జగన్ హామీలు... నీటిపై రాతలు
జిల్లాలో వైకాపాకు పులివెందుల తర్వాత బద్వేలు నియోజక వర్గంలోనే అత్యధికంగా ఆదరిస్తారు. అందులో అట్లూరు మండలం మరింత ఎక్కువని ఎమ్మెల్యే సుధ పలు కార్యక్రమాల్లో ప్రస్తావించారు.
వంతెన పనులు ఇంకెప్పుడు మొదలు పెడతారు? ఏళ్లు గడుస్తున్నా తీరని సమస్య
న్యూస్టుడే, అట్లూరు
వేమలూరు వంతెనపై నడుంలోతు వెనుక జలాల్లో అవస్థలు పడుతూ దాటుతున్న స్థానికులు (పాత చిత్రం)
అట్లూరు మండలంలోని సగిలేరు నదిపై వేమలూరు సమీపంలో వంతెన నిర్మాణానికి రూ.22 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశాం. తద్వారా 30 గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం.
బద్వేలు ఉప ఎన్నికల సందర్భంగా 2021లో బద్వేలు ప్రచార సభలో సీఎం జగన్ ఇచ్చిన హామీ
జిల్లాలో వైకాపాకు పులివెందుల తర్వాత బద్వేలు నియోజక వర్గంలోనే అత్యధికంగా ఆదరిస్తారు. అందులో అట్లూరు మండలం మరింత ఎక్కువని ఎమ్మెల్యే సుధ పలు కార్యక్రమాల్లో ప్రస్తావించారు. స్థానికులు అంతలా ఆదరించినా అట్లూరు మండలానికి ఇచ్చిన హామీని సీఎం నిలుపుకోలేదన్న విమర్శలు ఎక్కువగా ఉన్నాయి. బద్వేలు ఉప ఎన్నికల 2021 జరిగిన ప్రచార సభలో రు.22 కోట్లతో అట్లూరు మండలంలోని వేమలూరు వంతెన పనులుకు శంకుస్థాపన చేశారే కానీ.. కార్యాచరణకు నోచుకోలేదు. వంతెన నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేసి 36 నెలలు గడుస్తున్నా 30 గ్రామాల కష్టాలను ప్రభుత్వం వదిలేసింది. సోమశిల జలాశయంలో వెనుక జలాలు, సగిలేరులో ప్రవాహ నీరు వేమలూరు వంతెనపై సుమారు 6 అడుగుల వరకు నిల్వ ఉండి స్థానికుల కష్టాలకు నిలువెత్తుగా మారుతోంది. 2019 నుంచి వరుసగా మూడు సార్లు సోమశిల జలాశయం 78 టీఎంసీల నీటితో నిండి నెలల తరబడి స్థిరంగా నిల్వ పెట్టారు. దీంతో వంతెనపై నిలిచిన నీరు పాచిపట్టి కాలినడకన వెళ్లలేని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో నెలల తరబడి వెనుక జలాలు నిల్వ చేసి ఉంచడంతో నీటిలో వంతెన నడిచి దాటాలంటే వెళ్లే వారికి శరీరంపై దురదలు వచ్చాయి. నిత్యం అనేక మంది రాకపోకలతో రద్దీగా ఉండే వేములూరు వంతెన వెనుక జలాలతో మునిగిపోతే స్థానికులు కష్టాలు తప్పుడం లేదు. ఆరు పంచాయతీలు 30 గ్రామాలకు చెందిన పాల వ్యాపారులు, ఉపాధ్యాయులు, సచివాలయం సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఎఎన్ఎంలు, గ్రామసేవలకులు, వ్యాపారులు, రైతులు, డ్వాక్రా మహిళలు వెలుగు కార్యాలయం వెళ్లాలన్నా, మండల కార్యాలయాలకు స్థానికులు వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పడం లేదు. బ్యాంకులకు అట్లూరుకు రావాలన్నా, కడపకు వెళ్లాలన్నా, పోలీస్స్టేషన్ పనులకు, ఇటువంటి పనులన్నీ స్తంభించనున్నాయి. నల్లాయపల్లె, చెలంగారిపల్లె, చౌటపల్లె, ఈశ్వరబొట్లపల్లె, జీకొత్తపల్లె, ఎస్టీ కాలనీల వారు సచివాలయ పనులకు వంతెన దాటి వెళ్లాలంటే భారమవుతుంది. ట్రాన్స్కో సిబ్బందికి, ఏఎన్ఎంలకు ఇబ్బందులు తప్పడం లేదు. వంతెనపై నీరు నిలవడంతో 12 కిలోమీటర్లకు 45 కిలోమీటర్లు తిరిగి వెళ్లాలి. ఇలా వెళ్లాలన్నా రవాణా సౌకర్యం లేక అవస్థలు పడాల్సి వస్తుంది. నెలల తరబడి వేమలూరు వంతెనపై రాకపోకలు లేకపోతే ఆ బాధలు తలుచుకుంటేనే భయమేస్తుందని స్థానికులు వాపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన