కూటమితోనే ముస్లిం మైనార్టీలకు భరోసా
అయిదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం గాలి కొదిలి, నేడు మళ్లీ ఓట్లు దండుకోవడానికి మాయమాటలు చెబుతున్నారని ఇలాంటి పార్టీ నాయకుల మాటలు ముస్లింలు నమ్మవద్దని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.షాజహాన్బాషా కోరారు.
వైకాపా మాయమాటలు నమ్మొద్దు
మాట్లాడుతున్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా, వేదికపై మైనార్టీ నాయకులు
మదనపల్లె పట్టణం, న్యూస్టుడే : అయిదు సంవత్సరాలు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమం గాలి కొదిలి, నేడు మళ్లీ ఓట్లు దండుకోవడానికి మాయమాటలు చెబుతున్నారని ఇలాంటి పార్టీ నాయకుల మాటలు ముస్లింలు నమ్మవద్దని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.షాజహాన్బాషా కోరారు. గురువారం మదనపల్లె పట్టణం బుగ్గకాలువలోని ఓ ప్రైవేటు కల్యాణ మండలంలో తెదేపా ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్బాషా మాట్లాడుతూ... అయిదు సంవత్సరాలుగా గుర్తుకు రాని ముస్లింలు నేడు హఠాత్తుగా వైకాపా నాయకులకు గుర్తుకొచ్చారని ఎద్దేవా చేశారు. కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాంకు భూమిని వైకాపా నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకోవడం జరిగిందన్నారు. న్యాయం చేయాలని కోరుతూ ఆయన కుటుంబం సీఎం జగన్మోహన్రెడ్డికి సోషల్ మీడియా ద్వారా విన్నవించారని తెలిపారు. చివరకు వైకాపా నాయకులు దౌర్జన్యాలను భరించలేక కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరులో పదో తరగతి అమ్మాయి మిస్బా తరగతిలో మొదటి ర్యాంకు మార్కులు తెచ్చుకుంటుంటే జీర్ణించుకోలేని స్థానిక వైకాపా నాయకుడు విద్యార్థిని తల్లిదండ్రులను వేధించేవాడని తెలిపారు. ఆయన కుతూరుకు మొదటి ర్యాంకు వచ్చే విధంగా ఉపాధ్యాయులపై ఒత్తిడి తెచ్చేవారని, ఈ నేపథ్యంలో మిస్బా మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందన్నారు. మదనపల్లెలోని టిప్పుసుల్తాన్ మైదానంలో పేద ముస్లింలకు షెడ్లు వేసుకుంటే వాటిని కూలదోయించి వైకాపా నాయకులు క్రూరత్వాన్ని చాటుకున్నారని విమర్శించారు. ఇలాంటి దుర్మార్గమైన ఘటనలు రాష్ట్రంలో అనేకమున్నాయని ముస్లిం మైనార్టీలు ఆలోచించి వచ్చే ఎన్నికల్లో తగిన నిర్ణయం తీసుకుని వైకాపాను ఇంటికి సాగనంపాలని కోరారు. ఎన్ఆర్సీ, సీఏఏపై ముస్లిం మైనార్టీల్లో అలజడి సృష్టించి ఓటు బ్యాంకు రాజకీయం చేయాలని వైకాపా నాయకులు కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ఎన్ఆర్ర్సీ, సీఏఏ బిల్లులపై ముందుగానే ఎంపీ మిథున్రెడ్డి ఎందుకు ఓట్లు వేశారని ప్రశ్నించారు. తెదేపా ప్రభుత్వంలో అమలు చేసిన విదేశీ విద్య, దుల్హన్, రంజాన్తోఫా, దుకాణ్ ఔర్ మకాన్ పథకాలను జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రద్దు చేసిందన్నారు. అయిదు రోజులు తనకోసం పనిచేస్తే, 5 సంవత్సరాలు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ముస్లిం మైనార్టీ పెద్దలు మహమ్మద్ జలాలుద్దీన్, ఖాసీం రఫీ, బషీర్ మౌలానా, నిస్సార్, ముబారక్, అబ్దుల్లా, మౌలానా జబ్బార్, సల్మాన్, తెదేపా మైనార్టీ నాయకులు ఎస్.ఎ.మస్తాన్, ఎస్.ఎం.రఫి, దాదాపీర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒట్టేశారు.. ఓటేశారు!.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మలా పల్లెలు
[ 20-05-2024]
ఓటు.. సామాన్యుడి చేతిలో వజ్రాయుధం.. దానిని అంకుశంలా వినియోగించే వారే నిజమైన ఓటరు.. మన చేతిలోనే భవిష్యత్తు దాగి ఉందని చాటి చెబుతున్నారు వారు. -
ఎవరికో నవ వసంతం
[ 20-05-2024]
యువత... జ్వలించే కాంక్ష, అవినీతిని ఎదురించే తత్వం, అక్రమాలను అంగీకరించని స్వభావం, ఉపాధి లేమిని సహించని నైజం, సమాజ సంక్షేమాన్ని కోరుకునే మనస్తత్వం అలాంటి వారు ఓటెత్తితే తప్పనిసరిగా అది మార్పుకు శ్రీకారం చుట్టినట్లే. -
వివాదాస్పద భూమిలో కంచె ఏర్పాటును అడ్డుకున్న గ్రామస్థులు
[ 20-05-2024]
సిద్దవటం మండలంలోని కడపాయపల్లెలో భూవివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ విషయమై ఆదివారం అధికారులను గ్రామంలోకి రాకుండా స్థానిక దళితులు అడ్డుకున్నారు. -
ఎన్నికల అలవెన్సుల మంజూరుకు డిమాండు
[ 20-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించిన ఆశా కార్యకర్తలకు ఎన్నికల అలవెన్సును తక్షణమే చెల్లించాలని ఏఐటీయూసీ -
అందాల కొండ... నష్టాలే నిండా!
[ 20-05-2024]
రాష్ట్రంలో వేసవి విడిది కేంద్రంగా గుర్తింపు పొందిన హార్సిలీహిల్స్కు పర్యాటకుల తాకిడి తగ్గింది. గత ఏడాది వేసవి సీజన్తో పోల్చిచూస్తే పర్యాటకుల సంఖ్యతో పాటు వ్యాపారాలు పడిపోయాయి. -
ఎండుతున్న చీనీతోటలు.. అన్నదాతలకు కన్నీళ్లు
[ 20-05-2024]
చీనీపంట అంటేనే ఒకప్పుడు కాసులు కురిపించే పంట. కానీ ప్రస్తుతం చీడపీడలతో ఎండిపోతున్నాయి. -
సౌరభం.. సులభంగా శుభ్రం
[ 20-05-2024]
దేశంలో ఎక్కడ చూసినా సోలార్ వినియోగం ఘననీయంగా పెరుగుతోంది. సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా... దానిపై పడి దుమ్ము, ధూళీ కారణంగా ఎనర్జీ ప్రొడక్షన్ తగ్గి నష్టం వచ్చే అవకాశం ఉంది. -
వేసవి వినోదం... విజ్ఞాన సంబరం
[ 20-05-2024]
ఒకనాడు వేసవి సెలవులంటే పిల్లలంతా బంధువుల ఇంటికి.. విహార యాత్రలకు వెళ్లేవారు. -
ఇసుక తోడేళ్ల పాపం... తలా పిడికెడు
[ 20-05-2024]
మండలంలోని దర్జిపల్లి శివారులో (గొల్లపల్లి రేవు పేరిట) అధికారులు రెండు నెలల కిందట అనుమతిచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా
-
విశాఖ ఘటనపై చర్యలు తీసుకోండి: ఈసీకి అచ్చెన్నాయుడు లేఖ