కేంద్రం పాఠ్యాంశంగా చేర్చితే... రాష్ట్రం రోడ్డు వేయలే
అవి కొండల్లో దాగి ఉన్న రేఖాచిత్రాలు. ఆదిమానవుడు వాటిని గీసినట్లుగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో ఉన్న శిలా చిత్ర లేఖనాలు దేశంలోనే రెండో అతిపెద్దవిగా ప్రసిద్ధి పొందాయి.
దేశంలోనే రెండో అతిపెద్ద ఆదిమానవుడి ఆనవాళ్లు
పర్యాటకం దిశగా అభివృద్ధికి దూరం
ఎర్రమల కొండపైకి చేరుకునేందుకు అధ్వానంగా ఉన్న రహదారి
న్యూస్టుడే, కొండాపురం: అవి కొండల్లో దాగి ఉన్న రేఖాచిత్రాలు. ఆదిమానవుడు వాటిని గీసినట్లుగా చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామంలో ఉన్న శిలా చిత్ర లేఖనాలు దేశంలోనే రెండో అతిపెద్దవిగా ప్రసిద్ధి పొందాయి. దక్షిణ భారతదేశంలో శిలాయుగ విశిష్ట లక్షణాలుగా ఇవి పేరుప్రఖ్యాతులు సాధించాయి. ఇంతటి చరిత్ర కల్గిన ప్రదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో ఉన్నా నేటీకీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందలేదు. ఐదేళ్ల పాలనలో అభివృద్ధి వైపు అడుగులు పడకపోవడం గమనార్హం. ఎర్రమల కొండల్లో ఉన్న ఈ శిలాచిత్రలేఖనాలు చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయి. ఎర్రమల కొండపైనే కోనలింగేశ్వరాలయం, పక్కనే బ్రిటీషు కాలంనాటి చెరువుతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది. ఇక్కడ మొత్తం 15 శిలాశ్రయాలు ఉండగా, వీటిల్లో పదింటిపై రేఖాచిత్రాలు కనిపిస్తాయి. వీటిని ఎద్దుల ఆవుల, గొడుగు, మబ్బు, పెద్దావిడ, చిన్నావిడ, మారెమ్మ, పిడుగు, పడగ, ధనం, సన్యాసం, వనం, చిలకల, చెంబు, కలం గుండ్లుగా స్థానికులు పిలుచుకుంటారు. ఇవి ఎండ, వానకు ప్రజలు తలదాచుకునేందుకు వీలుగా ఉన్నాయి. ఈ శిలాశ్రయాలపై ఎరుపు, తెలుగు రంగుల్లో జింక, దుప్పి, మూపరం ఎద్దులు, ఏనుగులు, నక్క, కుందేలు, హైనా, సర్పాలు, పక్షులు, రేఖాంశరూపాలు, మానవాకృతులు ఉన్నాయి. విల్లులు పట్టుకున్న ఏనుగు మీద ఎక్కిన, ఒకరికొకరు ఎదురుగా ఉన్న మానవాకృతులు మనకు కనిపిస్తాయి.
సందర్శకులకు దారేదీ..?
దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ శిలాచిత్రలేఖనాల స్థావరంగా పేరొందిన చింతకుంట అభివృద్ధికి మాత్రం నోచుకోవట్లేదు. వేల ఏళ్ల కిందట అపురూప సంపద ఇక్కడ ఉన్నా దాన్ని పాలకుల అశ్రద్ధ వల్ల సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ఈ ప్రాంతాన్ని చూసేందుకు వచ్చే సందర్శకులు అక్కడికి చేరుకోవడానికి సరైన రహదారి కూడా లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. దేశానికే తలమానికమైన శిలాచిత్రాలు జిల్లాలోనే ఉన్నా..జిల్లావాసి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐదేళ్ల నుంచి పాలన చేస్తున్నా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదని జిల్లా ప్రజలు వాపోతున్నారు.
ఆరో తరగతిలో పాఠం..
చింతకుంట రేఖాచిత్రాలపై 2013లో ఆరో తరగతి సాంఘికశాస్త్ర పాఠ్యపుస్తకంలో ప్రచురించారు. చిన్నారులు ఆదిమానవుని రేఖాచిత్రాలను చదువుకుంటున్నారు కానీ.. వాటినీ చూడడానికి వెళ్లలేని పరిస్థితి అక్కడ నెలకొంది. ఎంతో ప్రాముఖ్యత కల్గిన ఈ ప్రాంతాన్ని సీఎం జగన్ అభివృద్ది చేయకపోవడం ఏమిటని జిల్లా పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని భీమ్బేట్కా తర్వాత దేశంలో రెండో అతిపెద్ద శిలాచిత్ర లేఖనాలున్న ఈ ప్రదేశాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి.
సొంత జిల్లా అయిన సీఎంకు శ్రద్ధ లేదు
ఐదేళ్ల వైకాపా పాలనలో కనీసం ఈ ప్రాôతం అభివృద్ధి చెందలేదు. సీఎం సొంత జిల్లాలో దేశంలోనే అతిపెద్ద శిల్ప చిత్రలేఖనాలు ఉన్నా వాటిని చూడడానికి పర్యాటకులకు కనీసం దారి లేదు. ఆదిమానవుడు గీసిన చిత్రాలు చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి సైతం పర్యాటకులు వస్తుంటారు. అక్కడి వెళ్లడానికి కనీసం దారికూడా సరిగాలేదు. కొండల్లో రేఖాచిత్రాలు ఉన్న ప్రదేశంకు సరైన దారిలేక పర్యాటకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.
నాగిరెడ్డి, చింతకుంట గ్రామం.
రక్షిత ప్రదేశంగా ప్రకటించాలి
ఆదిమానవుడు గీసిన చిత్రాలను కాపాడుకోవలసిన బాధ్యత అందరిపై ఉంది. దేశంలోనే గుర్తింపు పొందిన చింతకుంట చిత్రాలు ఆంధ్రప్రదేశ్కే కీర్తి. అలాంటి ప్రదేశం సీఎం జగన్ సొంత జిల్లాలో ఉన్నా నేడు ఈ ప్రాంతం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే రానున్న తరాలు నాటి చరితను తెలుసుకునేందుకు వీలుగా ఉంటుంది.
ఆదినారాయణరెడ్డి, చింతకుంట గ్రామం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!
-
కోహ్లీ రికార్డు బద్దలు.. నాకు మంచి రోజులు నడుస్తున్నాయ్: అభిషేక్ శర్మ
-
ఇరాన్ అధ్యక్షుడు రైసీ దుర్మరణం.. మోదీ దిగ్భ్రాంతి
-
బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!
-
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్కు సిద్ధమైన పాయల్ రాజ్పుత్