కూటమి వాగ్దానాలు... భవిష్యత్తుకు సోపానాలు!
‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి.
గ్రామీణ, పట్టణ వాసులకు రక్షిత జలాలు
జలస్ఫూర్తితో సాగునీటి పనులకు శ్రీకారం
పారిశ్రామిక వెలుగులకు ప్రత్యేక ప్రణాళికలు
తెదేపా- జనసేన-భాజపా కూటమి మేనిఫెస్టో
న్యూస్టుడే, కడప
‘ప్రజల ఆశయాలు నెరవేర్చాలి. నమ్ముకున్న జనం కలను సాకారం చేయాలి. పల్లె, పట్టణ వాసుల ఆకాంక్షలు ఫలించేలా వినూత్న పథకాలు ప్రవేశపెట్టాలి. ఉత్తమ పాలనతో ప్రజల హృదయాల్లో స్థానం పదిలం చేసుకోవాలి. గడపగడపకు సంక్షేమ ఫలాలు అందించాలి. ఆకాశమే హద్దుగా అభివృద్ధిని పరుగులు పెట్టించాలి. పల్లె, పట్టణ వాసులకు రక్షిత జలాలు సరఫరా చేయాలి. సాగునీటి బెంగ తీర్చాలి. విద్యా రంగానికి వెన్నుదన్నుగా నిలవాలి. ప్రజారోగ్యానికి భరోసా కల్పించాలి. పారిశ్రామిక ప్రగతి ప్రకాశించాలి. వ్యవసాయాన్ని లాభసాటి చేయాలి.’ ఇదే స్ఫూర్తితో తెదేపా-జనసేన-భాజపా కూటమి పెద్దలు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. జనాకర్షక హామీలను చూసి పేద, బడుగు వర్గాల మోము మురిసిపోతోంది. మళ్లీ కూటమి మునుపటిలా ఆదర్శ పాలన రావాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ధీమానిచ్చేలా కూటమి హామీల వర్షం కురిపించింది.
జిల్లాలో ఏడు శాసనసభ, ఒక లోకసభ స్థానానికి వచ్చే నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. సంగ్రామంలో గెలుపే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి వ్యూహాత్మంగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ఆకర్షించేలా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. జిల్లాలోని పల్లె సీమల్లో 12,51,364 మంది, పట్టణాల్లో 8,09,290 మంది నివాసం ఉంటున్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో అన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరిగింది. అభివృద్ధి రంగాన్ని పూర్తిగా విస్మరించారు. సాగునీటి వనరులపై అంతులేని నిర్లక్ష్యం చేశారు. నిర్దేశిత ఆయకట్టులో కనీసం నాలుగో వంతు భూములకు కూడా నేరుగా నీరివ్వలేదు. జిల్లాలో చిన్న, మధ్య తరహా, పెద్ద జలాశయాలు 11 ఉన్నాయి. వీటి నిల్వ సామర్థ్యం 77.292 టీఎంసీలు. తరి, మెట్ట ప్రాంతంలో ఉన్న 4,20,184 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. సీఎం జగన్ తన పాలనలో అలసత్వం వహించడంతో కర్షకులకు కన్నీళ్లు తప్పడం లేదు. కూటమి అధికారంలోకి వస్తే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో మొదటి, రెండో దశ, తెలుగుగంగ, కేసీ కాలువ, పీబీఆర్, పైడిపాళెం, సర్వరాయసాగర్, వామికొండ, మైలవరం, దిగువసగిలేరు, బుగ్గవంక జలాశయాలకు మహర్దశ కలగనుంది. కూటమి అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందని గండికోట ముంపు బాధితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలకు రక్షిత నీరు
జిల్లాలో గ్రామ పంచాయతీలు 557 ఉన్నాయి. కడప నగర పాలక, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు, ఎర్రగుంట్ల, కమలాపురం పురపాలకలు ఉన్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా దాహం కేకలతో ప్రజల గొంతెండిపోతోంది. బిందెడు నీటి కోసం రాత్రి వేళ జాగారం చేయాల్సిన పరిస్థితులున్నాయి. వేసవిలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు కాగితాలకే పరిమితమయ్యాయి. జగన్ పాలనలో ప్రజలను దాహార్తి కష్టాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే జలస్ఫూర్తితో రక్షిత నీటిని సరఫరా చేయనున్నారు. నీటి బెంగ దరి రాకుండా చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.
ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట
జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 51, ఉప కేంద్రాలు 648, సమగ్ర అత్యవసర గర్భిణి, శిశు కేంద్రాలు అయిదు, వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రులు ఏడు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు 30, జిల్లా, ప్రాంతీయ, సామాజిక వైద్యశాలలున్నాయి. అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం మందుల కొనుగోలు చేయడానికి సరిపడా నిధులు ఇవ్వడం లేదు. సూది, దూది, ఔషధాల సరఫరా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు కాన్పు కోసం కనీసం 50 శాతం మంది కూడా రావడం లేదు. పేదల ఆరోగ్యానికి భరోసా లేకపోయింది. కూటమి అధికారంలోకి వస్తే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తారని వారంతా నమ్మకంతో ఉన్నారు.
ఉద్యానానికి వెన్నుదన్ను
జిల్లాలో ఉద్యాన తోటలు 57,653 హెక్టార్లలో సాగులో ఉన్నాయి. పండ్లు, కూరగాయలు, పూల తోటలు, సుగంధ ద్రవ్యాల పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం విపణిలో నిలకడగా లేని ధరలతో రైతులు నష్టపోతున్నారు. గిట్టుబాటు దక్కడం లేదు. వరదలు వచ్చినప్పుడు, ఈదురుగాలులు వీచిన సమయంలో ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. సకాలంలో పెట్టుబడి రాయితీ చెల్లించడం లేదు. నిధులు విడుదల చేసినట్లు సీఎం జగన్ చెబుతున్నా బాధితుల ఖాతాల్లో జమ కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని రైతులు కోరుకుంటున్నారు.
పారిశ్రామిక ప్రగతి పరుగులు
జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉంది. వనరులకు తగ్గ పరిశ్రమలు అందుబాటులో లేవు. నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కరవైంది. ఇతర రాష్ట్రాలు, విదేశాలకు ఎంతో మంది వలస వెళ్తున్నారు. స్థానికంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని సీఎం జగన్ హామీనిచ్చినా ఆచరణకు నోచుకోలేదు. ఉక్కు పరిశ్రమ తుక్కుగా మారింది. కొప్పర్తి పారిశ్రమిక వాడలో ఆశించిన స్థాయిలో కర్మాగారాలు ఏర్పాటు కాలేదు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే పారిశ్రామిక ప్రగతి పరుగులు తీయనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చింతలపల్లెలో పోలీసుల కవాతు
[ 21-05-2024]
మండలంలోని చింతలపల్లిలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు మంగళవారం పోరుమామిళ్ల సీఐ చిరంజీవి, ఎస్సై నాగమురళి, పోలీస్ బలగాలు కవాతు నిర్వహించారు. -
అదును చూసి... ఆక్రమించేసి..!
[ 21-05-2024]
గత కొన్ని నెలలుగా అధికార యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో నిమగ్నమైన సమయంలో ఇదే అదునుగా ఆక్రమార్కులు రెచ్చిపోయారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించేశారు. వీరికి కొందరు రెవెన్యూ శాఖాధికారులు పరోక్షంగా సహకరించారు. -
పోలీసు.. వైకాపాకు వత్తాసు!
[ 21-05-2024]
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రతిపక్ష కార్యకర్తల తలలు పగలకొడుతూ.. వారి ఏజెంట్లను ఎత్తుకుపోతూ వైకాపా నాయకులు భయానక వాతావరణం సృష్టించగా పోలీసులు నిద్రపోయారు. -
అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్టేది?
[ 21-05-2024]
మదనపల్లె పట్టణంలో జరుగుతున్న భవన నిర్మాణాల్లో యజమానులు పట్టణ ప్రణాళిక నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై పురపాలక సంఘం అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. -
పేలుళ్లపై ఆందోళన
[ 21-05-2024]
మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ అమ్మచెరువుమిట్టలోని గుట్టలో అక్రమంగా పేలుళ్లకు పాల్పడుతూ స్థలాలను చదును చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, ఐటీయూసీ నాయకుడు కృష్ణమూర్తి డిమాండు చేశారు. -
బాభౌయ్!
[ 21-05-2024]
రాజంపేట పట్టణంలోని కొలిమి వీధిలో నాలుగు నెలల కిందట ఓ చిన్నారిని ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేయడంతో 15 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స అందించడంతో ప్రాణాలతో బయట పడింది. -
జలం జారిపోతోంది!
[ 21-05-2024]
జిల్లాలో తీవ్ర వర్షాభావం పరిస్థితులతో భూగర్భ జలాలు పాతాళం వైపు పరుగులు తీస్తున్నాయి. వ్యవసాయ, తాగునీటి గొట్టపు బావులు ఒట్టిపోతున్నాయి. మడుగులు, కుంటలు, చెరువులు నోరెళ్ల బెట్టాయి. బావులు తడారిపోయాయి. -
వెల్లాలలో వైభవంగా చెన్నకేశవస్వామి కల్యాణం
[ 21-05-2024]
రాజుపాళెం మండలం వెల్లాల శ్రీచెన్నకేశవ, సంజీవరాయునిస్వామి, భీమలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శ్రీచెన్నకేశవ, శ్రీదేవి, భూదేవిల కల్యాణం వైభవంగా జరిగింది. -
మంగంపేట గనుల్లో చట్టవిరుద్ధ పనులకు పాల్పడితే చర్యలు
[ 21-05-2024]
మంగంపేట ముగ్గురాయి గనుల్లో చట్ట విరుద్ధ పనులకు పాల్పడితే చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వ గనుల భద్రత విభాగం డీడీ కోటం నాయుడు హెచ్చరించారు. -
సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా
[ 21-05-2024]
జిల్లాలోని సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా పోలీసు అధికారి సిద్ధార్థ్ కౌశల్ పేర్కొన్నారు. కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నియోజకవర్గ నోడల్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. -
‘దాడులకు ఉసిగొల్పింది వైకాపా నాయకులే’
[ 21-05-2024]
ఎన్నికల సందర్భంగా కడప గౌస్నగర్లో జరిగిన సంఘటనకు పూర్తి బాధ్యులు వైకాపా నాయకులేనని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళి ఆరోపించారు. -
చీకట్లో తనిఖీలా!
[ 21-05-2024]
ఒంటిమిట్ట మండలం గొల్లపల్లి సమీపంలో పెన్నానదిలో అధికారికంగా అనుమతిచ్చిన ఇసుక రేవును అధికారుల కమిటీ బృందం చీకట్లో తనిఖీ చేయడం చర్చనీయాంశంగా మారింది. -
రైల్ మదద్తో ప్రయాణికుడికి విలువైన వస్తువుల అప్పగింత
[ 21-05-2024]
రైలులో మిస్ అయిన విలువైన వస్తువులను ‘రైల్ మదద్’ సాయంతో సంబంధిత ప్రయాణికుడికి అందించిన ఘటన కడప రైల్వేస్టేషన్లో సోమవారం జరిగింది. -
రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు
[ 21-05-2024]
గొల్లపల్లి గ్రామశివారులో పెన్నా నదిలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. నదిలోకి వాహనాలు వెళ్లకుండా గతంలో అధికారులు గుంతలు తవ్వించగా, ఇసుకాసురులు బరితెగించి పూడ్చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
-
రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. ఏపీ, తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు