రాజోలి అన్నావ్.. జోలాలి పాడావ్!
మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు.
ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిగా గాలికొదిలేసిన సీఎం జగన్
ఒప్పందపత్రాలు తీసుకుని బాధిత రైతులకు ఇవ్వని పరిహారం
వేలాది ఎకరాల ఆయకట్టుపై ప్రభావం, తాగునీటికీ అవస్థలు
న్యూస్టుడే, జమ్మలమడుగు, మైదుకూరు, పెద్దముడియం
‘రాజోలి ప్రాజెక్టు పూర్తికాలేదని ఏ ఒక్కరూ భయపడాల్సిన పనిలేదు. ఎల్లకాలం చంద్రబాబు పాలన సాగదు. మనందరి పరిపాలనలోనే ఆ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. మనమే పూర్తి చేస్తాం’
2017, నవంబరులో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా దువ్వూరు సభలో ప్రతిపక్షనేత హోదాలో జగన్ అన్న మాటలు.
కేసీ కాలువ కింద భూములకు ఇప్పటికీ అరకొరగా నీళ్లు వస్తున్న పరిస్థితులు మనకళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఈ ప్రాంతానికి శాశ్వతంగా మేలు జరిగేవిధంగా అధికారం చేపట్టిన ఆరు నెలలు తిరగక మునుపే రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేస్తున్నా.
2019, డిసెంబరు 23న రాజోలి జలాశయానికి శంకుస్థాపన సందర్భంగా సీఎం జగన్ చెప్పిన మాటలు
మన ప్రభుత్వం వచ్చాక రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేశాం. కొవిడ్ రావడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంతగా లేకపోవడం కారణాలు ఏదైనా... కారణాలు మీకు చెప్పకూడదు గానీ రాజోలి ప్రాజెక్టును అనుకున్నంత వేగంగా చేయలేక పోయానని ఖచ్చితంగా చెబుతున్నా... రానున్న ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాక ఖచ్చితంగా రాజోలి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
ఈ ఏడాది ఏప్రిల్ 30న ఎన్నికల ప్రచారం సందర్భంగా మైదుకూరు సభలో సీఎం జగన్ అన్న మాటలివి
వైకాపా ప్రభుత్వ హయంలోనే రాజోలి జలాశయం నిర్మించి రైతులకు కానుకగా అందిస్తాం
2022, జనవరి 17న దువ్వూరులో తహసీల్దారు కార్యాలయ ప్రారంభోత్సంలో ఎంపీ అవినాష్రెడ్డి ప్రకటన.
‘రాజశేఖర్రెడ్డి ఉండి ఉంటే ఏనాడో రాజోలి జలాశయం పూర్తయ్యేది. నాన్న పూర్తిచేయాలనుకున. ప్రాజెక్టును నేను పూర్తిచేస్తానని చెప్పి ఐదేళ్లవుతున్నా సీఎం జగన్ తట్టెడు మట్టి ఎత్తిపోయలేదు. ఎలా ప్రాజెక్టు పూర్తవుతుంది. ఏనాడైనా ఎమ్మెల్యే ప్రశ్నించారా? ధర్నా అయినా చేశారా మరి ఎందుకు ఓటేయాలి. ఎంపీ అవినాష్రెడ్డి రాజోలి కోసం పోరాటం చేశాడా మరెందుకు వేయాలన్నా వీరికి ఓట్లు.
ఈ నెల 3న మైదుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో పీసీసీ అధ్యక్షురాలు, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థి షర్మిల
మాట తప్పను..మడమ తిప్పను అని సీఎం జగన్ తరచూ అంటుంటారు. రాజోలి ఆనకట్ట విషయంలో ఆయన మాట తప్పారు, మడమ తిప్పారు... రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు. సీఎం జగన్ మన జిల్లా వాసే కదా ఆయన ఏదైనా శంకుస్థాపన చేస్తే అమలవుతుందని మొదట్లో ప్రజలు నమ్మారు. ఆనకట్ట ఏర్పాటైతే మన ప్రాంతం బాగుపడుతుందని, ఖరీదైన భూములను సైతం బాధిత రైతులు ఎకరా రూ.12.50 లక్షలకే ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. రెండు నెలల్లో పరిహారం చెల్లిస్తామన్న అధికారులు నిధుల్లేక ముఖం చాటేయడంతో రెండేళ్లు దాటినా ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇది చాలదన్నట్లు ప్రాజెక్టు సామర్థ్యం 2.95 టీఎంసీల నుంచి 1.2 టీఎంసీలకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందన్న విషయంపై ఆరా తీసేందుకు కలెక్టరేట్ వద్దకు వెళితే అక్కడ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి అనుచరులే దాడికి పాల్పడిన ఘటన విస్మయానికి గురిచేసింది.
రాజోలి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం జగన్, పక్కన మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి (పాతచిత్రం)
92 వేల ఎకరాల ఆయకట్టు
కర్నూలు-కడప కాలువ కింద జిల్లాలో 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సబ్డివిజన్లోని పెద్దముడియం మండలంలో 10,066.62 ఎకరాలు, మైదుకూరు సబ్ డివిజన్లోని పది మండలాల్లో 82 వేల ఎకరాలు ఆయకట్టు ఉంది. కుందూ నది వరదలతో ఏటా 50 నుంచి 60 టీఎంసీల విలువైన జలాలు వృథా అవుతున్నాయి. ఆ నీటిని ఒడిసి పట్టుకుంటే అదనంగా వేలాది ఎకరాలకు సాగునీరందే అవకాశముంటుంది. పెద్దముడియం మండలంలో రాజోలి జలాశయం ఏర్పాటు చేసి రెండు పంటలకు నీరిచ్చేందుకు పాలకులు నిర్ణయించారు. నెమళ్లదిన్నె, బలపనగూడూరు, ఉప్పులూరు, గరిశలూరు, చిన్నముడియం ఐదు గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. ఆయా గ్రామాల్లో 794 ఇళ్లు ఉండగా, 2,785 జనాభా ఉన్నట్లు తేల్చారు. పరిహారం విషయంలో రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు సమాధానం దాటవేయడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
అన్నదాతల ఆందోళన బాట
రాజోలి జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న పెద్దముడియం మండలానికి చెందిన బాధిత రైతులు 2022, డిసెంబరు 5న కలెక్టర్ ఛాంబరు ఎదుట ఆందోళనకు దిగారు. రిజర్వాయర్ కోసం సుమారు 9 వేల ఎకరాలు సేకరించారని, 4 వేల ఎకరాలకు సర్వే కూడా చేసి భూములు తీసుకున్నట్లు కలెక్టర్, జేసీ దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల్లో పరిహారం ఇస్తామని చెప్పి ఇంత వరకు ఇవ్వలేదని వారంతా నిరసనకు దిగారు.
- పరిహారం కోసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ, ఆర్డీవో, కలెక్టరును పలుమార్లు కలిసినా ఫలితం లేకుండా పోయిందని ముంపు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయ సామర్ధ్యాన్ని 2.95 టీఎంసీల నుంచి 1.2 టీఎంసీలకు తగ్గించాలనే ప్రయత్నం జరుగుతోందన్న విషయంపై రైతులు 2023లో కడప కలెక్టరు కార్యాలయం వెళితే ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఎదుటే ఆయన అనుచరులు బాధిత రైతులపై దాడికి దిగడం వివాదాస్పదమైంది.
ముంపు జాబితాలో పెద్దముడియం మండలం చిన్నముడియం గ్రామం
తండ్రీకుమారుల శంకుస్థాపన
2004లో అధికారం చేపట్టిన అనంతరం 2009 ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కుందూ నదిపై రాజోలి జలాశయం నిర్మాణానికి ముందుకొచ్చారు. రూ.291.02 కోట్ల అôచనాతో పనులు పూర్తికి 2008 డిసెంబరు 23న పరిపాలన అనుమతులు జారీ చేశారు. మరుసటి రోజే పనులకు శంకుస్థాపన చేశారు. ఆయన మరణాంతరం 2019, డిసెంబరు 23న సీఎం జగన్ మరోసారి శంకుస్థాపన చేశారు. ఐదేళ్లు కావస్తున్నా పనులు చేపట్టలేకపోయారు.
ఎకరాకు రూ.12.50 లక్షల పరిహారం
రాజోలి జలాశయం సాకారం కోసం పెద్దముడియం మండలంలోని ఐదు ముంపు గ్రామాల్లో వేలాది ఎకరాల భూమిని సేకరించారు. కొంతమేర సర్వే పనులు సైతం పూర్తయ్యాయి. 2022, ఏప్రిల్లో ఒక బృందం ముంపు గ్రామాల బాధిత రైతులతో ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. ఆ సమయంలో ఎకరాకు రూ.12.50 లక్షల చొప్పున పరిహారం రెండు నెలల్లో ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తామని అధికారులు హామీ ఇచ్చారని రైతులు చెబుతున్నారు. ఆ హామీ ఇంత వరకు నెరవేరలేదు, ఒక్క పైసా కూడా ప్రభుత్వం విదిల్చలేదు.
ఆశలు వదులుకున్నాం : రాజోలి జలాశయం చేపట్టడానికి రైతుల నుంచి అధికారులు వేగవంతంగా పత్రాలు తీసుకుంటుంటే పనులు వేగవంతంగా అవుతాయని అనుకున్నాం. ముంపు కింద 1.50 ఎకరాల విస్తీˆ్తర్ణం పోయింది. సీˆఎం మన జిల్లా వాసే కదా పరిహారం త్వరగా వస్తుందని నమ్మాం. ఏళ్లు గడుస్తున్నాయి. జలాశయం నిర్మాణంపై ఆశలు వదులుకోవాల్సిందే.
వెంకటసుబ్బారెడ్డి, నెమళ్లదిన్నె, పెద్దముడియం మండలం
శంకుస్థాపనతోనే సరిపెట్టారు : ఇద్దరు ముఖ్యమంత్రులు రాజోలి జలాశయానికి శంకుస్ధాపనతోనే సరిపెట్టారు. ఏదో ఒక సాకుతో రైతులను మభ్యపెడుతూ కాలం గడుపుతూ వచ్చారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తేనే జలాశయం ఏర్పాటుతోనే రైతులకు నష్టపరిహారం వస్తుంది. ఎంతోమంది ఈ పొలాలను నమ్ముకుని పరిహారం డబ్బులొస్తాయని ఆశలు పెట్టుకుని మోసపోయారు.
పురుషోత్తం రెడ్డి, చిన్నముడియం
సుమారు రూ.10 లక్షల వరకు అప్పు : నాకున్న ఏడెకరాలు మునక కింద పోతాయి. నాకు ఇద్దరు అమ్మాయిలు, పెద్ద కుమార్తె వివాహం కోసం సుమారు రూ.10 లక్షల వరకు అప్పు చేశాను.ఆనకట్ట కింద భూములు ముంపునకు గురైతే ఒక్కో ఎకరాకు రూ.12.50 లక్షలు ఇస్తామని చెప్పి కూడా ఏళ్లు గడిచాయి. ఇంతవరకు పరిహారమివ్వలేదు. అసలు ఎప్పుడిచ్చేది స్పష్టత లేదు.
శివశంకర్రెడ్డి, బలపనగూడూరు
ఎన్డీఏ అధికారంలోకొస్తే మెరుగైన పరిహారం : ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే మెరుగైన పరిహారం అందజేస్తామని చెబుతున్నారు. భాజపా జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కూడా ఎకరాకు రూ.24 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. గతంలో అధికారులు మూడు నెలల్లో పరిహారం ఇస్తామని చెప్పి ఒప్పంద పత్రాలు తీసుకున్నారు. ఇంత వరకు పరిహారం ఇవ్వలేదు. ఒప్పంద పత్రాలు ఇచ్చినందుకు మా పొలాలను క్రయ విక్రయాలు చేసుకోలేకపోతున్నాం.
పోరెడ్డి జగన్మోహన్రెడ్డి, ఉప్పలూరు, పెద్దముడియం మండలం
రాజోలి ప్రాజెక్టు వివరాలు
నీటి నిల్వ సామర్థ్యం 2.95 టీఎంసీలు
మొత్తం ఖర్చు రూ.1,357.10 కోట్లు
ప్రధాన నీటి వనరు కుందూ నది
ముంపునకు గురయ్యే గ్రామాలు నెమళ్లదిన్నె, గరిశలూరు, చిన్నముడియం, బలపనగూడూరు, ఉప్పలూరు
జలాశయ నిర్మాణానికి అవసరమైన భూమి 9,286.37 ఎకరాలు
ప్రయోజనాలు
- 91 వేల ఎకరాలకు సాగునీరు
- ప్రొద్దుటూరు పట్టణానికి తాగునీరు
- ఉక్కు పరిశ్రమకు నీటి కేటాయింపులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
[ 19-05-2024]
వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు