నేడు కలికిరిలో ప్రధాని మోదీ సభ
సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
భారీ ఏర్పాట్లలో కూటమి నేతలు
హాజరు కానున్న నారా లోకేశ్, నాయకులు
ఈనాడు, కడప, న్యూస్టుడే, కలికిరి గ్రామీణ : సార్వత్రిక ఎన్నికల ప్రచార నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ జిల్లాకు తొలిసారిగా బుధవారం రానున్నారు. పీలేరు నియోజకవర్గం కలికిరిలో నిర్వహించనున్న ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు పుంగనూరు నియోజకవర్గాలతో పాటు జిల్లా సమీపంలోని తిరుపతి, చిత్తూరు జిల్లాల నుంచి జనసమీకరణకు ముమ్మర సన్నాహాలు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్లో కలికిరికి ప్రధాని చేరుకుంటారు. మోదీ ప్రయాణించే హెలికాప్టర్తో పాటు మరో రెండు రక్షణగా రానున్నాయి. ఈ మూడింటి కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. బహిరంగసభకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి గెలుపునకు భాజపా, తెదేపా, జనసేన పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధాని మోదీ సభ ద్వారా ప్రజల్లో మరింత ఆదరణ తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సభావేదిక నిర్మాణం, హాజరయ్యే జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రతా చర్యల్లో భాగంగా 3 వేల మంది పోలీసులు కలికిరికి తరలివచ్చారు. ఎస్పీజీ అధికారులు సభ, హెలిప్యాడ్ ప్రాంగణాలను మంగళవారం పరిశీలించారు. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, బాంబు స్క్వాడ్, జాగిలాలతో పలు ప్రాంతాలను తనిఖీ చేశారు. భారీ రక్షణ మధ్య సభ జరగనుంది. ఏర్పాట్లను నల్లారి కిరణ్కుమార్రెడ్డి, తెదేపా పీలేరు అసెంబ్లీ అభ్యర్థి నల్లారి కిశోర్కుమార్రెడ్డి, తెదేపా జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్రాజు, కీలక నేతలు పర్యవేక్షిస్తున్నారు.
విజయవాడలో బుధవారం జరిగే పర్యటనలో ప్రధాని మోదీతో పాటు తెదేపా, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్కల్యాణ్ పాల్గొననున్నారు. దీంతో కలికిరి సభలో ఇద్దరు అధినేతలు పాల్గొనలేక పోతున్నారు. తెదేపా నుంచి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, జనసేన అగ్రనేత నాగబాబు హాజరవుతున్నారు. విజయవాడలో సాయంత్రం 6 గంటల నుంచి భారీ రోడ్షో జరగనుంది. మోదీతో పాటు చంద్రబాబు, పవన్ పాల్గొననున్నారు. ఈ మేరకు తెదేపా, జనసేనపార్టీ నేతలకు అధికారిక సమాచారం అందింది.
అడుగడుగునా పోలీసులు
ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో కలెక్టర్ అభిషిక్త్ కిశోర్, ఎస్పీజీ అడిషినల్ ఐజీ కృష్ణప్రసాద్యాదవ్, డీఐజీ విజయరావు, ఎస్పీ కృష్ణారావు, జేసీ ఫర్మాన్ అహ్మద్ అధికారులతో సమావేశమై భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. అన్నిశాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పర్యటనను విజయంతం చేయాలని ఆదేశించారు. ఐజీ, అడిషినల్ ఐజీ, డీఐజీల పర్యవేక్షణలో 15 మంది ఎస్పీలు, 20 మంది అడిషినల్ ఎస్పీలు, 50 మంది డీఎస్పీలు, 100 మంది సీఐలు, 3 వేల మంది సిబ్బందితో కట్టుదిట్టమైన బందోస్తు ఏర్పాటు చేశారు. మంగళవారం కలికిరికి చేరుకున్న పోలీసులకు అధికారులు విధులను కేటాయించారు.
ట్రాఫిక్ మళ్లింపు : కలికిరి నుంచి నగరిపల్లె-సీఆర్పీఎఫ్కు వెళ్లే మార్గం వద్ద ప్రధాని బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ను మళ్లించారు. రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను కలికిరి-కలకడ మార్గంలోని పాళెంకురవపల్లె బస్టాపు నుంచి లోపలికి అనుమతించనున్నారు. పుంగనూరు, పీలేరుల నుంచి వచ్చే వాహన శ్రేణులను నగరిపల్లె సర్కిల్ మీదుగా మళ్లించనున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలను క్రాస్ నుంచి బైపాస్ సర్కిల్ మీదుగా అనుమతించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాయ్ రాజా కాయ్!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఓటర్ల తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. వచ్చే నెల 4న అభ్యర్థుల భవితవ్యం వెల్లడి కానుంది. విజయం ఎవరిని వరిస్తుందనే చర్చ సర్వత్రా నడుస్తోంది. మరో వైపు గెలుపు ఓటములపై బెట్టింగ్ జోరుగా జరుగుతోంది. -
బ్రహ్మరథంపై వీరబ్రహ్మేంద్రస్వామి దివ్యదర్శనం
[ 19-05-2024]
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధన గురుపూజా మహోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన మహాబ్రహ్మ రథోత్సవం శనివారం సాయంత్రం బ్రహ్మంగారిమఠంలోని మాడ వీధుల్లో నేత్రపర్వంగా సాగింది. -
వంగిపోయారా? లొంగిపోయారా?
[ 19-05-2024]
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
భూసార పరీక్షలపై శీతకన్ను!
[ 19-05-2024]
వేసవిలో భూసార పరీక్షలను యజ్ఞంలా చేయాలనే మాటను అపద్ధర్మ ప్రభుత్వం విస్మరించింది. పూర్తిగా శీతకన్ను వేసింది. గతేడాది మట్టి నమూనాలను సేకరించారు. యంత్ర సామగ్రి, రసాయనాల కొనుగోలు చేయడానికి నిధులివ్వకపోవడంతో విశ్లేషణ చేయకుండా పక్కన పెట్టేశారు. -
నిలిచిన ఇసుక తవ్వకాలు
[ 19-05-2024]
అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. ప్రొద్దుటూరు పరిసరాల్లో మాత్రం వైకాపా కీలక నేతలు తవ్వకాలు కొనసాగిస్తుండగా అధికారులు పట్టించుకోవడంలేదు. -
గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే బాధితులకు అందని పరిహారం
[ 19-05-2024]
తమకు పరిహారం అందకపోవడంతో బెంగళూరు-విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పనులను అడ్డుకుంటామని బాధిత రైతులు హెచ్చరించారు. -
సుప్రీంకోర్టు ఉత్తర్వులు హర్షనీయం
[ 19-05-2024]
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై మాట్లాడ వద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులివ్వడం హర్షనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా సెల్ విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమి కబ్జా
[ 19-05-2024]
సిద్దవటం మండలం టక్కోలు గ్రామ సచివాలయం సమీపంలో రూ.కోటి విలువైన ప్రభుత్వ భూమిని స్థానిక వైకాపా నేత కబ్జా చేసి రాత్రికిరాత్రే మామిడి మొక్కలు నాటారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ భూకబ్జా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
తెలంగాణ ఈఏపీసెట్లో మెరిసిన మదనపల్లె విద్యార్థిని
[ 19-05-2024]
లక్ష్యం, పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని నిరూపించింది మదనపల్లెకు చెందిన ప్రణీత. తెలంగాణ ఈఏపీసెట్లో అగ్రికల్చర్ ఫార్మశీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచి ప్రశంసలు అందుకుంటోంది. -
ఆగడంలేదు... ఆపడంలేదు!
[ 19-05-2024]
మదనపల్లెలో వైకాపా నేతల అండదండలతో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుక దందా సాగిస్తున్నారు. నదులు, వంకలు, చెరువుల్లో యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు, రవాణా కొనసాగిస్తున్నారు.