విద్యుత్తు.. కారాదు విపత్తు
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఏటా మే 1-7 వరకు విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రచారం చేస్తున్నారు.
కొనసాగుతున్న విద్యుత్తు భద్రతా వారోత్సవాలు
కాగజ్నగర్, న్యూస్టుడే
ప్రచార కరపత్రం
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. అప్రమత్తతతోనే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణుల అభిప్రాయం. ఏటా మే 1-7 వరకు విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు ప్రచారం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని గృహ, వ్యవసాయ, ఇతరాలు మొత్తం 8,29,408 కనెక్షన్లు ఉన్నాయి. చాలా చోట చేతికందే ఎత్తులో తీగలు, రక్షణలేని నియంత్రికలతో ఏటా ప్రమాదాలు జరుగుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాలు, ఉమ్మడి జిల్లాలోని 13 బల్దియాల్లోనూ పలు చోట్ల వంగిన స్తంభాలు, నియంత్రికల చుట్టు పిచ్చిమొక్కలతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఏటా విద్యుత్తు ప్రమాదాలతో 50-100 పశువులు, పలువురు వ్యక్తులు మృత్యువాత పడుతున్నారు. వ్యక్తి చనిపోతే రూ.5 లక్షలు, పశువులకు రూ.35 వేల వరకు సాయం అందిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ఇలా..
- కాగజ్నగర్ పురపాలికలోని విద్యుత్తు విభాగంలో విధులు నిర్వహించే వారికి పాతకాలం నాటి కర్రల నిచ్చెనలతో విద్యుత్తు స్తంభాలు ఎక్కి దీపాల మరమ్మతులు చేస్తున్నారు. తరచూ ఆ నిచ్చెన నుంచి ప్రమాదవశాత్తు కిందపడి, తీవ్రగాయాలైన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం ఆధునిక యంత్రాలు(నిచ్చెనలు) అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగిస్తే.. ఉపయోగకరంగా ఉంటాయి.
- వ్యవసాయ, గృహాలలో నాణ్యమైన విద్యుత్తు పరికరాలు వాడాలి. పట్టణ, గ్రామాల్లో పలువురు డిస్కం అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా స్తంభాలు ఎక్కడం, మరమ్మతులు చేయడం వంటివి చేస్తుంటారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు.
- పట్టణ, గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయక్షేత్రాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్తు నియంత్రికల చుట్టు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ చెడిపోయాయి మరమ్మతులు, తిరిగి నూతనంగా ఏర్పాటు చేయడం లేదు. ఇటీవల నియంత్రికలు, విద్యుత్తు స్తంభాల తీగల చుట్టు పిచ్చిమొక్కలు పెరగడంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి.
- మారుమూల మండలాల్లోని రైతులు తమ పంట పొలాల్లోని నియంత్రికలను తామే స్వయంగా మరమ్మతులు చేసేందుకు యత్నిస్తుంటారు. అలాంటి చర్యలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్తు అధికారుల సూచనలు, సలహాలను పాటించాల్సిందే.
- ఐఎస్ఐ, ప్రముఖ కంపెనీల విద్యుత్తు తీగలు, పంపులు, ఇతర పరికరాలను వినియోగించాలి.
- హెచ్.టి.ఫ్యూజ్, ఎల్టీ ఫ్యూజ్ మార్చడానికి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ను అనధికారికంగా ఎక్కరాదు.
- సర్వీస్ వైర్లు, విద్యుత్తు వీధిదీపాలను సరి చేసేందుకు ఇతరులు విద్యుత్తు స్తంభాలను ఎక్కరాదు
- ఇంటి వరండాలో కాంపౌండ్లో ఎలక్ట్రికల్ హౌజ్ వైరింగ్కు సమీపంలో జి.ఐ వైర్లను దండేలుగా కట్టి తడి దుస్తులు ఆరవేయడం ప్రమాదం.
- గాలి పటాలు విద్యుత్తు తీగలకు చుట్టుకుంటే తీసే ప్రయత్నం చేయరాదు.
- విద్యుత్తు లైన్ల కింద పందిళ్లు, జెండాలు కట్టరాదు.
- ఐఎస్ఐ మార్కు మోనోబ్లాక్ పంపుసెట్లు, సబ్మెర్సిబుల్ పంపు సెట్లను మాత్రమే వినియోగించాలి.
అవగాహన సదస్సులు
- సి.నాగరాజు, డీఈ, డిస్కం కాగజ్నగర్ డివిజన్
విద్యుత్తు భద్రతా వారోత్సవాల్లో భాగంగా వినియోగదారులకు ప్రమాదాల నివారణపై సదస్సులు నిర్వహిస్తున్నాం. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన చేపడుతున్నాం. సిబ్బంది, అధికారులు వినియోగదారులు, రైతులకు అందుబాటులో ఉండి, నాణ్యమైన విద్యుత్తు అందించడంతోపాటు, ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు, సలహాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కీలక సమయం.. జాగ్రత్తలే ప్రదానం
[ 17-06-2024]
వానాకాలం సీజన్ మొదలైనా వర్షాల జాడలేదు. ఏ విత్తనాలు విత్తుకోవాలి, మొక్కలను ఎలా కాపాడుకోవాలి, కలుపు మందు ఎప్పుడు పిచికారీ చేయాలి. ఎరువులు ఎలా వేయాలి, ఎంత వేయాలి, తెగుళ్ల నివారణకు ఏ మందులు వాడాలి. -
లింక్ క్లిక్ చేస్తే వాట్సాప్ హ్యాక్
[ 17-06-2024]
చేతిలో చరవాణి ఉంది కదా అని గ్రూపులో వచ్చిన లింక్లను క్లిక్ చేసుకుంటూ పోతే మన చరవాణి హ్యాక్ అయిపోవడం ఖాయం. అంతేకాదు మన ఫోన్ నెంబరుతో ఇతరులకు సందేశాలు పంపించే ప్రమాదం ఉంది. -
బాడుగకు కాడెడ్లు
[ 17-06-2024]
వానాకాలం వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. చాలా మంది రైతులు విత్తనాలు విత్తుకోగా, మరికొంత మంది విత్తుకునేందుకు భూమిని సిద్ధం చేస్తున్నారు. యాంత్రికీకరణ పెరిగిన నేపథ్యంలో కొంతకాలంగా దుక్కులు దున్నడం, చదును చేసే పనులను అన్నదాతలు ట్రాక్టర్ల సాయంతోనే పూర్తి చేస్తున్నారు. -
కొత్త కార్డులు.. సన్న బియ్యం
[ 17-06-2024]
అర్హులందరికీ కొత్త రేషన్కార్డుల మంజూరు త్వరలోనే ఉంటుందని, దీనిపై రాష్ట్ర కేబినెట్ సమావేశంలో విధివిధానాలను రూపొందించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తాజాగా వెల్లడించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. -
త్యాగానికి గుర్తు ‘బక్రీద్’
[ 17-06-2024]
ముస్లిం సోదరులు అత్యంత పవిత్రంగా నిర్వహించుకునే పండగల్లో మొదటిది ఈద్ ఉల్ ఫితర్(రంజాన్). రెండోది ఈద్ ఉల్ అజా(బక్రీద్). రంజాన్లో దైవాన్ని సంతుష్ట పర్చటానికి అత్యంత కఠిన ఉపవాసాలు చేయటంతో పాటు దానధర్మాలు ఎక్కువగా చేస్తారు. -
గొర్రెలు లేవు.. డబ్బులు వెనక్కి!
[ 17-06-2024]
గొల్ల కుర్మ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. మొదటి విడత పంపిణీ సవ్యంగా జరిగినా రెండో విడతలో కొంత మందికే అందించారు. -
గోంది అటవీప్రాంతంలో పులి కదలికలు?
[ 17-06-2024]
మండలంలోని గోంది అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిల్లలున్న ఆడ పులి అడ ప్రాజెక్టు కాలువ ప్రాంతంలో స్థావరం ఏర్పాటు చేసుకుని సమీప ప్రాంతాల్లో సంచరిస్తోంది. -
నిధులపై ఆశలు.. పరిష్కారానికి అడుగులు
[ 17-06-2024]
అనధికారిక ప్లాట్లు, అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్) పెండింగ్ దరఖాస్తులు వేగంగా పరిష్కరించాలని ఈనెల 7న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మరోసారి అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై గతంలో కదలిక వచ్చినా సార్వత్రిక ఎన్నికల కారణంగా మళ్లీ మొదటికొచ్చింది. -
మధ్యాహ్నం ఎండ.. సాయంత్రం వర్షం
[ 17-06-2024]
రుతుపవనాల విస్తరణ ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు గడిచిన వారంతో పోలిస్తే క్రమంగా తగ్గుతుండటంతో జిల్లా వాసులు కాస్త ఉపశమనం పొందుతున్నారు. -
ఏఆర్టీ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు
[ 17-06-2024]
హెచ్ఐవీ బాధితులకు మంచిరోజులు వస్తున్నాయి. జిల్లాలో అందుబాటులోకి వచ్చిన ప్రభుత్వ వైద్యకళాశాలతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఏఆర్టీ(యాంటీ రిట్రో వైరల్ థెరఫీ) కేంద్రం ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. -
దారి కష్టాలు తీరేనా?
[ 17-06-2024]
ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులకు వానాకాలంలో కష్టాలు తప్పేలా కనిపించడం లేదు. గతసంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు రెంకోనివాగు పొంగిపొర్లడంతో పాఠశాలకు వెళ్లే తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. -
ప్రవేశాలకు పెరిగిన పోటీ
[ 17-06-2024]
సాధారణంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాలకు పెద్దగా పోటీ కనిపించదు. చాలా చోట్ల విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా కొన్ని చోట్ల పాఠశాలలు ఎత్తేసే పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి లేదు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘చంద్రబాబు ఫొటో ఉన్నాక ఎవరైనా కేసు నమోదు చేస్తారా?’
-
ధార్ గ్యాంగ్.. మళ్లీ వచ్చేసింది
-
ఎన్నికల్లో గెలిస్తే.. అమెరికా నుంచి వారిని సాగనంపుతా: ట్రంప్
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/06/24)