వనమిత్రపై శీతకన్ను
పర్యటక శాఖ మన్యంలో అనేక ఎకో టూరిజం ప్రాజెక్టులు నిర్వహిస్తూ సందర్శ కులను ఆకర్షిస్తోంది. అటవీశాఖ సైతం పర్యటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
నాలుగేళ్లుగా ముందుకు కదలని పనులు
న్యూస్టుడే, అనంతగిరి
అసంపూర్తిగా వనమిత్ర సముదాయం
పర్యటక శాఖ మన్యంలో అనేక ఎకో టూరిజం ప్రాజెక్టులు నిర్వహిస్తూ సందర్శ కులను ఆకర్షిస్తోంది. అటవీశాఖ సైతం పర్యటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఎంపిక చేసిన కొన్నిచోట్ల ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించగా.. అనంతగిరి మండలంలో చివరి దశకు వచ్చిన పనులు నాలుగేళ్లుగా అలాగే నిలిచిపోయాయి.
పర్యటకులకు మన్యం ముఖద్వారమైన చిలకలగెడ్డ వద్ద అటవీశాఖ ఠాణా స్వాగతం పలుకుతుంది. సుదూర ప్రాంతం ప్రయాణించి వచ్చే పర్యటకులు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోవటంతో పాటు అల్పాహారం తీసుకునే విధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమిత్ర ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఒక భవనం ఏర్పాటుతో పాటు.. అటవీశాఖ వద్ద లభించే రకరకాల ఆయుర్వేద మొక్కలు, ఇతర మొక్కలతో దీని ఆవరణలో నర్సరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మొక్కల విక్రయం ద్వారా అటవీశాఖకు కొంత ఆదాయం వచ్చేలా, ఇతర ఆకర్షణలతో దీనిని ఏర్పాటు చేశారు. చుట్టూ అటవీ ప్రాంతం.. పలు రకాల మొక్కల నర్సరీ మధ్యలో ఈ భవనం ఏర్పాటు చేయటంతో పర్యటకులకు మంచి అనుభూతి ఇవ్వొచ్చని అటవీ శాఖ భావించింది. ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇటువంటి ప్రయోగాత్మక ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇవ్వడంతో చిలకలగెడ్డలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
రూ.10 లక్షల కేటాయింపు
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తంతో పనులు చేపట్టిన అటవీశాఖ అధికారులు చివరిదశలో నిధులు చాలక నిలిపేశారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి అటవీశాఖ అధికారులు నివేదికలు పంపించారు. ఈ లోపు ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం దీనిపై శీతకన్ను వేసింది. ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవటంతో పనులు నాలుగేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ వనమిత్ర భవనం నిర్మాణం కూడా పూర్తి కాకుండానే పిచ్చిమొక్కలు మొలిచి భవనం శిథిలావస్థకు చేరింది. స్థానిక అటవీశాఖ సిబ్బంది తమ సొంత నిధులతో ఇటీవల భవనమంతా శుభ్రం చేయించే పనులు చేపట్టారు.
నిధులు విడుదల కాలేదు..
వనమిత్ర భవనానికి అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. కానీ మంజూరు కాలేదు. నిధులు మంజూరైతే మిగతా పనులు చేపట్టి పర్యటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
దుర్గాప్రసాద్, రేంజ్ అధికారి అనంతగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తేలని భూసారం.. సాగు నిస్సారం..!
[ 20-05-2024]
భూసారం అనుగుణంగానే పంటల సాగు, దాన్లో ఎరువుల వినియోగం జరగాలి. లేకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. -
గెలిచేది తెదేపా కూటమే
[ 20-05-2024]
రాష్ట్రంలో ఈ నెల 13న జరిగిన పోలింగ్లో ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓట్లు వేశారని, గెలిచేది తెదేపా కూటమేనని పాడేరు నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అన్నారు. -
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లు
[ 20-05-2024]
రెండు నెలలు.. రూ. 3.89 కోట్లుఎన్నికల పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చేది రాజకీయ నాయకుల ప్రచారాలు, ప్రలోభాలు. ఇందుల్లో ప్రలోభాలకు అడ్డుకట్ట వేయడానికి ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లాలో రెండు నెలలపాటు ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, ఇతర ప్రదేశాల్లో చేసిన తనిఖీల ద్వారా అధికారులు వందల కొద్ది కేసులు పెట్టి, రూ. కోట్ల విలువైన సొత్తు పట్టుకున్నారు. -
సెలవుల్లో ఆడుతూ.. పాడుతూ!
[ 20-05-2024]
వేసవి సెలవుల్లో పిల్లలు విద్యకు దూరం కాకూడనే ఉద్దేశంతో విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. -
మోదకొండమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
మన్యం ప్రజల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. -
ఎగువగుడ్డిలో తాగునీటి ఎద్దడి
[ 20-05-2024]
మంచినీటి సౌకర్యం కల్పించాలని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి గ్రామస్థులు ఆదివారం ఖాళీ బిందెలతో మెకాళ్లపై నిల్చుని ఆందోళన చేపట్టారు. -
వైభవోపేతంగా కల్యాణోత్సవం
[ 20-05-2024]
అరకులోయలో వేంచేసిన అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
సెలవుల్లో సరిగమలు.. బుడతల సరాగాలు
[ 20-05-2024]
ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో సంగీత శిక్షణపై మక్కువ చూపుతున్నారు. సెలవులను వృథా చేసుకోకుండా తమకు నచ్చిన రంగంలో శిక్షణ పొందేందుకు మక్కువ చూపుతున్నారు. -
ఉపాధి హామీ పనులపై వివాదం
[ 20-05-2024]
గోవాడ గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయంటూ ఇచ్చిన ఫిర్యాదు ఇరువర్గాల మధ్య వివాదాన్ని రేపింది. -
9 నెలలుగా జీతాల్లేవ్!
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలోని వ్యసన విముక్తి కేంద్రం (డీ ఎడిక్షన్ సెంటర్)లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలల నుంచి జీతాలు రాలేదు. -
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో జిల్లాలోని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలిపారు. -
సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరణ
[ 20-05-2024]
అనకాపల్లి జిల్లా మామిడిపల్లికి చెందిన గుత్తేదారు ఎన్.మణికంఠ నుంచి కొందరు వ్యక్తులు పొలీసులమని చెప్పి సినీ ఫక్కీలో రూ.10 లక్షల నగదు తస్కరించిన ఘటన సారవకోట మండలం ధర్మలక్ష్మీపురంలో శనివారం చోటుచేసుకుంది. -
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి
[ 20-05-2024]
కేజీహెచ్కు డెంగీ కేసుల తాకిడి పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో మార్పు వచ్చింది. డెంగీ దోమలు విజృంభిస్తున్నాయి.