పెద్దిరెడ్డి కుటుంబం.... మాఫియాలకు నాయకత్వం!
రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు.
ఐక్యత చాటుతున్న నల్లారి కిరణ్కుమార్రెడ్డి, కూటమి నాయకులు
ములకలచెరువు గ్రామీణ, పీట©ఎం గ్రామీణ, న్యూస్టుడే: రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పెద్దిరెడ్డి కుటుంబం వివిధ రకాల మాఫియాలకు నాయకత్వం వహిస్తోందని, దోపిడీయే ధ్యేయంగా అయిదేళ్లలో అడ్డగోలుగా వనరుల విధ్వంసానికి పాల్పడ్డారని మాజీ సీఎం, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. పెద్దతిప్పసముద్రం మండలం ట¨.సదుం పంచాయతీ చెన్న రాయునిపల్లి సమీపంలోని శ్రీచౌడేశ్వరదేవి ఆలయ ప్రాంగణంలో మంగళవారం ఏఎంసీ మాజీ ఛైర్మన్ శ్రీనాథ్రెడ్డి ఆధ్వర్యంలో తెదేపా, జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సదుం మండలంలో బీసీవై పార్టీ అధినేత రామచంద్రయాదవ్పై పెద్దిరెడ్డి అనుచరులు దాడికి పాల్పడడం అప్రజాస్వామికమన్నారు. కూటమి అధికారంలోకి రాగానే రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని, తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెదేపా నాయకులు, కార్యకర్తలపై పెట¨్టన కేసులు రద్దు చేస్తామన్నారు. పాపఘ్ని నదిలో ఇసుక అక్రమ తవ్వకాలతో వైకాపా నేతలు రూ.కోట్లు దోచుకున్నారన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు పెద్ద ప్రాజెక్టులకు పీఎల్ఆర్ రూ.2,145 కోట్లు తీసుకొని రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండా పనులు చేపట్టారన్నారు. నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రూ.100 కోట్లు అపరాధ రుసుం విధించడంతో విషయం బయటకు వచ్చిందని, లేదంటే పెద్దిరెడ్డి కుటుంబం 2 వేల కోట్లు దోచుకునేదన్నారు. రానున్న ఎన్నికల్లో పెద్దిరెడ్డి కుటుంబానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సమావేశంలో తెదేపా తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి జయచంద్రారెడ్డి, భాజపా జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్, నాయకులు సాయినాథ్, చల్లపల్లి నరసింహారెడ్డి, త్యాగరాజు, సురేంద్ర యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్యశ్రీ ఆగనుంది!
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. మూడు వేలకుపైగా చికిత్సలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చాం!.. వ్యయ పరిమితి రూ.25 లక్షలకు పెంచామంటూ డప్పు కొట్టుకునే సర్కారు క్షేత్ర స్థాయిలో పరిస్థితులను మాత్రం గుర్తించడంలేదు. -
అతని తీరుతో అంతటా శోకం!
[ 22-05-2024]
జిల్లాలో ఏ కేసులోనైనా జోక్యం చేసుకుంటారు... సాటి అధికారులను బెదిరిస్తారు... తనకు అనుకూలంగా మార్చుకుంటారు... మాట వినని అధికారులను ఇబ్బందులకు గురి చేస్తారు... నాలుగు రాళ్లు వెనకేసుకోండని తోటి అధికారులు, సిబ్బందికి హితబోధ చేస్తారు... వైకాపా నేతలు చెప్పినట్లు వినాలంటూ శాసిస్తారు... -
పశుగ్రాసం... అందక దైన్యం!
[ 22-05-2024]
జిల్లాలో వర్షాభావ పరిస్థితులతో పశుగ్రాసానికి తీవ్ర కొరత ఏర్పడింది. పశుగ్రాసం పెంచడానికి, పంటలు వేయడానికి సాగునీటి వసతి లేకపోవడంతో పొలాలు బీడుగా వదిలేశారు. ఎక్కువగా గొర్రెలు, మేకలు, నాటు జాతికి చెందిన బర్రెలు ఆరు బయట ఉండే గడ్డిపైనే ఆధారపడతాయి. -
వేరుసెనగ విత్తు.. తప్పేనా విపత్తు!
[ 22-05-2024]
ఖరీఫ్ సీజన్లో వర్షాధార భూముల్లో, వ్యవసాయ గొట్టపు బావుల కింద వేరుసెనగ సాగుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఇటీవల కొన్ని మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఇవి -
పాఠశాల బస్సులకు సామర్థ్య ధ్రువపత్రం తప్పనిసరి
[ 22-05-2024]
విద్యాసంవత్సరం ప్రారంభం లోపే జిల్లాలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు వారి వాహనాలకు సామర్థ్య పరీక్షలు చేయించుకోవాలని ఉప రవాణాశాఖ కమిషనర్ మీరాప్రసాద్ స్పష్టం చేశారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) లేకుండా బస్సులు రోడ్డెక్కితే కేసులు నమోదు చేసి జప్తు చేస్తామని హెచ్చరించారు. -
మరమ్మతులకు నిధులేవి?
[ 22-05-2024]
పెంచికల బసిరెడ్డి జలాశయం(పీబీఆర్) గేట్ల ముందు ప్రాంతంలోని రక్షణ గోడ మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో కర్షకుల్లో ఆందోళన నెలకొంది. 2021 నవంబరులో పీబీఆర్ను వరదనీరు ముంచెత్తి 20 టీఎంసీల వరద నీటిని పెద్ద గేట్ల ద్వారా దిగువకు విడుదల చేశారు. -
ప్రశాంత ఓట్ల లెక్కింపునకు సహకరించాలి
[ 22-05-2024]
జిల్లాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా అందరూ సహకరించాలని డీఎస్పీ షరీఫ్ అన్నారు. కడప కృష్ణాకూడలి వద్ద మంగళవారం స్పెషల్ పార్టీ పోలీసులు మాక్ డ్రిల్ చేపట్టారు. -
జీలుగలివ్వలేమని చేతులెత్తేశారు!
[ 22-05-2024]
ఖరీఫ్లో పచ్చిరొట్ట విత్తనాలను రాయితీపై ఇస్తామని వ్యవసాయాధికారులు ఆర్భాటంగా ప్రకటించారు. విత్తనాలు కావాల్సిన వారు వెంటనే పేర్లు నమోదు చేసుకుని తమ వాటా చెల్లిస్తే వెంటనే అందజేస్తామని నమ్మబలికారు. దీంతో రైతు భరోసా కేంద్రాలకు అన్నదాతలు పరుగులు తీశారు. -
ఇసుకాసురుల అరాచకం!
[ 22-05-2024]
ఒంటిమిట్ట మండలం దర్జిపల్లి శివారు పెన్నానదిలో ఎలాంటి అనుమతుల్లేకుండా వైకాపా నేతలు ఇసుక తవ్వేస్తున్నా అధికారులు పట్టించుకోలేదు. స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఎట్టకేలకు గత నెలలో తవ్వకాలు నిలిపివేసినా అప్పటికే నదిలో కొన్నిచోట్ల గట్టిమట్టి తేలింది. -
పెద్దేరులో ఇసుకాసురుల పాగా
[ 22-05-2024]
తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇసుకాసురుల ఆగడాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఇసుక రేవులు ఇసుకాసురుల పాలిట బంగారమైంది. జాతీయ రహదారి పక్కన ఇసుక తోడేస్తున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు. -
జీతాలివ్వండి మహాప్రభో!
[ 22-05-2024]
మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో వైద్య సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న ఉద్యోగులు నెలవారీ కంతులు కట్టేందుకు నానా అవస్థలు పడుతున్నారు. -
కరవు మండలాల్లో ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి
[ 22-05-2024]
జిల్లాలోని కరవు మండలాల్లో ఉపాధిహామీ పనులు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన జిల్లా అధికారులతో సమీక్షించారు.
తాజా వార్తలు (Latest News)
-
గొంతుపై కాలుతో తొక్కి.. భార్య ప్రాణం తీసిన భర్త
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..