షంగా సహకరించారు. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు!
[ 21-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష కార్యకర్తల తలలు పగలకొడుతూ.. వారి ఏజెంట్లను ఎత్తుకుపోతూ వైకాపా నాయకులు భయానక వాతావరణం సృష్టించగా పోలీసులు నిద్రపోయారు. -
అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టేది?
[ 21-05-2024]
మదనపల్లె పట్టణంలో జరుగుతున్న భవన నిర్మాణాల్లో యజమానులు పట్టణ ప్రణాళిక నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై పురపాలక సంఘం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
పేలుళ్లపై ఆందోళన
[ 21-05-2024]
మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని గుట్టలో అక్రమంగా పేలుళ్లకు పాల్పడుతూ స్థలాలను చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఐటీయూసీ నాయకుడు కృష్ణమూర్తి డిమాండు చేశారు. -
బాభౌయ్!
[ 21-05-2024]
రాజంపేట పట్టణంలోని కొలిమి వీధిలో నాలుగు నెలల కిందట ఓ చిన్నారిని ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో 15 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయట పడింది. -
జలం జారిపోతోంది!
[ 21-05-2024]
జిల్లాలో తీవ్ర వర్షాభావం పరిస్థితులతో భూగర్భ జలాలు పాతాళం వైపు పరుగులు తీస్తున్నాయి. వ్యవసాయ, తాగునీటి గొట్టపు బావులు ఒట్టిపోతున్నాయి. మడుగులు, కుంటలు, చెరువులు నోరెళ్ల బెట్టాయి. బావులు తడారిపోయాయి. -
వెల్లాలలో వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం
[ 21-05-2024]
రాజుపాళెం మండలం వెల్లాల శ్రీచెన్నకేశవ, సంజీవరాయునిస్వామి, భీమలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శ్రీచెన్నకేశవ, శ్రీదేవి, భూదేవిల కల్యాణం వైభవంగా జరిగింది. -
మంగంపేట గనుల్లో చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే చర్యలు
[ 21-05-2024]
మంగంపేట ముగ్గురాయి గనుల్లో చట్ట విరుద్ధ పనులకు పాల్పడితే చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ గనుల భద్రత విభాగం డీడీ కోటం నాయుడు హెచ్చరించారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
[ 21-05-2024]
జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ నోడల్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
‘దాడులకు ఉసిగొల్పింది వైకాపా నాయకులే’
[ 21-05-2024]
ఎన్నికల సందర్భంగా కడప గౌస్నగర్లో జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యులు వైకాపా నాయకులేనని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళి ఆరోపించారు. -
చీకట్లో తనిఖీలా!
[ 21-05-2024]
ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి సమీపంలో పెన్నానదిలో అధికారికంగా అనుమతిచ్చిన ఇసుక రేవును అధికారుల కమిటీ బృందం చీకట్లో తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
రైల్ మదద్తో ప్రయాణికుడికి విలువైన వస్తువుల అప్పగింత
[ 21-05-2024]
రైలులో మిస్ అయిన విలువైన వస్తువులను ‘రైల్ మదద్’ సాయంతో సంబంధిత ప్రయాణికుడికి అందించిన ఘటన కడప రైల్వేస్టేషన్లో సోమవారం జరిగింది. -
రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు
[ 21-05-2024]
గొల్లపల్లి గ్రామశివారులో పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నదిలోకి వాహనాలు వెళ్లకుండా గతంలో అధికారులు గుంతలు తవ్వించగా, ఇసుకాసురులు బరితెగించి పూడ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు
-
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి