జగన్ చిత్రాలపై ముసుగేదీ..?
మండలంలో కోడ్ ఉల్లంఘనల పరంపర కొనసాగుతూనే ఉంది. పుల్లూరు సచివాలయంపై వైఎస్ జగన్ చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలనాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.
పుల్లూరు సచివాలయంపై కనిపిస్తున్న వైఎస్ జగన్ చిత్రం
ఖాజీపేట, న్యూస్టుడే: మండలంలో కోడ్ ఉల్లంఘనల పరంపర కొనసాగుతూనే ఉంది. పుల్లూరు సచివాలయంపై వైఎస్ జగన్ చిత్రం స్పష్టంగా కనిపిస్తున్నా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పరిశీలనాధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అరకొరగా తాత్కాలిక చర్యలు తీసుకొని చిత్రాలకు ముసుగులు వేసినప్పటికీ అవి చిరిగిపోయి తిరిగి దర్శనమిస్తున్నాయి. ఇలాంటి చిత్రాలను పూర్తి స్ధాయిలో కనిపించకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంది.
వైకాపా కోడ్ ఉల్లంఘన చర్యలెక్కడా..?
పోరుమామిళ్ల, బద్వేలు: పోరుమామిళ్ల మండలంలోని బాలిరెడ్డిపల్లెలో బుధవారం రాత్రి వైకాపా నాయకులు సిద్ధం స్టిక్కర్లను ఊరంతా అతికించే కార్యక్రమాన్ని చేపట్టారు. విద్యుత్తు స్తంభాలకు, ఇంటి గోడలకు, ప్రహరీలకు జగన్ స్టిక్కర్లు అంటించారు. గ్రామాల్లో యథేచ్ఛగా వైకాపా నాయకులు కోడ్ ఉల్లంఘన చేపడుతున్నా అధికారులు విచారించి చర్యలు చేపట్టిన సందర్భాలు లేవు. మంగళవారం అట్లూరు మండలంలోని వేమలూరులో కూడా ఇదే తంతు కొనసాగింది.
ఇక్కడ కోడ్... వర్తించదా
ఎర్రగుంట్ల (ముద్దనూరు): మండలంలోని ఉప్పలూరు గ్రామంలో బస్టాండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిమ్మెకు వైకాపా రంగులు అలాగే ఉన్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి తమకు వర్తించదన్నట్లుగానే అధికారులు వ్యవహరిస్తూన్నారు, అధికార పార్టీ జెండా రంగులు కనిపిస్తున్నా అధికారులు కూడా చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు.
వాలంటీర్లు అతికించారు.. అధికారులు తొలగించారు
బి.కోడూరు, కాశినాయన: ఎన్నికల నియమావళిని వైకాపా నాయకులు, వాలంటీర్లు తుంగలో తొక్కుతున్నారు. మండలంలోని పిట్టిగుంట ఓబులాపురం గ్రామాల్లో బుధవారం సాయంత్రం నాయకులు వాలంటీర్లు కలిసి.. ఇంటింటికి వెళ్లి పేర్లు నమోదు చేసుకుంటూ, తమ ఇంటికి స్టిక్కర్లు అతికించవద్దని చెబుతున్నా జగనన్న చిత్రం ఉండే బొమ్మలను అతికించారు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు రాత్రి ఏడు గంటలకు గ్రామానికి వచ్చి స్లిక్కర్లను తొలగించారు. అతికించిన నాయకులు, వాలంటీర్లు అధికారులకు తెలిసినా వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు