Andhra News: రహదారి విషయంలో ఇరు వర్గాల ఘర్షణ.. ఇద్దరిపై కత్తితో దాడి
ఏలూరు జిల్లా ముదినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రహదారి విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరగ్గా..
ముదినేపల్లి: ఏలూరు జిల్లా ముదినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. రహదారి విషయంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ జరగ్గా.. ఇరాన్ అనే వ్యక్తి ఇద్దరిపై కత్తితో దాడి చేశాడు. ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో ముదినేపల్లిలో రెండు వర్గాల మధ్య రహదారి విషయంలో గొడవ జరిగింది. ఈ క్రమంలో వర్రె నాగేంద్ర (35), అరుగుల మహేశ్(27)లపై ఇర్ఫాన్ దాడి చేశాడు.
దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను స్థానికులు విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ ఉదయం నాగేంద్ర మృతి చెందగా.. మహేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుడు నాగేంద్ర మాలమహానాడు జిల్లా అధ్యక్షుడని పోలీసులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.