వనమిత్రపై శీతకన్ను
పర్యటక శాఖ మన్యంలో అనేక ఎకో టూరిజం ప్రాజెక్టులు నిర్వహిస్తూ సందర్శ కులను ఆకర్షిస్తోంది. అటవీశాఖ సైతం పర్యటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
నాలుగేళ్లుగా ముందుకు కదలని పనులు
న్యూస్టుడే, అనంతగిరి
అసంపూర్తిగా వనమిత్ర సముదాయం
పర్యటక శాఖ మన్యంలో అనేక ఎకో టూరిజం ప్రాజెక్టులు నిర్వహిస్తూ సందర్శ కులను ఆకర్షిస్తోంది. అటవీశాఖ సైతం పర్యటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో తెదేపా ప్రభుత్వ హయాంలో ఓ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఎంపిక చేసిన కొన్నిచోట్ల ఈ ప్రాజెక్టుల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించగా.. అనంతగిరి మండలంలో చివరి దశకు వచ్చిన పనులు నాలుగేళ్లుగా అలాగే నిలిచిపోయాయి.
పర్యటకులకు మన్యం ముఖద్వారమైన చిలకలగెడ్డ వద్ద అటవీశాఖ ఠాణా స్వాగతం పలుకుతుంది. సుదూర ప్రాంతం ప్రయాణించి వచ్చే పర్యటకులు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోవటంతో పాటు అల్పాహారం తీసుకునే విధంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమిత్ర ప్రాజెక్టు ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఒక భవనం ఏర్పాటుతో పాటు.. అటవీశాఖ వద్ద లభించే రకరకాల ఆయుర్వేద మొక్కలు, ఇతర మొక్కలతో దీని ఆవరణలో నర్సరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ మొక్కల విక్రయం ద్వారా అటవీశాఖకు కొంత ఆదాయం వచ్చేలా, ఇతర ఆకర్షణలతో దీనిని ఏర్పాటు చేశారు. చుట్టూ అటవీ ప్రాంతం.. పలు రకాల మొక్కల నర్సరీ మధ్యలో ఈ భవనం ఏర్పాటు చేయటంతో పర్యటకులకు మంచి అనుభూతి ఇవ్వొచ్చని అటవీ శాఖ భావించింది. ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఇటువంటి ప్రయోగాత్మక ప్రాజెక్టులు మంచి ఫలితాలు ఇవ్వడంతో చిలకలగెడ్డలో ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు.
రూ.10 లక్షల కేటాయింపు
గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.10 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తంతో పనులు చేపట్టిన అటవీశాఖ అధికారులు చివరిదశలో నిధులు చాలక నిలిపేశారు. అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి అటవీశాఖ అధికారులు నివేదికలు పంపించారు. ఈ లోపు ప్రభుత్వం మారడంతో కొత్త ప్రభుత్వం దీనిపై శీతకన్ను వేసింది. ఎటువంటి నిధులు మంజూరు చేయకపోవటంతో పనులు నాలుగేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఈ వనమిత్ర భవనం నిర్మాణం కూడా పూర్తి కాకుండానే పిచ్చిమొక్కలు మొలిచి భవనం శిథిలావస్థకు చేరింది. స్థానిక అటవీశాఖ సిబ్బంది తమ సొంత నిధులతో ఇటీవల భవనమంతా శుభ్రం చేయించే పనులు చేపట్టారు.
నిధులు విడుదల కాలేదు..
వనమిత్ర భవనానికి అదనపు నిధుల కోసం ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. కానీ మంజూరు కాలేదు. నిధులు మంజూరైతే మిగతా పనులు చేపట్టి పర్యటకులకు అందుబాటులోకి తీసుకొస్తాం.
దుర్గాప్రసాద్, రేంజ్ అధికారి అనంతగిరి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పులకేశీ.. విపక్షాలపై ఎంత కసి?
[ 09-05-2024]
వైకాపా సర్కారు కొలువుదీరింది మొదలు విపక్ష నేతలే లక్ష్యంగా కక్షసాధింపు చర్యలకు దిగింది. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఎత్తిచూపినా.. అధికార పార్టీ నేతల అక్రమాలపై గొంతెత్తినా.. సర్కారు అవినీతిపై ప్రశ్నించినా.. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా కేసులు, అరెస్టులతో వేధింపులకు గురిచేశారు. సామాన్యుల నుంచి ఉద్యోగులు, విపక్ష నేతల వరకు అంతా ఈ అయిదేళ్లలో జగన్ నిరంకుశత్వ బాధితులే. -
జగన్ పాలనలో అన్నివర్గాలకూ ఇక్కట్లే
[ 09-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో అన్నివర్గాల వారూ ఇక్కట్లపాలయ్యారని అరకు ఎంపీ కూటమి అభ్యర్థిని కొత్తపల్లి గీత పేర్కొన్నారు. పలు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవితో కలసి ర్యాలీ నిర్వహించారు. -
యువత కూటమికి మద్దతివ్వాలి
[ 09-05-2024]
నిరుద్యోగ యువతను మోసం చేసిన వైకాపాను తరిమికొట్టి.. ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సిద్దిఖి పిలుపునిచ్చారు. -
వైకాపా దాడులు మితిమీరాయి..
[ 09-05-2024]
రంపచోడవరం నియోజకవర్గంలో వైకాపా నాయకుల దాడులు మితిమీరాయని, వీరిపై చర్యలు తీసుకుని ప్రశాంతవాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని అరకు ఎంపీ ఎన్డీయే అభ్యర్థి కొత్తపల్లి గీత పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి నిషాంత్కుమార్ను కోరారు. -
ఖనిజ సంపద కొల్లగొట్టే యత్నం
[ 09-05-2024]
గిరిజనుల పక్షాన నిలిచే వారికే ఓటు వేసి గెలిపించాలని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారాట్ పిలుపునిచ్చారు. బుధవారం పాడేరు, చింతపల్లిలో ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పి అప్పలనర్స, సతక బుల్లిబాబులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇచ్చేదేం లేదు.. అంతా పట్టుకుపోవడమే!
[ 09-05-2024]
నోటి ముందు కూడు లాగేయడం జగన్ ప్రభుత్వానికి తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు. రైతులకు ఉపయోగపడేలా కొత్తగా పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిందిపోయి ఉన్నవాటిని తరలించేశారు. -
ఎన్నికల్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సేవలు
[ 09-05-2024]
పోలింగ్ సమయంలో పీఓ, ఏపీఓ, ఓపీఓలు పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తుంటారు. బయట బీఎల్వోలు, భద్రతా సిబ్బంది తదితరులుంటారు. కేంద్రాల వద్దకు వచ్చే ఓటర్లలో ప్రత్యేకమైన సాయం కావల్సినవారు ఉంటారు. -
జగన్ జమానాలో ప్రయాణికుల హైరానా
[ 09-05-2024]
రోడ్లు బాగు చేయాల్సిన ప్రభుత్వం పట్టించుకోకపోవడం ప్రయాణికులకు శాపంగా మారుతోంది. సుదూర ప్రాంతాలకు కాలం చెల్లిన బస్సులు తిప్పుతుండటంతో గుంతల రోడ్లలో అవి ఆగిపోతున్నాయి. -
మడుగుల్లా మన్యం రోడ్లు మళ్లీ వేస్తారా ఓట్లు?
[ 09-05-2024]
జిల్లాలోని పలుచోట్ల రహదారులు దారుణంగా తయారయ్యాయి. గుంతలమయంగా మారి వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షం కురిసినా గుంతల్లో నీరు నిలిచి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంటోంది. -
నేడు విశాఖలో చంద్రబాబు సభ
[ 09-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు తెదేపా అధినేత చంద్రబాబునాయుడు గురువారం విశాఖ రానున్నారు. విశాఖ దక్షిణం, ఉత్తరం నియోజకవర్గాలకు సంబంధించి సీతంపేట కూడలిలో జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారని తెదేపా విశాఖ లోక్సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ తెలిపారు. -
నీలాద్రి గుమ్మం నుంచే నిజరూప దర్శనం
[ 09-05-2024]
సింహాద్రి అప్పన్న చందనోత్సవానికి పక్కాగా ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ మల్లికార్జున వెల్లడించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లో నగర పోలీసు కమిషనర్ రవిశంకర్తో కలిసి ఉత్సవానికి చేసిన ఏర్పాట్లను వివరించారు.
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్