logo

నేటి నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం

పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు.

Published : 01 May 2024 06:09 IST

ఈనాడు, కడప: పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్‌ పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిల రెండో విడత ఎన్నికల ప్రచారాన్ని బుధవారం నుంచి శ్రీకారం చుట్టనున్నారు. తమ కుటుంబ పెద్దదిక్కు వివేకా హత్యలో ఐదేళ్లుగా న్యాయం జరగకపోవడానికి నిరసనగా షర్మిల ప్రజాకోర్టులో తేల్చుకోవడానికి రంగంలోకి దిగారు. వైకాపా నుంచి అవినాష్‌రెడ్డి, కాంగ్రెస్‌ నుంచి షర్మిల, తెదేపా నుంచి భూపేష్‌రెడ్డి తలపడుతున్నారు. ప్రచార రంగంలోకి వైకాపా నుంచి సీఎం జగన్‌ సతీమణి భారతి దిగగా.. రెండో విడత ప్రచారానికి షర్మిల, సునీత దిగనుండడం అత్యంత ఆసక్తి నెలకొంది. బద్వేలు నియోజకవర్గం కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో బుధవారం పర్యటించనున్నారు. ఉదయం 9.30 గంటలకు కాశినాయన మండలం వడ్డమాను గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. పోలింగ్‌ వరకు జిల్లాలోనే షర్మిల మకాం వేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని